Smart Phone Usage: స్మార్ట్ ఫోన్ ఎక్కువ మంది దేనికి వాడుతున్నారో తెలిస్తే షాక్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smart Phone Usage: స్మార్ట్ఫోన్లు మనిషి జీవితంలో భాగంగా మారి పోయాయి. ప్రతిరోజూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకొనే వరకు ఫోన్ను చూస్తేనే ఉంటాము. వివిధ అవసరాల కోసం ఫోన్లో సెర్చ్ చేస్తునే ఉంటాం. ఇవే కాకుండా సోషల్ మీడియాని ఉపయోగించడం, గేమ్లు ఆడడం ఇంకా వీడియోలు చూడటం వంటి అనేక పనులను చేస్తుంటాము. అయితే ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్ను దేనికి ఉపయోగిస్తున్నారో తెలిస్తే షాకవుతారు. ఎందుకంటే ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్ దానికోసమే వాడుతున్నారు. అదేంటంటే.. ఎక్కువ మంది తమ స్మార్ట్ ఫోన్ వాడకంపై వివో ఇటీవల ఒక పరిశోధన నివేదికను ప్రచురించింది. అందులో భారతీయులు వారి స్మార్ట్ఫోన్లలో ఎక్కువగా దేనిని ఉపయోగిస్తున్నారో చూపిస్తు ఈ వివరాలు నివేదికలో వెల్లడించింది.
Read also: WhatsApp: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ సేవలు
Also Read
ఇండియలోని ప్రజలు స్మార్ట్ఫోన్లు వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయి. నివేదిక ప్రకారం సాధారణంగా యుటిలిటీ బిల్లులను చెల్లించడానికి ఉపయోగిస్తున్నట్టు తేలింది. సుమారు 86 శాతం మంది ప్రజలు వారి స్మార్ట్ఫోన్ల ద్వారా యుటిలిటీ బిల్లులను చెల్లిస్తున్నారు. బిల్లులు చెల్లించడానికి ఆఫీసులకు వెళ్లకుండా తమ సమయాన్ని ఆదా చేసుకుంటూ ప్రజలు స్మార్ట్ ఫోన్ ద్వారానే బిల్లులను చెల్లిస్తున్నట్టు నివేదిక ద్వారా బహిర్గతం అయింది. ఇది చాలా అనుకూలమైన పద్ధతని..ఇంకా చాలా సమయాన్ని ఆదా చేస్తుందని వినియోగదారులు చెబుతున్నట్టు నివేదికలో ప్రకటించింది. బిల్లుల చెల్లింపు కోసమే కాకుండా షాపింగ్ కోసం కూడా ఉపయోగించబడుతుంది. నివేదిక ప్రకారం 80.8 శాతం మంది ప్రజలు వారి స్మార్ట్ఫోన్ల నుండి ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. దాదాపు 61.8 శాతం మంది స్మార్ట్ఫోన్ల నుంచి నిత్యావసర వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. 66.2 శాతం మంది ప్రజలు స్మార్ట్ఫోన్ల నుండి ఆన్లైన్లో సేవలను బుక్ చేసుకుంటున్నారు. 73.2 శాతం మంది ప్రజలు స్మార్ట్ఫోన్ల నుండి కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేస్తున్నారు. ఇంకా దాదాపు 58.3 శాతం మంది ప్రజలు స్మార్ట్ఫోన్ నుండి డిజిటల్ క్యాష్ తో చెల్లింపులు చెల్లిస్తున్నారు.
Read also: Vandebharat: టాయిలెట్ వస్తుందని వందేభారత్ ఎక్కాడు.. టిటి వచ్చి రూ.1000ఫైన్ వేశాడు
ఇండియాలో మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది స్మార్ట్ఫోన్లను ఉపయోగిస్తున్నారని నివేదికలో బయటపడింది. 62 శాతం మంది పురుషులు స్మార్ట్ఫోన్లను కలిగి ఉండగా.. 38 శాతం మంది మహిళలు మాత్రమే స్మార్ట్ఫోన్లను కలిగి ఉన్నారు. స్మార్ట్ఫోన్ వినియోగంలో పట్టణ, గ్రామీణ ప్రజల మధ్య వ్యత్యాసం కూడా బాగానే ఉంది. పట్టణ ప్రజలలో 58 శాతం మందికి స్మార్ట్ఫోన్ వాడుతుండగా.. గ్రామీణ ప్రాంతంలోని ప్రజల్లో 41 శాతం మంది మాత్రమే స్మార్ట్ఫోన్లను కలిగి ఉన్నట్టు నివేదిక వెల్లడించింది.
- Tags
- people
- report
- Research
- Smart Phone
- usage
తాజావార్తలు
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
-
Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!