Vandebharat: టాయిలెట్ వస్తుందని వందేభారత్ ఎక్కాడు.. టిటి వచ్చి రూ.1000ఫైన్ వేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vandebharat: రైల్వే శాఖ ప్రయాణికుల సౌలభ్యం కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కానీ వాటిని తప్పుగా ఉపయోగిస్తే మాత్రం మీరు ఇబ్బందులకు గురికాక తప్పదు. అన్ని మార్గదర్శకాలు తెలిసిన తర్వాత కూడా కొంత మంది అదే తప్పులు పునరావృతం చేస్తూ ఉంటారు. అలా తప్పులు చేసి ఇరుక్కుంటారు. సింగ్రౌలి నివాసి అబ్దుల్ ఖాదిర్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ టాయిలెట్ ఉపయోగించి నానా ఇబ్బందులు పడ్డాడు. అదేంటి టాయిలెట్ ఉపయోగిస్తే ఇబ్బంది ఏంటని ఆలోచిస్తున్నారా.. అదేంటో తెలుసుకుందాం..
అబ్దుల్ ఖాదిర్ భోపాల్ రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి తన కుటుంబంతో కలిసి సింగ్రౌలీకి వెళ్లాల్సి వచ్చింది. అతను తన భార్య, బిడ్డతో కలిసి సమయానికి ముందే స్టేషన్కు చేరుకున్నాడు. ఈ సంఘటన జూలై 15 సాయంత్రం జరిగింది. అబ్దుల్ ఖాదిర్ ఉదయం 8.55 గంటలకు సింగ్రౌలీకి రైలు పట్టవలసి వచ్చింది. అబ్దుల్ ఖాదర్ ప్లాట్ ఫాంపై ఉన్నాడు. అప్పుడే ఉన్నట్లుండి అతడికి టాయిలెట్ వచ్చింది. వెంటనే అక్కడ రెండవ ప్లాట్ఫారమ్పై నిలబడి వందే భారత్ ఎక్స్ప్రెస్లోకి వచ్చాడు. అతను టాయిలెట్ చేయడానికి రైలు వాష్రూమ్ను ఉపయోగించాడు. ఇక్కడే అతడి దురదృష్టం మొదలైంది. టాయిలెట్కి వెళ్లి వాష్రూమ్ నుంచి అబ్దుల్ ఖాదిర్ బయటకు వచ్చేసరికి రైలు స్టార్ట్ అయింది.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
Read Also:Plane Crash: కుప్పకూలిన విమానం.. ఐదుగురు రాజకీయ నాయకులు మృతి!
ఖాదిర్ రాత్రి 7:24 గంటలకు రైలు ఎక్కాడు.. వందే భారత్ రాత్రి 7:25 గంటలకు ఇండోర్కు బయలుదేరింది. కదిర్ భయాందోళనకు గురై రైలు గేటు తెరవాలనుకున్నాడు.. కానీ గేటు తెరుచుకోలేదు. రైలు భోపాల్ స్టేషన్ నుండి ముందుకు కదలడం ప్రారంభించింది. ఖాదిర్ టిటి, పోలీసుల నుండి సహాయం కోరాడు. కాని డ్రైవర్ మాత్రమే రైలు తలుపు తెరవగలడని అతనికి సమాధానం వచ్చింది. దీని తరువాత టిటి ఖాదిర్కు తదుపరి స్టేషన్ వరకు రూ. 1020 (జరిమానాతో) టిక్కెట్ను తయారు చేశాడు.
ఉజ్జయిని రైల్వే స్టేషన్లో రైలు ఆగగానే ఖదీర్ కూడా దిగాడు. ఆ తర్వాత రూ.750 వెచ్చించి భోపాల్ వెళ్లేందుకు బస్సు పట్టాడు. భోపాల్ రైల్వే స్టేషన్కు చేరుకునే సరికి భార్య, బిడ్డ అతని కోసం ఎదురు చూస్తున్నారు. సింగ్రౌలీకి అతని రైలు బయలుదేరింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి, అబ్దుల్ ఖాదిర్ రైలును టాయిలెట్ కోసం ఉపయోగించకుండా, స్టేషన్ లేదా ప్లాట్ఫారమ్లో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ని ఉపయోగించినట్లయితే అతనికి ఇబ్బందులు ఎదురయ్యేవి కావు.
Read Also:Delhi: బాలికపై అమానుషం..పైలట్ దంపతులకు షాక్ ఇచ్చిన విమానాయన సంస్థ..
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!