Ashwini Vaishnaw: మైక్రోసాఫ్ట్ సర్వర్ అంతరాయంపై స్పందించిన కేంద్ర మంత్రి.. ఏమన్నారంటే..?
- మైక్రోసాఫ్ట్ సర్వర్ అంతరాయం కారణంగా భారత్లోనూ పలు రంగాలపై ప్రభావం
- ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైక్రోసాఫ్ట్తో సంప్రదింపులు
- నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్పై (NIC) ఎలాంటి ప్రభావం చూపలేదన్న మంత్రి
- అంతరాయానికి కారణం ఏంటో కనుగొన్నట్లు స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్లో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం విదితమే. మైక్రోసాఫ్ట్ సర్వర్ అంతరాయం కారణంగా భారత్లోనూ పలు రంగాలపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ఆయన కీలక సూచనలిచ్చారు. ” ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్లో ఏర్పడ్డ అంతరాయాన్ని పరిష్కరించేందుకు భారత ప్రభుత్వ ప్రయత్నిస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైక్రోసాఫ్ట్తో సంప్రదింపులు జరుపుతోంది. ఈ అంతరాయానికి కారణం ఏంటో ఇప్పుడే కనుగొన్నారు. సమస్య పరిష్కారానికి కూడా ప్రక్రియ కొనసాగుతోంది. ఇది నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్పై (NIC) ఎలాంటి ప్రభావం చూపలేదు. ” అని మంత్రి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అలాగే సమస్య పరిష్కారానికి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) మైక్రోసాఫ్ట్కు పలు కీలక సూచనలు చేసిందని తెలిపారు.
READ MORE: Sridhar Babu: రుణమాఫీతో ప్రతిపక్ష నాయకుల నోళ్ళు మూతపడ్డాయి..
Also Read
- Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
- Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
- Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
- OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
కాగా.. మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్లో సాంకేతిక సమస్య వల్ల భారత్, అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ సర్వర్లలో సమస్యల కారణంగా విమాన సేవలు ప్రభావితమయ్యాయి. చాలా కంపెనీల విమానాలు ఎగరలేకపోతున్నాయి. భారతదేశంలో, ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు విమానాశ్రయాలలో విమానాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సాంకేతిక సమస్యల తర్వాత భారత ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ను సంప్రదించింది. అనేక దేశాల ప్రభుత్వాలు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేశాయి.
READ MORE: Parliament Session: బడ్జెట్ సమావేశాల్లో 6 కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం.. వివరాలు..
స్పైస్జెట్, ఇండిగో మరియు అకాసా ఎయిర్లైన్స్ కూడా ఇలాంటి సాంకేతిక సమస్యలను ఉదహరించాయి. ఇండిగో, స్పైస్జెట్ వంటి విమానయాన సంస్థలు సర్వర్ సమస్యల కారణంగా సర్వీసులు నిలిచిపోయాయని చెబుతున్నాయి. విమానాశ్రయంలో చెక్-ఇన్, చెక్-అవుట్ వ్యవస్థలు స్తంభించాయి. బుకింగ్ సేవ కూడా ప్రభావితమైంది. విమానయాన సంస్థలు మాత్రమే కాకుండా బ్యాంకింగ్ సేవలు, టిక్కెట్ బుకింగ్ మరియు స్టాక్ ఎక్స్ఛేంజ్ కూడా చాలా దేశాల్లో ప్రభావితమయ్యాయి.
తాజావార్తలు
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
-
Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!