మైక్రోసాఫ్ట్ సర్వర్లలో సమస్య కారణంగా చాలా ఐటీ కంపెనీలు, ఎయిర్లైన్స్, బ్యాంకింగ్, స్టాక్ ఎక్స్ఛేంజీలు ఇలా చాలా సంస్థలు ఇబ్బందులను ఎదుర్కొ్నాయి. క్రౌడ్స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ సమస్య వచ్చిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
మైక్రోసాఫ్ట్ సర్వర్లలో సమస్య కారణంగా నేడు ప్రపంచవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. మైక్రోసాఫ్ట్ సర్వర్ అంతరాయం బ్యాంకులు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు, వార్తా ఛానెల్లు, స్టాక్ మార్కెట్లు మరియు సూపర్ మార్కెట్లను ప్రభావితం చేసింది.
మైక్రోసాఫ్ట్ ఔటేజ్ వల్ల ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)కి సంబంధించిన సేవలకు అంతరాయం ఏర్పడింది. క్రౌడ్స్ట్రైక్ అప్డేట్ కారణంగా ఈ సమస్య వచ్చిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
మైక్రోసాఫ్ట్ సర్వర్లలో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగుతోంది. టెక్ దిగ్గజం యొక్క సర్వర్లలో లోపం తరువాత.. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో విమాన సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులు నేడు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD)ని ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా, లక్షలాది మంది వ్యక్తుల ల్యాప్టాప్లు లేదా పీసీలు వాటంతటవే షట్ డౌన్ లేదా రీస్టార్ట్ అవుతున్నాయి.