CM Chandrababu: ఐదేళ్లలో ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తాం..
- ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు చిట్ చాట్
- ఐదేళ్లలో ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తాం
- గత ఐదేళ్ల లో రాష్ట్రానికి సరిదిద్ద లేనంత నష్టం జరిగింది
- ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగు చేస్తుంది
- ఏపీ గ్లోబల్ లీడర్ గా తయారు చేయడమే మా లక్ష్యం
- దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేనన్ని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయి- చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లలో ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి సరిదిద్ద లేనంత నష్టం జరిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగు చేస్తుందని అన్నారు. ఏపీ గ్లోబల్ లీడర్ గా తయారు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేనన్ని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయి.. కృష్ణా గోదావరి నదులు రాష్ట్రం గుండా వెళ్తున్నాయి.. ఒక్క గోదావరి నది నుంచి 3 వేల టీఎంసీల నీరు సముద్రం పాలు అవుతుంది.. ఆ నీటిని వినియోగించుకుంటే దక్షిణాది మొత్తానికి నీటిని ఇవ్వొచ్చని తెలిపారు.
Read Also: Conocarpus Plants: ఈ చెట్టు మహా డేంజర్.. గాలి పీలిస్తే అంతే సంగతులు..!
Also Read
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
- Suryakumar Yadav: పాకిస్థాన్తో మ్యాచ్లో ఆ క్షణం మర్చిపోలేను.. ఒళ్లంతా చెమటలు పట్టాయ్..
- 43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదు.. పదవుల కోసం డిమాండ్ చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వాజ్ పేయి హయాంలో 7 మంత్రి పదవులు ఇస్తామన్న తీసుకోలేదు.. ఒక్క స్పీకర్ మాత్రమే తీసుకున్నామన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి అడగలేదు.. వాళ్ళు ఇస్తామనలేదని తెలిపారు. తమకిచ్చిన మంత్రి పదవుల పట్ల తాము సంతోషంగా ఉన్నామని అన్నారు. మరోవైపు.. ఐదేళ్ల జగన్ పాలన వల్ల అమరావతి ప్రాముఖ్యత తగ్గింది.. అమరావతికి ప్రాముఖ్యత తీసుకు వచ్చేలా పనిచేస్తామన్నారు. ఐదేళ్లలో ప్రభుత్వ పరంగా కావాల్సిన మౌలిక వసతుల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. దశల వారిగా నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు చంద్రబాబు.
Read Also: UP: శోభనం గదిలో వరుడి ఆత్మహత్య.. అసలేం జరిగింది?
ఐదేళ్లలో శాశ్వత అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్య గణన చేపడతామని.. అందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అంతేకాకుండా.. మానవ వనరులను మూలధన వనరులుగా మార్చి సంపద సృష్టిస్తామని చెప్పారు. అమరావతి నిర్మాణం నిరంతర ప్రక్రియ.. మరోవైపు.. తెలంగాణ సీఎం రేవంత్ తో సమావేశంలో ఇరు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తూ సమస్యలు పరిష్కరించుకోవలనేది తమ లక్ష్యమని తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు ఇబ్బంది లేదు.. ఈ ఏడాది దావోస్ కి వెళ్తా.. ఏపీకి పెట్టుబడులు తెస్తామని చంద్రబాబు చెప్పారు.
తాజావార్తలు
-
Lava Virat V1 Pro 5G: లావా విరాట్ V1 ప్రో 5G రిలీజ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ.. ధర, ఫీచర్లు ఇవే
-
Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
-
Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
-
Rashmika Mandanna: సర్జరీ తర్వాత తొలిసారి బయటకు.. భర్త విజయ్ దేవరకొండతో రష్మిక సందడి!
-
Rishabh Pant Record: రిషభ్ పంత్ అరుదైన ఘనత.. గురువు గారి రేర్ రికార్డు బ్రేక్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!