తెలుగుదేశం పార్టీ అయినా, ఆ పార్టీ నేతలైనా ఒంటికాలిపై లేచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్.. మరోసారి ఆ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. తాడేపల్లిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ.. తెలుగు తాలిబన్ పార్టీ అంటూ కామెంట్ చేశారు.. దళితుడిగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అగ్ని కుల క్షత్రియులను తరిమి తరిమి కొడతామని చెప్పింది చంద్రబాబు అని వ్యాఖ్యానించారు జోగి రమేష్.. నా మీద కేసు పెట్టాలని టీడీపీ నేతలు డీజీపీకి…
మంత్రి కొడాలి నానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు.. మా ప్రభుత్వం వస్తే.. కొడాలి నానిని అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్టు కొట్టిస్తానంటూ హెచ్చరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమన్న ఆయన.. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటూ హితవుపలికారు. కాగా, ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.. ప్రభుత్వాన్ని, సీఎంను, మంత్రులను ప్రతిపక్ష…
ఆయన విపక్షంలో ఉన్నప్పుడు మాటలు తూటాల్లా పేలేవి. ఇప్పుడు అధికారపక్షంలో ఉన్నారు. ఉలుకు లేదు.. పలుకు లేదు. అంతా బీ.. కామ్. అనుచరులకు కూడా తమ నేతలో వచ్చిన మార్పు అర్థం కావడంలేదట. ఆయనకేమైంది? ఎవరా నాయకుడు? ఏమా కథ? కీలక అంశాలపై పెదవి విప్పని చెవిరెడ్డి! వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి వైఖరిలో చాలా మార్పు కనిపిస్తోందట. విపక్షపార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. ప్రతి అంశంలోనూ దూకుడు ప్రదర్శించిన ఆ చెవిరెడ్డి..…
ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ బీసీలకు రాజ్యాంగం సృష్టిస్తున్నారు.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి నాలుగు రెట్లు ఎక్కువగానే సీఎం జగన్.. బీసీలకు రాజ్యాంగాన్ని సృష్టిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. దేశంలో ఏ సీఎం కూడా బీసీలకు రాజ్యాంగం రాయలేదు.. కానీ, బీసీలకు రాజ్యాంగం రాస్తున్న మొట్టమొదటి నాయకుడు వైఎస్ జగన్ అంటూ కీర్తించారు.. బీసీలను తన పక్కన కూర్చొపెట్టుకున్నారు.. మంత్రి పదవులు, ఎంపీ స్థానాలు ఇచ్చి…
చిత్తూరు జిల్లా మదనపల్లె ఎమ్మెల్యే సచివాలయ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. ప్రజా సమస్యలపై కోళ్లబైలులో ఎమ్మెల్యే నవాజ్ బాషా పర్యటించారు. నేతన్న నేస్తంకు 5 వేలు లంచం అడిగినట్లు ఉద్యోగిపై స్థానికులు ఆరోపణలు చేశారు. వెల్ఫేర్ అసిస్టెంట్ రాజేష్పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో రాజేష్పై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశంతో రాజేష్ను స్టేషన్కు తరలించారు పోలీసులు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలి.. లబ్ధిదారులను గుర్తించడానికి వీలుగా.. లబ్ధిదారులకు నష్టం…
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలపై అనుమానాలను వ్యక్తం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ, వైసీపీ మధ్య లాలూచీ రాజకీయం నడుస్తోందని అనుమానంగా ఉందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం ప్రభుత్వంపై నిందలు వేస్తోందని మండిపడ్డ ఆయన.. మంత్రి పేర్ని నాని… బాబాలు పాలిస్తున్నారు అని విమర్శలు చేయడం దారుణం అన్నారు. కేంద్రపై నిందలు వేసేముందే ఒకసారి ఆలోచించుకోరా? అని ప్రశ్నించిన ఆయన.. హిందుత్వాన్ని అవమానిస్తూ మంత్రులు వ్యాఖ్యలు చేయడం శోచనీయం…
ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం… సరుబుజ్జిలి మండలంలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.. ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేయడం కాదు, బడుగు, బలహీన వర్గాల వారికి ప్రభుత్వం అందిస్తున్న ఏ పథకం అందడం లేదో సమాధానం చెప్పాలన్నారు.. మాటలు చెప్పడం కాదు… చేతల్లో చేసి చూపాలని హితవుపలికిన ఆయన.. నెత్తిమీద రూపాయి పెడితే చెల్లని వాళ్లు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు.. గత పాలకులు స్కూళ్లలోహ సదుపాయాలున్నాయో…
అమర రాజా ఫ్యాక్టరీ వ్యవహారంలో ఇప్పుడు ఏపీలో రాజకీయ విమర్శలకు కూడా దారితీస్తోంది.. అయితే, ఈ అంశంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. అంతేకాదు.. టీడీపీ నేతలకు సవాల్ కూడా విసిరారు.. అమర రాజా విషయంలో టీడీపీ విష ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసినా రోజా.. అది రాజకీయ సమస్య కాదు కాలుష్యం సమస్య అన్నారు.. ఎల్జీ పాలిమర్ విషయంలో చంద్రబాబు ఏం మాట్లాడాడు ? అని ప్రశ్నించిన ఆమె.. రాష్ట్రంలో కాలుష్యం…
రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేసుకోవడం సహజం. ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య ఇలాంటి పొలిటికల్ వారే నడుస్తోంది. జిల్లాకు ఒకరిని చొప్పున టార్గెట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకరు రచ్చ చేస్తుంటే.. ఇంకొకరు బురద కడుక్కొంటున్నారు. మరి.. అంతిమంగా ఎవరు పైచెయ్యి సాధిస్తున్నారు? ఎవరి గేమ్ప్లాన్కు ఇంకెవరు చిత్తవుతున్నారు? తాడిపత్రిలో మీడియా అటెన్షన్ క్యాచ్ చేసిన జేసీ! గ్రౌండ్లో ఆడే ఆటల్లానే అటాకింగ్, స్ట్రాటజీ.. డిఫెన్స్ మోడ్ లాంటి విధానాలు రాజకీయ క్రీడల్లోనూ కనిపిస్తాయి. ప్రస్తుతం ఏపీలో టీడీపీ…
ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు సక్రమంగా అందేలా చూసేందుకు వినూత్న రీతిలో గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకొచ్చారు సీఎం వైఎస్ జగన్.. అయితే, ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తాం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ… ఇకపై ప్రతి నెల ఆఖరి శుక్ర, శని వారాల్లో ఇంటింటికి సచివాలయ సిబ్బంది తిరుగుతారని వెల్లడించిన ఆయన… ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో కూడిన కరపత్రాలని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తమ…