Selfie Challenge: ఆంధ్రప్రదేశ్లో సెల్ఫీ ఛాలెంజ్ కొనసాగుతోంది.. ఇప్పటి వరకు నారా లోకేష్, చంద్రబాబు.. సీఎం వైఎస్ జగన్, వైసీపీ ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్లు విసరగా.. ఇప్పుడు వైసీపీకి కూడా ఈ ఛాలెంజ్లోకి దిగింది.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. గంగాధర నెల్లూరు మండలంలోని నిర్మిస్తున్న సాఫ్ట్ వేర్ కంపనీ Smart DV కంపెనీ నిర్మాణం వద్ద సెల్ఫీ దిగిన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి.. మరో రెండు నెలల్లో సీఎం వైఎస్ జగన్…
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.. అదేంటి.. ఈ మధ్యే ఆయనపై పార్టీ వేటు వేసింది.. ఇప్పుడు ఆయన సీఎంకు, ప్రభుత్వానికి అభినందనలు తెలపాల్సిన అవసరం ఏమొచ్చిందంటారా? ఇక, ఆ విషయంలోకి వెళ్తే.. బారాషాహిద్ దర్గా అభివృద్ధికి రూ.15 కోట్ల పనులకు జీవో జారీ చేసి నిధులు విడుదల చేసినందకు సీఎం, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు కోటంరెడ్డి.. నిధుల కోసం…
Kodali Nani Open Challenge: టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు మాజీ మంత్రి కొడాలి నాని.. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు గుడివాడ కు ఏం చేశారు? అని నిలదీశారు.. గుడివాడలో పేదలకు ఇళ్ల కోసం ఒక్క ఎకరం భూమి చంద్రబాబు కొన్నారా? అని ప్రశ్నించారు.. చంద్రబాబు ఒక్క ఎకరం కొన్నా రాజకీయాలు వదిలేస్తాను అంటూ చాలెంజ్ చేశారు..…
Pawan Kalyan: రుషికొండ తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు.. సోషల్ మీడియా వేదికగా రుషికొండ తవ్వకాలపై స్పందించిన ఆయన.. రిషికొండ తవ్వకాలను కప్పి పుచ్చేందుకు 151 అడుగుల స్టిక్కర్లను అంటిస్తారా..? అని ప్రశ్నించారు.. చెట్లు, కొండలను నరికేయడం, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం వైసీపీ దుష్ట పాలకుల ముఖ్య లక్షణం అంటూ ఆరోపించారు.. రుషికొండను ధ్వంసం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్ నిర్ధారించిందన్నారు. వైఎస్ఆర్…
Perni Nani vs KTR: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది.. అయితే, ఇది మా వళ్లే సాధ్యం అయ్యిందంటున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడింది మన సీఎం కేసీఆరే నన్న ఆయన.. మేం తెగించి కొట్లాడాం.. కాబట్టే కేంద్రం ఇప్పుడు ఒక ప్రకటన చేసింది.. తాత్కాలికంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంపై వెనక్కి తగ్గిందని.. కేసీఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటుంది మరి అని వ్యాఖ్యానించారు..…
Perni Nani Challenge: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకు దుమ్ముంటే 2014 నుంచి 2019 వరకు తాను చేసిన పాలనను తిరిగి తీసుకుని వస్తానని చెప్పాలన్నారు.. మళ్ళీ జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేస్తానని చెప్పగలవా? అమరావతి పేరుతో దోచుకున్నది ఎవరు? ఎన్టీఆర్ మద్యపానాన్ని నిషేధిస్తే… ఎత్తేసింది చంద్రబాబు కాదా? పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి మరణానికి కారణం…
Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోన్న సమయంలో.. కీలక మలుపు తిరిగినట్టు అయ్యింది.. విశాఖలో పర్యటిస్తున్న కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు ఫగ్గన్.. విశాఖలో పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదన్నారు.. దానికంటే ముందు ఆర్ఎన్ఐఎల్ను బలోపేతం చేసే…
Deputy CM Narayana Swamy: డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి షాక్ తగిలింది.. జీడినెల్లూరు నియోజకవర్గంలో నారాయణ స్వామికి వ్యతిరేకంగా డైరెక్ట్ వార్కు దిగారు సీనియర్ నేత, మాజీ ఎంపీ, ప్రభుత్వ విదేశీ వ్యవహారాల సలహాదారుడు జ్ఞానేంద్రరెడ్డి.. గత ఎన్నికల్లో నారాయణస్వామిని గెలిపించడానికి అందరూ తమ వంతు ప్రయత్నం చేసి ఎమ్మెల్యేగా గెలిపించారన్న ఆయన.. మా పార్టీలో పెనుమూరు మండలంలోనే కాదు ఆరు మండలాలలో వర్గవిభేదాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.. అయన డిప్యూటీ సీఎం అయినా.. సీఎం అయినా..…
తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. తిరుపతి శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఇక నుంచి గంగమ్మ జాతరను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.