Perni Nani vs KTR: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది.. అయితే, ఇది మా వళ్లే సాధ్యం అయ్యిందంటున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడింది మన సీఎం కేసీఆరే నన్న ఆయన.. మేం తెగించి కొట్లాడాం.. కాబట్టే కేంద్రం ఇప్పుడు ఒక ప్రకటన చేసింది.. తాత్కాలికంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంపై వెనక్కి తగ్గిందని.. కేసీఆర్ దెబ్బ అంటే అట్లా ఉంటుంది మరి అని వ్యాఖ్యానించారు..…
Perni Nani Challenge: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకు దుమ్ముంటే 2014 నుంచి 2019 వరకు తాను చేసిన పాలనను తిరిగి తీసుకుని వస్తానని చెప్పాలన్నారు.. మళ్ళీ జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేస్తానని చెప్పగలవా? అమరావతి పేరుతో దోచుకున్నది ఎవరు? ఎన్టీఆర్ మద్యపానాన్ని నిషేధిస్తే… ఎత్తేసింది చంద్రబాబు కాదా? పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి మరణానికి కారణం…
Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోన్న సమయంలో.. కీలక మలుపు తిరిగినట్టు అయ్యింది.. విశాఖలో పర్యటిస్తున్న కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు ఫగ్గన్.. విశాఖలో పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదన్నారు.. దానికంటే ముందు ఆర్ఎన్ఐఎల్ను బలోపేతం చేసే…
Deputy CM Narayana Swamy: డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి షాక్ తగిలింది.. జీడినెల్లూరు నియోజకవర్గంలో నారాయణ స్వామికి వ్యతిరేకంగా డైరెక్ట్ వార్కు దిగారు సీనియర్ నేత, మాజీ ఎంపీ, ప్రభుత్వ విదేశీ వ్యవహారాల సలహాదారుడు జ్ఞానేంద్రరెడ్డి.. గత ఎన్నికల్లో నారాయణస్వామిని గెలిపించడానికి అందరూ తమ వంతు ప్రయత్నం చేసి ఎమ్మెల్యేగా గెలిపించారన్న ఆయన.. మా పార్టీలో పెనుమూరు మండలంలోనే కాదు ఆరు మండలాలలో వర్గవిభేదాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.. అయన డిప్యూటీ సీఎం అయినా.. సీఎం అయినా..…
తిరుపతి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. తిరుపతి శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఇక నుంచి గంగమ్మ జాతరను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Off The Record: డిప్యూటీ సీఎం, వైసిపి సినియర్ నేత నారాయణస్వామి…మూడు సార్లు ఎమ్మెల్యేగా పని చేసినా ఎలాంటి ఇబ్బందులు పడలేదు. డిప్యూటీ సిఎం అయ్యాక మాత్రం రాష్ట్రంలో ఏ మంత్రి అనుభవించని ఇబ్బందులు అనుభవిస్తున్నారట. సమస్యలు కంట్రోల్ అవ్వకపొగా…రోజూరోజుకు పెరుగుతున్నాయట. చిత్తూరు జిల్లా అంటే గ్రూప్ పాలిటిక్స్కి కేరాఫ్ అడ్రస్. అయితే గంగాధర నెల్లూరులో పీక్ స్టేజ్కు చేరిందట. నియోజకవర్గంలో గంగాధర్ నెల్లూరు, పెనుమూరు, వెదురుకుప్పం, ఎస్ఆర్ పురం, కార్వేటినగరం మండలాల్లో గ్రూపు రాజకీయాలు వైసిపిలో…
Off The Record: రాజకీయాల్లో ట్విస్టులు ఓ రేంజ్లో ఉంటాయి. ఏ ఎత్తుగడ వెనుక ఎవరు ఉంటారో…ఏ స్విచ్ వేస్తే ఎక్కడి లైట్ వెలుగుతుందో కనిపెట్టడం అంత తేలిక కాదు. ఎన్నికల టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ నేతల ఎత్తుగడలు రసవత్తరంగా ఉంటున్నాయి. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నుంచి కొంత మంది కార్యకర్తలు వచ్చి తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం దగ్గర నిరసనకు దిగారు. మంగళగిరి హైవే నుంచి పార్టీ ఆఫీసు వరకు ర్యాలీగా వచ్చి మరీ…
Balineni Srinivasa Reddy: ప్రకాశం జిల్లా మార్కాపురం సీఎం జగన్ పర్యటనలో మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బాలినేనికి ప్రొటోకాల్లో ప్రాధాన్యత ఇవ్వలేదు అధికారులు. మార్కాపురంలో సీఎం జగన్కు స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్ వద్దకు వెళ్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి వాహనాలను అధికారులు అడ్డుకున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలినేని… అక్కడి నుంచి వెళ్లిపోయారు. నచ్చజెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేశ్, జిల్లా ఎస్పీ, ఇతర నేతలు ప్రయత్నించినా…
Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి తెలంగాణ మంత్రి హరీష్రావు ఎవరని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ.. వాళ్ల రాష్ట్రం గురించి వాళ్లు చూసుకుంటే మంచిదన్నారు. బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్లు.. జాగ్రత్తగా మాట్లాడాలన్నారు బొత్స. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా గురించి ఎవరు ఏం మాట్లాడారో తమకు తెలుసన్నారు. ఆంధ్ర వాళ్లు తెలంగాణలో ఉండాలనుకుంటారో? తెలంగాణ వాళ్లు అమెరికాలో ఉండాలని అనుకుంటున్నారో? అందరికీ తెలుసన్నారు బొత్స. రాజకీయం కోసం హరీష్ రావు మాట్లాడతాడు.. ఎవరో ఏదో…
Sajjala Ramakrishna Reddy: ఎమ్మెల్సీలుగా ఎన్నికై ప్రమాణస్వీకారం చేసిన మండలి సభ్యులకు అభినందనలు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ, విపక్షాలపై ఫైర్ అయ్యారు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు తమ తలరాత వాళ్ళే రాసుకునే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలు ఉన్నాయన్న ఆయన.. 17 మంది గెలిస్తే వారిలో 10 మంది బీసీ వర్గాలకు చెందినవారే అన్నారు. జూన్ నాటికి…