పాలకులు ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఉత్తరాంధ్ర ఉత్తమంగా ఉండాలి. వందేళ్ళ నుండి ఉత్తరాంధ్ర ఉత్తి ఆంధ్రగానే ఉంది. రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఉత్తరాంధ్ర అభివృద్దిపై చిన్న చూపు చూసాయి. భూములు ఉండి కూడా ఉత్తరాంధ్ర వాసులు దేశ వ్యాప్తంగా వలసలు పోతున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న నీటి ప్రాజెక్టులు విడిచి పెట్టి పోలవరం గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు. పోలవరంపై ఉన్న శ్రద్ధ మిగిలిన ప్రాజెక్టుల పై ఉండటం లేదు.…
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది… అసెంబ్లీ లోపల, బయట అనే తేడాలేదు.. విషయం ఏదైనా.. రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతోంది.. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడని టీడీపీ నేతలు కరెంట్ ఛార్జీల పెంపుపై మాట్లాడుతారా? అంటూ నిలదీసిన ఆయన.. చంద్రబాబు…
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడబోయి అపహాస్యం పాలువుతున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. రాజకీయ నేతలు ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలు ఉండాలని సూచించారు.. అనవసరమైన ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు.. ఇక, వైఎస్ వివేకానందరెడ్డి లేకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా తెలిపిన ఆయన.. మహా వృక్షం లాంటి వైఎస్ ఫ్యామిలీలో వివేకా ఘటన అందరినీ షాక్లో…
మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, సౌమ్యుడు రోశయ్య మరణం తీరని లోటు అని రాజకీయ నేతలు నివాళులర్పించారు. రోశయ్య అందరికీ సూపరిచితులు…ఆయన మరణం బాధ కలిగించింది. ఆయన లేకపోవడం రాజకీయాల్లో తీరని లోటు అన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి. రాజకీయాల్లో ఆయన ఎన్నో పదవులు అనుభవించారు. ఎవరికీ ఇబ్బంది కలిగించే వ్యక్తి కాదు, శాంతమూర్తి. ఎన్నో చరిత్రలు రోశయ్య సొంతం అన్నారు జగ్గారెడ్డి. ఆయనో స్వాతంత్ర్య సమరయోధుడు. నేను అందరికీ…
ఏపీలో ఎన్నికలు జరగని మునిసిపాలిటీలు, కార్పోరేషన్లు, పంచాయతీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. నెల్లూరు కార్పోరేషన్ ఎన్నికల అక్రమాల పై హైకోర్టును ఆశ్రయించనుంది తెలుగుదేశం పార్టీ. రిటర్నింగ్ అధికారి ఏకపక్ష నిర్ణయాలపై హైకోర్టు కు వెళ్లాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి రిటర్నింగ్ అధికారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. నామినేషన్ల తిరస్కరణను సీరియస్ గా తీసుకున్న…
వైఎస్ఆర్ అవార్డు గ్రహీతలకు అందరికి నా శుభాకాంక్షలు అని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అత్యున్నత సేవలు చేసిన వారికి అవర్డులు ఇవ్వడం ఏపీ చరిత్రలో గొప్ప విషయం. సీఎం జగన్ సూచనలతో లిస్టు తయారు చేసిన జ్యూరీకి శుభాకాంక్షలు. వైఎస్ఆర్ స్ఫూర్తిదాయక నేత అని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజల హృదయాలలో నిలిచారు వైఎస్ఆర్. ఈ అవార్డులు 2020లో ఇవ్వాల్సి ఉంది. కోవిడ్ కారణంగా ఆలస్యం కావడంతో కొందరు అవార్డు గ్రహీతలు మన మధ్య…
వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. చేవెళ్లలో జెండా ఊపి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించారు వైఎస్ విజయమ్మ. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. నాన్న ప్రారంభించిన ప్రజా ప్రస్థానాన్ని కొనసాగిస్తామని.. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశిస్తామని చెప్పారు. వైఎస్.ఆర్ నాయకత్వాన్ని తీసుకురావడమే తమ లక్ష్యమని… సంక్షేమం ప్రతి ఇంటికి తీసుకువస్తామని హామీ ఇస్తున్నానని చెప్పారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతానానికే ఈ యాత్ర అని… కోట్ల అప్పులు…
వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టిన సంగతి అందరికి తెల్సిందే. ఆమె స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఇప్పుడిప్పుడే ప్రజల్లో గుర్తింపు దక్కుతోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యమని ప్రకటించిన షర్మిల ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ప్రారంభించిన ఆరునెలల్లో తెలంగాణ ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగ సమస్య, యువత ఆత్మహత్యలు, రైతు సమస్యలపై గళం విప్పుతున్నారు. యువత నుంచి…
2009 సెప్టెంబర్ 2… ఆ రోజు ఏపీ సీఎం వైఎస్ఆర్ సెక్రటేరియట్లో లేరు. అయినా సి బ్లాక్ అంతా హడావుడి. అంతా ఒకటే టెన్షన్ టెన్షన్…సీఎం ఆఫీస్లో లేకపోతే అక్కడ ఏ సందడీ ఉండదు..కానీ ఆ రోజు అందుకు భిన్నం. ఆ రోజు చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి సీఎం వైఎస్ఆర్. అందుకే ఉదయం సరిగ్గా సరిగ్గా 8 గంటల 38 నిమిషాలకు బేగంపేట నుంచి హెలికాప్టర్ ఎగిరింది. 10.30 కల్లా చిత్తూరు చేరాలి.…
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి, వైఎస్ కూతురు వైఎస్ షర్మిల భావోద్వేగ ట్వీట్ చేశారు.. వైఎస్సార్ను సోషల్ మీడియా వేదికగా స్మరించుకున్న షర్మిల… “ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలెదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి, నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది.. I Love & Miss…