వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. చేవెళ్లలో జెండా ఊపి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించారు వైఎస్ విజయమ్మ. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. నాన్న ప్రారంభించిన ప్రజా ప్రస్థానాన్ని కొనసాగిస్తామని.. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశిస్తామని చెప్పారు. వైఎస్.ఆర్ నాయకత్వాన్ని తీసుకురావడమే తమ లక్ష్యమని… సంక్షేమం ప్రతి ఇంటికి తీసుకువస్తామని హామీ ఇస్తున్నానని చెప్పారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతానానికే ఈ యాత్ర అని… కోట్ల అప్పులు తెచ్చిన కులం, మతం పేరిట చిచ్చు పెట్టిన బీజేపీని గంగలో కలిపినందుకే ఈ యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు.
టిఆర్ఎస్ కు అమ్ముడుపోయిన కాంగ్రెస్ ను చీల్చి చెందడానికే ఈ పాదయాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని…ఏడేళ్ళల్లో ప్రతి వర్గాన్ని మోసం చేశారన్నారు. నంబర్ వన్ అద్వన్నమైన సీఎం ఎవరంటే కేసీఆర్ అని ఓ సర్వే చెబుతుందని ఎద్దేవా చేశారు. పేదోళ్లకు కరోనా వస్తే గాంధీ ఆసుపత్రికి పొమ్మన్నారని… అదే కేసీఆర్ కు కరోనా వస్తే కార్పొరేట్ ఆసుపత్రికి పోయారని మండిపడ్డారు. వేల కోట్ల సంపదను కేసీఆర్ నీటిపాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.