వైఎస్ఆర్ అవార్డు గ్రహీతలకు అందరికి నా శుభాకాంక్షలు అని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అత్యున్నత సేవలు చేసిన వారికి అవర్డులు ఇవ్వడం ఏపీ చరిత్రలో గొప్ప విషయం. సీఎం జగన్ సూచనలతో లిస్టు తయారు చేసిన జ్యూరీకి శుభాకాంక్షలు. వైఎస్ఆర్ స్ఫూర్తిదాయక నేత అని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజల హృదయాలలో నిలిచారు వైఎస్ఆర్. ఈ అవార్డులు 2020లో ఇవ్వాల్సి ఉంది. కోవిడ్ కారణంగా ఆలస్యం కావడంతో కొందరు అవార్డు గ్రహీతలు మన మధ్య లేరు. ఏపీ ఒక రాష్ట్రంగా ఏర్పడటానికి అశువులు బాసిన వారికి నా నివాళులు అని చెప్పారు.
ఇక ఏపీ సంస్కృతికంగా గొప్ప రాష్ట్రం. తెలుగు అన్ని భాషలలోనూ తియ్యనిది అని బకించంద్ర ఛటర్జీ అన్నారు. అత్యంత పొడవైన సముద్రతీరం కలిగిన రాష్ట్రం ఏపీ. పెట్టుబడులు ఆహ్వానించడానికి అత్యంత వీలైన రాష్ట్రం ఏపీ. కోవిడ్ వంటి పరిస్ధితులలో ఏపీ ప్రజల నిబద్ధతను ప్రశంసిస్తున్నాను. వ్యాక్సినేషన్ ప్రతీఒక్కరూ చేయించుకోవాలి. కరోనా వారియర్స్ ను కూడా అవార్డులలో చేర్చడం అభినందనీయం అని పేర్కొన్నారు.