సాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. పార్టీ నుంచి వెళ్లిపోయాక ఏదో రకంగా అభియోగాలు మోపాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కోటరీ ఉందా..? లేదా..? అసలు కోటరీ నడిపిందెవరో ఆయనకు తెలియదా..? అని నిలదీశారు.. మేం అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్షుడు నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారు అని స్పష్టం చేశారు.
ప్రాంతీయ పార్టీలో ఎవ్వరూ నంబర్ 2 వుండరు.. ఒక్కటి నుండి 100 తరువాత మాత్రమే 101 వుంటుంది అని వ్యాఖ్యానించారు.. పార్టీ కోసం ఏం చేసినా.. జగన్, నేను, ప్రశాంత్ కిషోర్ కలిసి చేశాం.. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే నంబర్ 2 అనేది మిథ్య అని గమనించాను.. ఆ ఆరు నెలల్లోనే నా స్థానం నంబర్ 2 నుంచి 2 వేలకు పడిపోయిందన్నారు..
ఆ మాజీ ఎంపీ హాఫ్ బాయిల్డ్ పాలిటిక్స్ చేస్తున్నారా? తన ఓవరాక్షన్తో మొత్తంగా పార్టీనే ఇరుకున పెట్టేశారా? ఆయన అతి కారణంగా….. ఎఫెన్స్లో ఉండాల్సిన చోట వైసీపీ డిఫెన్స్లోకి పడిపోయిందా? ప్రశ్నించాల్సిన, నిలదీయాల్సిన చోట సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితికి వెళ్ళిపోయిందా? ఎవరా ఎంపీ? ఎలా ఇరుకున పెట్టారు పార్టీని? ఒక్కసారి ఎంపీ మీదికి మీసం మెలేసి ఓవర్ నైట్లో పాపులర్ అయిన మాజీ పోలీస్ అధికారి గోరంట్ల మాధవ్. ఆ దూకుడు చూసే…. వైసీపీ అధ్యక్షుడు జగన్…
ఇక బీజేపీతో తేల్చుకోవడానికే వైసీపీ సిద్ధమైందా? ఆ పార్టీ విషయంలో ఇంకా మెతగ్గా ఉంటే… మొదటికే మోసం వస్తుందని భయపడుతోందా? వక్ఫ్ బిల్లు విషయంలో సుప్రీం కోర్ట్ తలుపు తట్టడానికి ఇంత ఆలస్యం ఎందుకు చేసింది ఫ్యాన్ పార్టీ? జరక్కూడనిదేదో జరిగిపోతోందని గుర్తించిందా? ఇంతకీ వైసీపీ భయం ఏంటి? ఆ పార్టీ యాక్షన్కి బీజేపీ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఆవిర్బావం నుంచి జాతీయ రాజకీయాల్లో న్యూట్రల్ స్టాండ్తోనే ఉన్న వైసీపీ… ఇంత వరకు ఏ కూటమిలో చేరలేదు.…
YS Jagan: శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి సమీపంలో మాజీ ముఖ్యమంత్రి, వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ విండో షీల్డ్ కు ఎయిర్ క్రాక్ ఘటనప్తె పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
రాజధానిని స్మశానం అన్నారు.. ఈ రోజు స్వేచ్చా వాతావరణంలో మాట్లాడుకుంటున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2019 నుంచి 2024 వరకూ భయంకరమైన వాతావరణం ఉంది.. నా జీవితంలో అలాంటిది ఎప్పుడూ చూడలేదు.. నేనుకూడా బయటకు రాలేని పరిస్థితి ఉండేదన్నారు.. హెలికాప్టర్ లో వస్తే కింద ఉన్న చెట్లను నరికేశారు.
వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు మాట్లాడుతూ.. చంద్రబాబు ఏ దమ్ముతో అంబేడ్కర్ స్మృతి వనం ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నాడు? అని ప్రశ్నించారు. అంబేడ్కర్ స్మృతి వనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి చంద్రబాబుకి ఏ హక్కు ఉందన్నారు.
మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం అంబేడ్కర్ ను తాకట్టు పెట్టింది అని ఆరోపించారు. లూలూ కంపెనీకి స్వరాజ్య మైదాన్ ను తాకట్టు పెట్టాలని చూసారు.. ఎందుకు అంబేడ్కర్ స్మృతి వనాన్ని పీపీపీ మోడల్ లో ప్రైవేటు పరం చేస్తున్నారు అని ప్రశ్నించారు.
బీజేపీ, అన్నాడీఎంకే పొత్తును ప్రకటించిన అమిత్ షా.. తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. మాజీ సీఎం ఎడప్పాడి పళని స్వామి నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు. చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో పొత్తుపై అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. ఈ సమావేశంలో పళని స్వామి మాట్లాడుతూ.. రెండు…
అధికారంలోకి రావటానికి అప్పట్లో ఏమేమి ఎర వేశారో అందరికీ తెలుసు.. కానీ, ఎన్టీఆర్ లా అభిమన్యుడు కాదు జగన్.. అర్జునుడిలా మీ కుట్రలు ఛేదిస్తారని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి పేర్ని నాని.. జైల్లో ఉన్న సమయంలో డ్రామాలు ఆడింది చంద్రబాబు.. జైల్లోకి వెళ్లగానే డీ హైడ్రేషన్.. అలర్జీ అన్నారు..