రిషికొండలో నిర్మాణాలకు బ్రేక్ … ఎన్జీటీ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలోని, రిషికొండలో చేపడుతున్న నిర్మాణాలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణం రాజు వేసిన పిటిషన్ విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నలుగురు సభ్యుల కమిటీని నియమించింది. విశాఖపట్నం సమీపంలోని రుషికొండ పై చేపట్టిన నిర్మాణాలపై పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు వస్తున్న ఆరోపణలపై నివేదికను కోరింది. ఈ మేరకు ఎన్జీటీ గతంలోఇచ్చిన కోర్టు తీర్పును గుర్తు చేసింది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం డిసెంబర్ 17, 2021న జారీ చేసిన ఉత్తర్వులో, రుషికొండ పై అక్రమ నిర్మాణాలు తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, CPCB, రాష్ట్రానికి చెందిన స్వతంత్ర నలుగురు సభ్యుల కమిటీని నియమించిందని తెలిపింది. దీనిపై PCB, SEIAA, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విశాఖపట్నం జిల్లా మేజిస్ర్టేట్ను నివేదిక కోరింది. రెండు నెలల్లో ట్రిబ్యూనల్కు ఈ నివేదికను అందజేయాలని ఆదేశించింది. స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ (SEIAA), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి నోడల్ ఏజెన్సీగా ఉంటుందని ఎన్జీటీ పేర్కొంది. ఈ కమిటీ రెండు వారాల్లో సమావేశం కావొచ్చని తెలిపింది.
అంతేకాకుండా ఈ కమిటీ సభ్యలు రిషికొండలో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించవచ్చని , దానికి సంబంధించిన అంశాలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఈ కమిటీలకు ఉందని ఎన్జీటీ బెంచ్ పేర్కొంది. రఘురామ రాజు దాఖలు చేసిన ఈ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి ప్రాంతాల (అభివృద్ధి) చట్టం 1975 ప్రకారం పట్టణాభివృద్ధి శాఖ నోటిఫై చేసిన మాస్టర్ ప్లాన్ను ఉల్లంఘించారని విచారణ సందర్భంగా ఎన్జీటీ పేర్కొంది. అయితే పిటిషన్ దారు ఈ ప్రాంతం పర్యావరణపరంగా సున్నితమైనదని, పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం ద్వారా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పిటిషన్లో పేర్కొన్నట్టు ఎన్జీటీ తెలిపింది.
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!