రిషికొండలో నిర్మాణాలకు బ్రేక్ … ఎన్జీటీ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలోని, రిషికొండలో చేపడుతున్న నిర్మాణాలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణం రాజు వేసిన పిటిషన్ విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నలుగురు సభ్యుల కమిటీని నియమించింది. విశాఖపట్నం సమీపంలోని రుషికొండ పై చేపట్టిన నిర్మాణాలపై పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు వస్తున్న ఆరోపణలపై నివేదికను కోరింది. ఈ మేరకు ఎన్జీటీ గతంలోఇచ్చిన కోర్టు తీర్పును గుర్తు చేసింది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం డిసెంబర్ 17, 2021న జారీ చేసిన ఉత్తర్వులో, రుషికొండ పై అక్రమ నిర్మాణాలు తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, CPCB, రాష్ట్రానికి చెందిన స్వతంత్ర నలుగురు సభ్యుల కమిటీని నియమించిందని తెలిపింది. దీనిపై PCB, SEIAA, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విశాఖపట్నం జిల్లా మేజిస్ర్టేట్ను నివేదిక కోరింది. రెండు నెలల్లో ట్రిబ్యూనల్కు ఈ నివేదికను అందజేయాలని ఆదేశించింది. స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ (SEIAA), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి నోడల్ ఏజెన్సీగా ఉంటుందని ఎన్జీటీ పేర్కొంది. ఈ కమిటీ రెండు వారాల్లో సమావేశం కావొచ్చని తెలిపింది.
అంతేకాకుండా ఈ కమిటీ సభ్యలు రిషికొండలో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించవచ్చని , దానికి సంబంధించిన అంశాలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఈ కమిటీలకు ఉందని ఎన్జీటీ బెంచ్ పేర్కొంది. రఘురామ రాజు దాఖలు చేసిన ఈ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి ప్రాంతాల (అభివృద్ధి) చట్టం 1975 ప్రకారం పట్టణాభివృద్ధి శాఖ నోటిఫై చేసిన మాస్టర్ ప్లాన్ను ఉల్లంఘించారని విచారణ సందర్భంగా ఎన్జీటీ పేర్కొంది. అయితే పిటిషన్ దారు ఈ ప్రాంతం పర్యావరణపరంగా సున్నితమైనదని, పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం ద్వారా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పిటిషన్లో పేర్కొన్నట్టు ఎన్జీటీ తెలిపింది.
Also Read
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
తాజావార్తలు
-
Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
-
Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
-
India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
-
RBI New Rules 2026: రుణ ఎగవేతదారులకు ఆర్బీఐ భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్
-
Astrology: జాతకంలో శని శుభప్రదంగా ఉన్నప్పుడు.. జీవితంలో అద్భుతమైన మార్పులు.. ఇవే ఆ సంకేతాలు!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!