రిషికొండలో నిర్మాణాలకు బ్రేక్ … ఎన్జీటీ ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలోని, రిషికొండలో చేపడుతున్న నిర్మాణాలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణం రాజు వేసిన పిటిషన్ విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నలుగురు సభ్యుల కమిటీని నియమించింది. విశాఖపట్నం సమీపంలోని రుషికొండ పై చేపట్టిన నిర్మాణాలపై పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు వస్తున్న ఆరోపణలపై నివేదికను కోరింది. ఈ మేరకు ఎన్జీటీ గతంలోఇచ్చిన కోర్టు తీర్పును గుర్తు చేసింది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం డిసెంబర్ 17, 2021న జారీ చేసిన ఉత్తర్వులో, రుషికొండ పై అక్రమ నిర్మాణాలు తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని, CPCB, రాష్ట్రానికి చెందిన స్వతంత్ర నలుగురు సభ్యుల కమిటీని నియమించిందని తెలిపింది. దీనిపై PCB, SEIAA, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విశాఖపట్నం జిల్లా మేజిస్ర్టేట్ను నివేదిక కోరింది. రెండు నెలల్లో ట్రిబ్యూనల్కు ఈ నివేదికను అందజేయాలని ఆదేశించింది. స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ (SEIAA), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి నోడల్ ఏజెన్సీగా ఉంటుందని ఎన్జీటీ పేర్కొంది. ఈ కమిటీ రెండు వారాల్లో సమావేశం కావొచ్చని తెలిపింది.
అంతేకాకుండా ఈ కమిటీ సభ్యలు రిషికొండలో నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలను సందర్శించవచ్చని , దానికి సంబంధించిన అంశాలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఈ కమిటీలకు ఉందని ఎన్జీటీ బెంచ్ పేర్కొంది. రఘురామ రాజు దాఖలు చేసిన ఈ పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి ప్రాంతాల (అభివృద్ధి) చట్టం 1975 ప్రకారం పట్టణాభివృద్ధి శాఖ నోటిఫై చేసిన మాస్టర్ ప్లాన్ను ఉల్లంఘించారని విచారణ సందర్భంగా ఎన్జీటీ పేర్కొంది. అయితే పిటిషన్ దారు ఈ ప్రాంతం పర్యావరణపరంగా సున్నితమైనదని, పబ్లిక్ ట్రస్ట్ సిద్ధాంతం ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం ద్వారా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పిటిషన్లో పేర్కొన్నట్టు ఎన్జీటీ తెలిపింది.
Also Read
- Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
- Nepal Floods: నేపాల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
- Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
- OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
తాజావార్తలు
-
Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
-
Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
-
The Paradise : ‘యెషనాగుల’ వచ్చేస్తోంది.. ‘ది ప్యారడైజ్’లో ఊరమాస్ ట్రీట్
-
Raksha Bandhan 2026: రాఖీ ఎప్పుడు కట్టాలి? ఎలా కట్టాలి? శుభ సమయాలతో పాటు రక్షా బంధన్ పూర్తి వివరాలు ఇవే..
-
Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!