‘దండోరా’ సినిమా ఈవెంట్లో హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్లో పెద్ద చిచ్చు రేపాయి. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ సీరియస్ అవ్వడం, శివాజీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం సద్దుమణగడం లేదు. తాజాగా ఈ అంశంపై సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. లూలూ మాల్లో వేధింపులకు గురైన నటినే తప్పుబట్టడం అత్యంత దిగ్భ్రాంతికరమని ఆమె పేర్కొన్నారు. బాధితురాలి దుస్తులను సాకుగా చూపిస్తూ నేరస్తుల ప్రవర్తనను…
కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న విద్యార్థినులు, తాము ఉంటున్న ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్లో మెస్ ఇంచార్జీ వినోద్ తమను వేధిస్తున్నాడంటూ షీటీమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థినులు తమ ఆవేదనను ఆడియో రూపంలో వెల్లడించారు. మెస్ ఇంచార్జీ వినోద్ ప్రవర్తన వల్ల హాస్టల్లో ఉండాలంటే భయంగా ఉందని, విద్యార్థినుల భద్రతే ప్రశ్నార్థకంగా మారిందని వారు పేర్కొన్నారు. వినోద్ వల్ల అనేక మంది విద్యార్థినులు మానసికంగా ఇబ్బందులు…
Minister Anita: తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో జరిగిన లైంగిక దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ఈ కేసు పురోగతిపై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఆమె తిరుపతి ఎస్పీతో పాటు పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు చర్యలు ప్రారంభించినట్లు హోంమంత్రి వెల్లడించారు. తిరుపతి ఎస్పీ స్వయంగా కేసును పర్సనల్గా పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. ప్రాథమిక దర్యాప్తు భాగంగా సాక్ష్యాలు, సంబంధిత సమాచారం…
తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు, ముఖ్యంగా శ్రామిక మహిళల సురక్షిత ప్రయాణానికి ఉద్దేశించిన ‘టీ-సేఫ్’ వ్యవస్థ దేశంలోనే ఒక విప్లవాత్మక ముందడుగు అని తెలంగాణా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి పేర్కొన్నారు. చత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఇటీవల జరిగిన డీజీపీల కాన్ఫరెన్స్లో ‘టీ-సేఫ్ – మహిళల కోసం సురక్షిత ప్రయాణం’ అనే అంశంపై ప్రజెంటేషన్ ఇచ్చి, ఈ సాంకేతిక పరిజ్ఞానం యొక్క విశిష్టతను వివరించారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2022 ప్రకారం,…
హైదరాబాద్ మెట్రో రైలు దేశంలో అత్యాధునిక నగర రవాణా వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోంది. మూడు కారిడార్లలో 57 స్టేషన్లతో ప్రతిరోజూ సుమారు ఐదు లక్షల ప్రయాణికులకు సేవలందిస్తూ, నగర రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. రోజువారీ ప్రయాణికుల్లో మహిళల శాతం సుమారు 30 ఉండటంతో, వారి భద్రత, సౌకర్యం, విశ్వాసం మెట్రో రైలు నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత పొందుతున్న అంశాలుగా నిలుస్తున్నాయి. సమానత్వం, గౌరవం, సమాన అవకాశాలు అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా,…
దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కొందరు వ్యక్తులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. విచ్చల విడిగా రెచ్చిపోతూ… మహిళలను వేధిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇలాంటి వారి కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. వారిలో మార్పు రావడంలేదు. ఓ బస్సులో మహిళా ప్రయాణీకురాలిపై అసభ్యంగా ప్రవర్తించాడో యువకుడు. పక్కనే కూర్చున్న మహిళపై అసభ్యంగా చేతులు వేస్తూ.. ఆ యువతిని లైంగికంగా వేధించాడు. దీంతో ఆ యువతి.. ఈ తతంగాన్ని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేసింది.…
Doctor Suicide: మహారాష్ట్ర సతారాలో వైద్యురాలి ఆత్మహత్య ఘటన దేశంలో సంచలనంగా మారింది. 26 ఏళ్ల లేడీ డాక్టర్ తన మరణానికి కారణం ఓ ఎస్సై అని పేర్కొంటూ, తన చేతిపై సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేసుకుంది. ఫల్తాన్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్య అధికారిగా ఉన్న వైద్యురాలు, గురువారం రాత్రి ఉరి వేసుకుని మరణించింది. ఎస్ఐ గోపాల్ బద్నే తనపై 5 నెలల్లో నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది.
Bengal gang-rape Case: పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. కోల్కతా ఆర్జీకల్ మెడికల్ కాలేజ్ ఘటన మరవక ముందే ఈ సంఘటన చోటు చేసుకుంది. క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన, విద్యార్థిని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Durgapur Gang Rape: పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం సంచలనంగా మారింది. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో రెండో ఏడాది మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని, శుక్రవారం రాత్రి క్యాంపస్ బయటకు రాగా, కొంత మంది నిందితులు ఆమెను క్యాంపస్కు సమీపంలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బెంగాల్లోని మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కార్పై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం సంచలనంగా మారింది. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని రాత్రి సమయంలో బయటకు వచ్చిన తర్వాత, ఐదుగురు నిందితులు ఆమెను క్యాంపస్కు సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఇద్దరి కోసం వేట కొనసాగిస్తున్నారు.