Hyderabad Crime: రియల్ “కేరళ స్టోరీ”.. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లిచేసుకొని ఇస్లాం మతంలోకి మారాలంటూ..!
- హైదరాబాద్లోని కూకట్పల్లి పరిధిలో షాకింగ్ ఘటన వెలుగులోకి
- ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని నమ్మించిన నిందితుడు
- మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేసినట్లు ఆరోపణ
- పెళ్లి తర్వాత బలవంతంగా మత మార్పిడి చేశాడని బాధితురాలి ఫిర్యాదు..
Hyderabad Crime: రోజురోజుకి సమాజంలో దారుణ ఘటనలు ఎక్కువతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని కూకట్పల్లి పరిధిలో ఒక విస్తుపోయే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఒక యువతిని నమ్మించి, అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, బలవంతంగా మత మార్పిడి చేసినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి.
Riyan Parag: మ్యాచ్ పోయిందనుకున్నాం.. ఆ ఇద్దరే దేవుడిలా వచ్చి కాపాడారు, ఈసారి గట్టిగా కొడతాం!
Also Read
- Supreme Court: ప్రవక్త కాలం నుంచే మసీదుల్లోకి మహిళలకు అనుమతి ఉంది.. జస్టిస్ అమానుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు!
- 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
- PEDDI : 'పెద్ది' జూన్ నెలాఖరున రిలీజ్ ఫిక్స్..
- Dr Preeti Reddy: బీజేపీ ఆఫీస్కు మల్లారెడ్డి కోడలు.. రాజకీయాల్లో హాట్ టాపిక్!!
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ నవాజ్ అనే వ్యక్తి సదరు హిందూ యువతిని ప్రేమ పేరుతో నమ్మించాడు. వివాహానికి ముందే జూలై 2025లో నవాజ్ ఆమెను బేగంపేటలోని తన గదికి పిలిపించాడు. అక్కడ ఆమెకు నీటిలో మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయిన తర్వాత నవాజ్ తన సోదరులు, స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి (Gang Rape) పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ఆ తర్వాత నిందితుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి జరిగిన తర్వాత అసలు స్వరూపం బయటపడింది. నవాజ్ తనను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా తనకు తెలియకుండానే నవాజ్ అప్పటికే మరో ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నాడని, తనను మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడి వేధింపులు భరించలేక చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.
Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు..!
బాధితురాలి ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు షేక్ నవాజ్, షేక్ మునావర్, ఇస్మాయిల్, షారుక్, ఇర్ఫాన్ అనే ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అయితే ప్రధాన ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో కూకట్పల్లి పోలీసులు ప్రాథమికంగా ‘జీరో ఎఫ్ఐఆర్’ (Zero FIR) నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసును బేగంపేట పోలీసులకు బదిలీ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Supreme Court: ప్రవక్త కాలం నుంచే మసీదుల్లోకి మహిళలకు అనుమతి ఉంది.. జస్టిస్ అమానుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
PEDDI : ‘పెద్ది’ జూన్ నెలాఖరున రిలీజ్ ఫిక్స్..
-
Dr Preeti Reddy: బీజేపీ ఆఫీస్కు మల్లారెడ్డి కోడలు.. రాజకీయాల్లో హాట్ టాపిక్!!
-
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు చుక్కెదురు.. ముందస్తు బెయిల్ తిరస్కరణ
ట్రెండింగ్
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!