Hyderabad Crime: రియల్ “కేరళ స్టోరీ”.. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లిచేసుకొని ఇస్లాం మతంలోకి మారాలంటూ..!
- హైదరాబాద్లోని కూకట్పల్లి పరిధిలో షాకింగ్ ఘటన వెలుగులోకి
- ప్రేమ, పెళ్లి పేరుతో యువతిని నమ్మించిన నిందితుడు
- మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేసినట్లు ఆరోపణ
- పెళ్లి తర్వాత బలవంతంగా మత మార్పిడి చేశాడని బాధితురాలి ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: రోజురోజుకి సమాజంలో దారుణ ఘటనలు ఎక్కువతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని కూకట్పల్లి పరిధిలో ఒక విస్తుపోయే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ, పెళ్లి పేరుతో ఒక యువతిని నమ్మించి, అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, బలవంతంగా మత మార్పిడి చేసినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి.
Riyan Parag: మ్యాచ్ పోయిందనుకున్నాం.. ఆ ఇద్దరే దేవుడిలా వచ్చి కాపాడారు, ఈసారి గట్టిగా కొడతాం!
Also Read
- Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు... ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
- DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
- AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ నవాజ్ అనే వ్యక్తి సదరు హిందూ యువతిని ప్రేమ పేరుతో నమ్మించాడు. వివాహానికి ముందే జూలై 2025లో నవాజ్ ఆమెను బేగంపేటలోని తన గదికి పిలిపించాడు. అక్కడ ఆమెకు నీటిలో మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయిన తర్వాత నవాజ్ తన సోదరులు, స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి (Gang Rape) పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
ఆ తర్వాత నిందితుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి జరిగిన తర్వాత అసలు స్వరూపం బయటపడింది. నవాజ్ తనను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా తనకు తెలియకుండానే నవాజ్ అప్పటికే మరో ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నాడని, తనను మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడి వేధింపులు భరించలేక చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.
Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు..!
బాధితురాలి ఫిర్యాదు మేరకు కూకట్పల్లి పోలీసులు షేక్ నవాజ్, షేక్ మునావర్, ఇస్మాయిల్, షారుక్, ఇర్ఫాన్ అనే ఐదుగురిపై కేసు నమోదు చేశారు. అయితే ప్రధాన ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో కూకట్పల్లి పోలీసులు ప్రాథమికంగా ‘జీరో ఎఫ్ఐఆర్’ (Zero FIR) నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం కేసును బేగంపేట పోలీసులకు బదిలీ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Ram Pothineni: పాండిచ్చేరిలో RAPO 23
-
Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు… ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
-
DK Shivakumar: ‘రాజీనామా’ నిమిషాల్లో ఆమోదిస్తా.. అసమ్మతిపై డీకే.శివకుమార్ హెచ్చరిక
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో కూడిన వర్షాలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!