ఇప్పుడున్న మెసేజింగ్ యాప్స్లో వాట్సాప్దే పైచేయి. సులువుగా చాటింగ్ చేయడానికి వీలుండటమే కాదు, ఎన్నో అధునాతనమైన ఫీచర్స్తో ఇది ఊరిస్తూ వస్తోంది. కొత్త కొత్త అప్డేట్స్తో మాంచి కిక్ ఇస్తోంది. అందుకే, యువత ఈ యాప్కి బాగా ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే మరిన్ని క్రేజీ అప్డేట్స్ని వాట్సాప్ తీసుకొస్తోంది. రీసెంట్గానే వాయిస్ మెసేజ్ ఎడిట్, మీడియా ఫైల్ ఎడిటింగ్, గూగుల్ డ్రైవ్ బ్యాకప్ వంటి వాటిని అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్.. లేటెస్ట్గా మరో క్రేజీ అప్డేట్ని రిలీజ్…
జనాలని బురిడీ కొట్టించి, డబ్బులు దండుకోవడానికి సైబర్ నేరగాళ్లు పన్నుతున్న వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు. రకరకాల యాప్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా.. ఏదైతే ట్రెండింగ్లో ఉంటుందే, దాన్నే ఆయుధంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు వీరి కన్ను ‘వాట్సాప్’పై పడింది. ఈ మెసేజింగ్ యాప్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తారన్న సంగతి తెలిసిందే! దీన్నే ఆసరాగా చేసుకొని.. వాట్సాప్ని పోలి ఉండే నకిలీ యాప్స్ తయారు చేస్తూ, మోసాలకు తెగిస్తున్నారు. గతంలోనూ ఈ పన్నాగాలు పన్నారు.…
యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకురావడంలో వాట్సాప్ ముందుంటుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని మెసెంజర్ యాప్లు ఉన్నా యూజర్లు వాట్సాప్ వాడటాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇప్పటికే పేమెంట్స్ వంటి ఫీచర్లను కూడా వాట్సాప్ ప్రవేశపెట్టింది. తాజాగా మహిళల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళలు తమ నెలసరిని సులువుగా ట్రాక్ చేసేందుకు వీలుగా సిరోనా హైజెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి వాట్సాప్ ఈ ఫీచర్ను ప్రారంభించింది. దేశంలో తొలిసారిగా వాట్సాప్…
వాట్సప్… ప్రపంచానికి పరిచయం అక్కర్లేని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్. ఒక్క భారతదేశంలోనే దాదాపు 40 కోట్లకు పైగా వాట్సప్ యూజర్లు ఉన్నారు. వాట్సప్ వినియోగదారులను దోచుకునేందుకు కొత్తకొత్త స్కాంలు బయటపడుతున్నాయి. తాజాగా మరో స్కామ్ కలకలం రేపుతోంది. ఈ స్కామ్తో యూజర్ల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు సైబర్ నేరస్థులు. ఆ స్కామ్ ఎలా జరుగుతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి మరీ. భారత్లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఎంత పాపులర్ అయిందో వాట్సప్ కూడా అంతే పాపులర్…
మనలో చాలామందికి వాట్సప్లో ఎవరైనా మెస్సేజ్ చేసి డిలీట్ చేసేన తరువాత అరెరే.. ఆ మెస్సేజ్ చదువుతే బాగుండు.. ఒక్కసారి అదేంటో చూస్తే బాగుండు అని అనిపిస్తుంది. అయితే ఒకసారి డిలీట్ అయిన తరువాత ఆ మెస్సేజిలను చదివే పరిస్థితి ఉండదు. కానీ ఓ ట్రిక్ సహాయంతో..ఆ డిలీటెడ్ మెస్సేజిలను కూడా చదవవచ్చు.. సోషల్ మీడియా వేదికల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన యాప్ వాట్సప్. ఇదొక మెస్సేజింగ్ యాప్. ఎప్పటికప్పుుడు యూజర్లను ఆకర్షించేందుకు వాట్సప్ సరికొత్త ఫీచర్లు…
టెలిగ్రామ్.. వాట్సాప్ తరహాలోనే సేవలు అందించే ఓ మెసేజింగ్ యాప్. ఇటీవలి కాలంలో ఈ యాప్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వాట్సాప్లో లేని అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉండటం, ప్రైవేట్ సెక్యూరిటీ స్ట్రాంగ్గా ఉండడంతో.. యూజర్స్ దీనిని బాగా డౌన్లోడ్స్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టెలిగ్రామ్ మరిన్ని ఫీచర్స్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కాకపోతే.. ఆ ఫీచర్స్ ఉచితంగా వినియోగించడానికి వీల్లేదు. డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్…
వాట్సాప్ ఇప్పుడు అందరికీ చేరువ అయింది. వాట్సాప్ ద్వారా సమాచారం వేగంగా అవతలి వ్యక్తులకు చేరుతోంది. ప్రభుత్వ అధికారులు కూడా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలకు చేరువ అవుతున్న సందర్భం ఇది. ఏపీ ప్రభుత్వం సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్తో ఓ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంపై ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చిన్న వాసుదేవ రెడ్డి సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏపీ ప్రభుత్వంతో కలిసి వాట్సాప్…