ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద హవాలా రాకెట్ గుట్టు రట్టు అయ్యింది… బంగారం స్మగ్లింగ్, జీఎస్టీ ఎగవేతే లక్ష్యంగా హవాలా లావాదేవీలు జరుగుతున్నట్టు చెబుతున్నారు అధికారులు.. ట్రావెల్స్ బస్సుల ద్వారా హవాలా సొమ్ము, బంగారం రవాణా చేస్తున్నారు.. ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో బయటపడ్డ సొమ్ముతో అధికారులు నోరు వెల్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.. తూర్పు గోదావరి జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు పట్టబడటం కలకలం సృష్టించింది. ట్రావెల్స్…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో రెండేళ్ళపాటు అమాత్య పదవి పొందేందుకు వివిధ జిల్లాల నుంచి పోటీ తీవ్రతరం అయింది. అధికారంలో వుండే ఏ పార్టీకి అయినా ఉభయ గోదావరి జిల్లాలు ఆయువుపట్టు. అక్కడ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీయే అధికారం చేపడుతుంది. ఈ సంప్రదాయం, సెంటిమెంట్ ఎప్పటినుంచో వస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2019 ఎన్నికల్లో రెండుచోట్ల మాత్రమే టీడీపీ అభ్యర్ధులు…
తనకు తాను చెప్పుతో కొట్టుకుని ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు. అక్కడితో ఆగకుండా సొంత పార్టీ ఎమ్మెల్యే ప్రసాదరాజుపై తీవ్ర కామెంట్స్ చేశారు. ఇద్దరి మధ్య సఖ్యత లేదని కొన్నాళ్లుగా చర్చ జరుగుతున్నా.. అది బయటపడిన సందర్భాలు లేవు. కానీ.. నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలన్న ఉద్యమం.. ఆ విభేదాలను బయటపెట్టేసింది. ఇంతకీ సుబ్బారాయుడికి, ప్రసాదరాజుకు ఎక్కడ చెడింది? గుర్తింపు లేదన్న ఆవేదనలో ‘చెప్పు’తో కొట్టేసుకున్నారా?కొత్తపల్లి సుబ్బారాయుడు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పొలిటికల్…
పరమ పవిత్రమయిన మహా శివరాత్రి నాడు శైవాలయాలకు పోటెత్తుతున్నారు భక్తులు. శివుడికి అభిషేకం చేసి జాగరణ వుంటే పాపాలు పోతాయని, పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా బలివే శివాలయానికి పెద్ద ఎత్తున కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి భక్తులు పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు తపన ఫౌండేషన్ చైర్మన్ గారపాటి చౌదరి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. రెండు ప్రసాద వితరణ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఒకటి…
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. బాగా తాగి వచ్చినవారంతా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ హడావిడి చేశారు. ఒకరిపై ఒకరు దాడిచేసుకుంటూ హల్చల్ చేశారు. లక్ష్మీ థియేటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడే వున్న వ్యక్తులు ఈ దృశ్యాలను వీడియో తీశారు. మద్యం మత్తులో సీసాలు, రాడ్లతో కొట్టుకున్నారు. ఆర్టీసీ బస్సు కింద పడుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు మందుబాబులను అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనతో ఏం జరుగుతుందో తెలీక…
కోకో పంట కాసులు కురిపిస్తోంది.. అంతర్జాతీయంగా మంచి గిరాకీ ఉన్న పంట కూడా ఇది.. చాక్లెట్లు, కాఫీ, కేకుల తయారీలో కోకో వినియోగిస్తారు.. క్రమంగా చాక్లెట్లు, కాఫీ, కేకుల కల్చర్ కూడా పెరిగిపోతుండడంతో.. ఆ పంట వేసిన రైతులకు సిరులు కురుస్తున్నాయి… కొబ్బరి, ఆయిల్పామ్ తోటల్లో అంతర పంటగా దీనిని సాగుచేస్తున్నారు రైతులు.. మరోవైపు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది… భారత్లో కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రైతులు అధికంగా సాగు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోనూ కొన్ని ప్రాంతాల్లో ఈ పంట…
పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం తప్పింది. ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం శివారులో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు కట్టలు విరిగిపోవడంతో బస్సు వెనక టైర్లపై ఒరిగిపోయింది బస్. ప్రమాదం సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ బస్సుని పోలవరం కుడికాలువ బ్రిడ్జి వద్ద నిలిపివేశారు డ్రైవర్. ఘోర ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు ప్రయాణికులు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు వున్నట్టు తెలుస్తోంది. ద్వారకాతిరుమల నుండి ఏలూరు వెళుతుండగా…
సంక్రాంతి సంబరాల్లో అనేక పోటీలు నిర్వహిస్తున్నారు.. సంక్రాంతి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతాయి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు, ఎడ్ల పందాలులు చాలా ఫేమస్.. ముఖ్యంగా కోనసీమ జిల్లాల్లో ఇవి పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు కూడా చూసిచూడనట్టుగా వ్యవహరించిన సందర్భాలే ఎక్కువని చెబుతారు.. అయితే, ఈ సారి కోడి పందేలు, ఎడ్ల పందాలకు భిన్నంగా.. పందుల పోటీలు నిర్వహించారు.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివారు ప్రాంతం ఈ…
సంక్రాంతి పండుగ వచ్చిదంటే చాలు కోడి పందాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందాలు జోరుగా కొనసాగుతాయి. అయితే కోడి పందాలు సంప్రదాయ బద్ధంగానే నిర్వహించాలని కోర్టులు చెప్పిన కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లాల్లో జోరుగా కోడి పందాలు ప్రారంభమయ్యాయి. భీమవరం, ఉంది, వెంప, దెందులూరు, తణుకు, అమలాపురం, రావులపాలెంలో భారీగా తమ కోడి పందాలు జరిగాయి. Read Also: వైసీపీ ఎంపీకి సైబర్…
తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తాజా పరిణామాలపై గుర్రుగా వున్నారు. నా వెనుక కొంత మంది కుట్రలు పన్నుతున్నారు.గత ఎన్నికల నుంచి కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి…ఈ లుకలుకలు ఇప్పుడు బయట పడ్డాయన్నారు. నా ఫ్లెక్సీలు నేనే వేసుకోను.. కార్యకర్తలే వేస్తారు. లోకల్ ఎమ్మెల్యే అయినా…వంకా రవి ఫ్లెక్సీల్లో నా బొమ్మ వేయలేదు. వంకా రవి పార్టీ పక్కన పెట్టిన సాయిరాం అనే వ్యక్తిని తీసుకుని వచ్చి పెన్షన్ల కార్యక్రమం చేపట్టాడు. అందుకే నేను చిరాకు పడ్డాను.…