Heavy Rains : ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలతో ఖమ్మం జిల్లాలోని పాలేరు, వైరా రిజర్వాయర్ నిండాయి. రిజర్వాయర్ల నుంచి అలుగులు పోస్తున్నాయి. మహబూబాబాద్, సూర్యపేట జిల్లాలో కురిసిన వర్షాలతో ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజక వర్గంలో చెరువులన్నీ నిండి అలుగులు పోస్తున్నాయి. కొన్ని చోట్ల రోడ్ల పైకి నీళ్లు చేరుకున్నాయి. అదేవిధంగా పాలేరు జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంది. పాలేరు జలాశయం 23 అడుగులు ఉండగా నిండటంతో గేట్ల నుంచి అలుగులు పోస్తున్నాయి. అదే…
రాష్ట్రంలోని జలాశయాలు ఎండిపోతున్నాయి. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో నది ప్రవాహాలు సన్నని ధారలా కూడా రావడం లేదు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో ఇప్పటికే నీరు అడుగు పట్టింది. కృష్ణానది పరివాహకంగా ఇప్పటికే పరిస్థితి ఆందోళన కరంగా మారుతోంది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయర్ మానేరు, కడెం ప్రాజెక్టులో గతేడాదితో పోలిస్తే ఇప్పటికే నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి.
నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నదిలో వరద ప్రవాహం ‘ప్రమాద’కరంగా పెరుగుతోంది. ఒక్కో అడుగూ పెరుగుతూ ఆంధ్రప్రదేశ్లోని ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 13.3 అడుగుల వద్దకు చేరింది. దీంతో మరికొద్దిసేపట్లో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేయనున్నారు. కోనసీమలో గోదావరి ఉధృతంగా ప్రవాహిస్తుండటంతో అధికార యంత్రాంగం హైఅలర్ట్ అయింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్)ను, రెస్క్యూ టీంలను అప్రమత్తం చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర అర్ధరాత్రి 12 గంటలకు మొదటి…