Minister Narayana: విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సహకారం అందించండి..
- విజయవాడ..విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులకు సహకారం అందించండి
- అమృత్ 2 పథకం పనుల కొనసాగింపునకు సహకరించండి
- కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఖట్టర్కు ఏపీ మంత్రి నారాయణ ప్రతిపాదనలు
- ఢిల్లీలో రెండోరోజు కొనసాగిన మంత్రి నారాయణ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana Delhi Tour: విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కోరారు ఏపీ పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ..రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఖట్టర్ తో నారాయణ భేటీ అయ్యారు..ఈ భేటీలో మంత్రి నారాయణతో పాటు పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కూడా పాల్గొన్నారు..2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలోనే విజయవాడ,విశాఖపట్నంలో మెట్రో రైల్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్దం చేసారు…2015 వ సంవత్సరంలోనే డీపీఆర్లు కూడా సిద్ధం అయ్యాయి.. ఆయా ప్రాజెక్ట్ లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిగాయి.. అయితే ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెట్రో రైల్ ప్రాజెక్ట్ లను ఏమాత్రం పట్టించుకోలేదు.. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఈ ప్రాజెక్ట్లపై దృష్టి సారించింది..ఇప్పటికే ఈ ప్రాజెక్ట్లకు సంబంధించి తాజా నివేదికలు సిద్దం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.ఢిల్లీలో కేంద్రమంత్రి ఖట్టర్తో భేటీ సందర్భంగా తాజా ప్రతిపాదనలతో పూర్తి వివరాలు అందించారు మంత్రి నారాయణ…గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన రెండు ప్రాజెక్ట్ లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు..మరోవైపు విజయవాడ మెట్రో ను రాజధాని అమరావతికి అనుసంధానించే ప్రతిపాదనలు కూడా ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లారు నారాయణ.
అమృత్ 2 పథకం పనుల కొనసాగింపునకు సహకరించండి..
Also Read
- Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
- Jofra Archer: "ఇది ఐపీఎల్ కాదు".. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
- Fake Condoms: "కండోమ్"లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
- Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
మరో వైపు అమృత్ 2 పథకం అమలుపైనా ఇరువురి మధ్య కీలక చర్చ జరిగింది…అమృత్ పథకం కింద రాష్ట్రంలోని పలు మున్సిపాల్టీల్లో వివిధ అభివృద్ది పనులను చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం…నాటి టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన పలు అభివృద్ది పనులను వైసీపీ ప్రభుత్వం కొనసాగించలేదు..పైగా అమృత్ పథకం ద్వారా కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా నిధులు కూడా విడుదల చేయకపోవడంతో ప్రాజెక్ట్ మొత్తం నిలిచిపోయింది..గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అమృత్ పథకం అమలుకు నోచుకోలేదని..ఆ పథకాన్ని ఇప్పుడు కొనసాగించాలని కోరారు..మంత్రి నారాయణ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి ఖట్టర్ సానుకూలంగా స్పందించారు…
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..