‘టీ20 వరల్డ్కప్’ అంటేనే క్షణక్షణం ఉత్కంఠ పోరు. ఈ మెగా టోర్నమెంట్లో జట్టు విజయం ఎంత ముఖ్యమో.. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాడికి దక్కే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డుకు కూడా అంతే ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇప్పటివరకు చాలా మంది ప్లేయర్స్ ఈ అవార్డు అందుకున్నారు. మొట్టమొదటి ఆటగాడిగా పాకిస్థాన్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది రికార్డుల్లో ఉన్నాడు. ఇప్పటివరకు జరిగిన ప్రతి టీ20 వరల్డ్కప్లో ఈ అవార్డు గెలిచిన ఆటగాళ్లు చరిత్రలో నిలిచిపోయారు.…
Highest runs in T20 World Cup: ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి మరో వరం రోజులే ఉంది. ఈ సారి భారతదేశం, శ్రీలంక ఆతిథ్యంగా నిర్వహించే ఈ టోర్నమెంట్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. 2007 నుండి T20 వరల్డ్ కప్ మొదలైందన్న సంగతి తెలిసిందే. కానీ కేవలం కొద్దిమందే ఈ ఫార్మాట్ లో సత్తా చూపారు. మరి ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు సాధించిన…
భారత క్రికెట్కు టీ20 ఫార్మాట్లో మంచి గుర్తింపు ఉంది. ప్లేయర్స్ స్థిరమైన బ్యాటింగే ఇందుకు ప్రధాన కారణం. ప్రతి ఏడాది ఓ బ్యాటర్ పరుగుల వరద పారించి.. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రతి క్యాలెండర్ ఇయర్లో ఓ బ్యాటర్ నంబర్–1గా నిలిచాడు. 2010 నుంచి ప్రతి క్యాలెండర్ ఇయర్ ముగిసే సరికి భారత్ తరఫున నంబర్–1 టీ20 బ్యాటర్గా నిలిచిన ఆటగాళ్ల జాబితా అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ లిస్ట్ చూస్తే ఒక విషయం స్పష్టంగా…
Rohit Sharma: టీ20 వరల్డ్ కప్ కి ఎంపిక చేసిన జట్టుపై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలకీ జట్టులో చోటు కల్పించే మార్గాన్ని టీమిండియా యాజమాన్యం వెతకాలని సూచించారు.
డిజిటల్ ప్రపంచాన్ని ఒక్కసారిగా షేక్ చేసిన పరిణామం ఇది. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అకస్మాత్తుగా డీయాక్టివేట్ అయింది. దాంతో 274 మిలియన్ల (27 కోట్ల 40 లక్షలు) ఫాలోవర్స్ అయోమయంలో పడిపోయారు. శుక్రవారం (జనవరి 30) ఉదయం నుంచే కింగ్ ఇన్స్టా ప్రొఫైల్ పూర్తిగా మాయమైంది. ఇన్స్టాగ్రామ్లో ‘Virat Kohli’ అని సెర్చ్ చేస్తే.. ప్రొఫైల్ కనిపించడం లేదు. ‘దిస్ పేజ్ ఈజ్ నాట్ అవైలబుల్’, ‘ది లింక్ మే బీ…
భారత క్రికెట్ వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మళ్లీ టీమిండియాకు సేవలందించేందుకు రాబోతున్నాడా? అంటే.. అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఇప్పుడు రవిశాస్త్రి రీఎంట్రీ సోషల్ మీడియా, క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. 2029 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) వరకు రవిశాస్త్రిని టెస్ట్ జట్టు కోచ్గా తిరిగి తీసుకురావాలని బీసీసీఐ గట్టిగా ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. రవిశాస్త్రి కోచింగ్లో భారత్ టెస్ట్ క్రికెట్లో అద్భుత విజయాలు అందుకుంది.…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొన్ని సంవత్సరాల క్రితం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ జట్టుతో మ్యాచ్లు లేని సమయంలో సెంట్రల్ కాంట్రాక్ట్లో ఉన్న భారత ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళీ టోర్నీల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసింది. భారత జట్టులో సుస్థిర స్థానం సంపాదించిన తర్వాత చాలా మంది ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ను పక్కన పెట్టేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికే బీసీసీఐ ఆ విధానంను తీసుకొచ్చింది. ఈ మార్పు దేశవాళీ క్రికెట్కు కొత్త ఊపునిచ్చింది.…
ఇటీవల భారత్తో ముగిసిన వన్డే సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ ప్రపంచ క్రికెట్లో సంచలనం సృష్టించాడు. తాజా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి.. నంబర్వన్ స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం మిచెల్ ఖాతాలో 845 పాయింట్లు ఉన్నాయి. ఇంతకుముందు మొదటి స్థానంలో ఉన్న కింగ్ కోహ్లీ 795 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. వరుసగా రెండు సెంచరీలతో సిరీస్ను శాసించిన డారిల్…
ఇండోర్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ ఒక బ్రౌన్ కలర్ డ్రింక్ తాగడం, ఆ తర్వాత అతను ఇచ్చిన వింత ఎక్స్ప్రెషన్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా కోహ్లీ ముఖంలో కనిపించిన హావభావాలు ఈ ఆసక్తిని మరింత పెంచాయి. దీంతో ఆ డ్రింక్ ఏంటనే విషయంపై నెట్టింట ఆసక్తికర చర్చ మొదలైంది. ఆ వీడియోను…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త కేంద్ర కాంట్రాక్ట్ సిస్టమ్ ను ప్రవేశపెట్టనున్నది. దీని కింద గ్రేడ్ A ప్లస్ కేటగిరీ రద్దు చేయనున్నట్లు సమాచారం. BCCI వర్గాల సమాచారం ప్రకారం, బోర్డు ఈ కొత్త నమూనాను ఆమోదిస్తే, టీం ఇండియా దిగ్గజ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గ్రేడ్ ను తగ్గించే అవకాశం ఉంది. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లను గ్రేడ్ Bలో ఉంచొచ్చని తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కేంద్ర…