T20 World Cup 2026: అఫ్రిది టు బుమ్రా.. వరల్డ్కప్ చరిత్రలో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు వీరులు వీరే!
- మొట్టమొదటి ఆటగాడిగా షాహిద్ అఫ్రిది
- 2014 వరల్డ్కప్లో విరాట్ కోహ్లీ కింగ్
- 2024 వరల్డ్కప్లో జస్ప్రీత్ బుమ్రాకు అవార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘టీ20 వరల్డ్కప్’ అంటేనే క్షణక్షణం ఉత్కంఠ పోరు. ఈ మెగా టోర్నమెంట్లో జట్టు విజయం ఎంత ముఖ్యమో.. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాడికి దక్కే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డుకు కూడా అంతే ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇప్పటివరకు చాలా మంది ప్లేయర్స్ ఈ అవార్డు అందుకున్నారు. మొట్టమొదటి ఆటగాడిగా పాకిస్థాన్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది రికార్డుల్లో ఉన్నాడు. ఇప్పటివరకు జరిగిన ప్రతి టీ20 వరల్డ్కప్లో ఈ అవార్డు గెలిచిన ఆటగాళ్లు చరిత్రలో నిలిచిపోయారు.
2007 దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 వరల్డ్కప్లో షాహిద్ అఫ్రిది ఈ అవార్డును దక్కించుకున్నాడు. అఫ్రిది 91 రన్స్, 12 వికెట్స్ పడగొట్టాడు. 2009లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టోర్నీలో శ్రీలంక స్టార్ తిలకరత్నే దిల్షాన్ 317 రన్స్ చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచాడు. 2010 వెస్టిండీస్లో ఇంగ్లాండ్ తరఫున ఆడిన కెవిన్ పీటర్సన్ కీలక ఇన్నింగ్స్లతో (248 రన్స్) తన ముద్ర వేశాడు. 2012 శ్రీలంకలో జరిగిన వరల్డ్కప్లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ షేన్ వాట్సన్ అద్భుత ప్రదర్శనతో (249 రన్స్, 12 వికెట్స్) ఈ అవార్డు గెలుచుకున్నాడు.
Also Read
- T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
- Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
- IND-A Vs SL-A: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
Also Read: Santosh Sobhan Movie Break: సినిమాలకు బ్రేక్.. అసలు నిజం బయటపెట్టిన సంతోష్ శోభన్!
2014 వరల్డ్కప్లో కింగ్ విరాట్ కోహ్లీ అసాధారణ నిలకడతో (319 రన్స్) ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచాడు. 2016 భారత వేదికగా జరిగిన టీ20 వరల్డ్కప్లో కూడా మరోసారి విరాట్ (273 రన్స్, 1 వికెట్) ఘనతను సాధించి అరుదైన రికార్డు నెలకొల్పాడు. 2021లో జరిగిన టీ20 వరల్డ్కప్లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలక పరుగులతో (289) జట్టును విజేతగా నిలబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించాడు. 2022 ఆస్ట్రేలియాలో జరిగిన టోర్నీలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ తన ఆల్రౌండ్ ప్రదర్శనతో (13 వికెట్స్, 12 రన్స్) ఈ అవార్డు అందుకున్నాడు. వెస్టిండీస్-అమెరికా వేదికగా జరిగిన 2024 వరల్డ్కప్లో జస్ప్రీత్ బుమ్రా 15 వికెట్లతో అవార్డు కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు అందరి దృష్టి 2026 టీ20 వరల్డ్కప్ (భారత్ – శ్రీలంక)పై ఉంది. ఈసారి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు ఎవరి ఖాతాలోకి వెళ్లనుందో చూడాలి.
తాజావార్తలు
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!