‘టీ20 వరల్డ్కప్’ అంటేనే క్షణక్షణం ఉత్కంఠ పోరు. ఈ మెగా టోర్నమెంట్లో జట్టు విజయం ఎంత ముఖ్యమో.. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాడికి దక్కే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డుకు కూడా అంతే ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇప్పటివరకు చాలా మంది ప్లేయర్స్ ఈ అవార్డు అందుకున్నారు. మొట్టమొదటి ఆటగాడిగా పాకిస్థాన్ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది రికార్డుల్లో ఉన్నాడు. ఇప్పటివరకు జరిగిన ప్రతి టీ20 వరల్డ్కప్లో ఈ అవార్డు గెలిచిన ఆటగాళ్లు చరిత్రలో నిలిచిపోయారు.
2007 దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 వరల్డ్కప్లో షాహిద్ అఫ్రిది ఈ అవార్డును దక్కించుకున్నాడు. అఫ్రిది 91 రన్స్, 12 వికెట్స్ పడగొట్టాడు. 2009లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టోర్నీలో శ్రీలంక స్టార్ తిలకరత్నే దిల్షాన్ 317 రన్స్ చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచాడు. 2010 వెస్టిండీస్లో ఇంగ్లాండ్ తరఫున ఆడిన కెవిన్ పీటర్సన్ కీలక ఇన్నింగ్స్లతో (248 రన్స్) తన ముద్ర వేశాడు. 2012 శ్రీలంకలో జరిగిన వరల్డ్కప్లో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ షేన్ వాట్సన్ అద్భుత ప్రదర్శనతో (249 రన్స్, 12 వికెట్స్) ఈ అవార్డు గెలుచుకున్నాడు.
Also Read: Santosh Sobhan Movie Break: సినిమాలకు బ్రేక్.. అసలు నిజం బయటపెట్టిన సంతోష్ శోభన్!
2014 వరల్డ్కప్లో కింగ్ విరాట్ కోహ్లీ అసాధారణ నిలకడతో (319 రన్స్) ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచాడు. 2016 భారత వేదికగా జరిగిన టీ20 వరల్డ్కప్లో కూడా మరోసారి విరాట్ (273 రన్స్, 1 వికెట్) ఘనతను సాధించి అరుదైన రికార్డు నెలకొల్పాడు. 2021లో జరిగిన టీ20 వరల్డ్కప్లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలక పరుగులతో (289) జట్టును విజేతగా నిలబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించాడు. 2022 ఆస్ట్రేలియాలో జరిగిన టోర్నీలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సామ్ కరన్ తన ఆల్రౌండ్ ప్రదర్శనతో (13 వికెట్స్, 12 రన్స్) ఈ అవార్డు అందుకున్నాడు. వెస్టిండీస్-అమెరికా వేదికగా జరిగిన 2024 వరల్డ్కప్లో జస్ప్రీత్ బుమ్రా 15 వికెట్లతో అవార్డు కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు అందరి దృష్టి 2026 టీ20 వరల్డ్కప్ (భారత్ – శ్రీలంక)పై ఉంది. ఈసారి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు ఎవరి ఖాతాలోకి వెళ్లనుందో చూడాలి.