Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ గురించి బ్రతకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు సాధించిన నటుడిగా ప్రస్తుతం నేషనల్ హీరోగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. పుష్ప 2 సినిమాతో కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డులను మాత్రమే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో బాక్సాఫీస్ ను బద్దలు కొట్టాడు. ఇకపోతే, అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ ను ఇష్టపడే వారు ఎందరో ఉన్నారు. ఇది…
PM Modi: అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడుక అమరావతిలో పెద్దెతున్న జరుగుతుంది. ఈ సందర్బంగా ప్రధాని మోడీ హాజరయ్యారు. అమరావతిలో ఏర్పాటు చేసిన సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కి ప్రధాని మోడీల మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఏర్పాటు చేసిన సభా వేదికపై ముఖ్య నేతలందరూ కూర్చొని ఉండగా.. ప్రధాని మోడీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను దగ్గరకు పిలిచారు. Read Also: PM Modi: ప్రధాని మోడీ…
Viral News : ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం ఒక మధురమైన జ్ఞాపకం. ఆడుతూ పాడుతూ గడిపిన రోజులు, చిన్ననాటి స్నేహితులు, పెరిగిన ఇంటి పరిసరాలు… ఇవన్నీ తలచుకుంటే ఒక తెలియని ఆనందం కలుగుతుంది. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొంతమంది అనివార్య కారణాల వల్ల తమ ఊరిని, తమ బాల్యాన్ని వదిలి వేరే చోటకు వెళ్లాల్సి వస్తుంది. కొత్త ప్రదేశంలో కొత్త స్నేహితులు దొరికినా, పాత జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ గుండెల్లో పదిలంగా ఉంటాయి.…
Pakistan: 26 మంది టూరిస్టుల్ని బలి తీసుకున్న పహల్గామ్ ఉగ్రవాద ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో తెలియక పాకిస్తాన్ భయపడి చస్తోంది. ఇదిలా ఉంటే, పాక్ అంతర్గత పరిస్థితులు కూడా ఆశాజనకంగా లేవు. బలూచిస్తాన్లో బీఎల్ఏ, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాక్ తాలిబాన్ల దెబ్బకు పాక్ సైన్యం తోకముడుస్తోంది. పాక్ సైన్యంలో పంజాబ్ ఆధిపత్యాన్ని ఇతర ప్రాంతాలు సహించడం లేదు. Read Also: Shahid Afridi: షాహిద్…
Viral Video: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రతిఒక్కరికి అందుబాటులో ఉండడంతో ప్రతి నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉండడం చూస్తూనే ఉంటాము. ప్రపంచంలో ఏ మూలన ఏం విషయం జరిగినా, అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు క్షణాల్లో మన ముందు ప్రత్యక్షమవుతున్నాయి. ఇందులో కొన్ని సరికొత్త, ఆసక్తికర అంశాలు ఎక్కువగా వైరలయ్యి ఆశ్చర్యపరుస్తాయి. ఈ కోవలోకే తాజాగా ఓ వైరల్ వీడియో కూడా చేరింది. మరి ఆ వీడియో ఏంటి? అసలేమీ జరిగిందన్న విషయాన్ని…
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో అమరవీరుడైన కాన్పూర్ కి చెందిన శుభం ద్వివేది ఇంటికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేరుకున్న విషయం తెలిసిందే. సీఎం రాకతో అక్కడ వాతావరణం చాలా భావోద్వేగంగా మారింది. ఈ పరిస్థితిని చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి. ముఖ్యమంత్రిని చూడగానే శుభం భార్య ఐష్ణయ కన్నీరుమున్నీరైంది. వణుకుతున్న స్వరంతో "సార్.. మేము ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాం.' అన్నారు.
పహల్గామ్ దాడి తర్వాత.. భారతదేశం పాకిస్థాన్పై అనేక కఠినమైన చర్యలు తీసుకుంది. పాకిస్థాన్లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేయాలని భారతదేశం నిర్ణయించింది. అలాగే.. భారతదేశంలోని పాకిస్థాన్ దౌత్యవేత్తలను 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఇంతలో పాకిస్థాన్ హైకమిషన్ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి పాకిస్థాన్ హైకమిషన్కు కేక్ తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది.
KL Rahul: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో ప్లేఆఫ్స్ స్థానాల కోసం జట్లు అమీ తుమి తేల్చుకుంటున్నాయి. ఇప్పటికే ప్రతి జట్టు కనీసం ఏడు మ్యాచులు ఆడడంతో సగం ఐపీఎల్ సీజన్ ముగిసినట్లయింది. ఇకపోతే ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ప్లేఆఫ్ స్థానాల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్…
జమ్మూ కాశ్మీర్లో మంగళవారం చోటుచేసుకున్న భయంకరమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది పర్యాటకులు మృతిచెందినట్లు సమాచారం. మరో 20 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అయితే.. సైనికుల దుస్తుల్లో వచ్చిన ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
మధ్యప్రదేశ్లోని ప్రభుత్వాస్పత్రిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వృద్ధుడిని వైద్య సిబ్బంది కనికరం లేకుండా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇద్దరు వైద్యులపై సస్పెండ్ వేటు వేసింది.