Hyderabad: ముదిరిన రీల్స్ పిచ్చి..ఫేమస్ కావడం కోసం రైల్వే ట్రాక్పై వేగంగా కారు నడుపుతూ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అది ఉదయం 9 గంటలు.. అదే సమయంలో సిటీకి వచ్చే వాళ్లతో రైలు కేక్కిరిసిపోయాయి.. బాంబే బెంగళూరు నుంచి హైదరాబాద్కు చేరుకునే రైలలో ప్యాసింజర్లు ఎక్కువగా ఉన్నారు.. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపుగా వెళ్తున్న ఒక ట్రైన్ లో కూర్చున్న ప్రయాణికులకు పట్టాల పైన ఒక షాకింగ్ కనబడింది.. రైలు పట్టాలపై ఏకంగా ఒక కారు అత్యంత వేగంగా వెళుతూ కనపడింది.. దీంతో ప్రయాణికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ..ఆ తర్వాత పోలీసులు సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ కి కాల్ చేసి సమాచారం ఇచ్చారు.. శంకరపల్లి నుంచి హైదరాబాద్ వైపుగా వేగంగా పట్టాల పైన ఒక ట్రైన్ కారు వస్తుందని తెలిపారు.. సోషల్ మీడియా ఫేమస్ కావడం కోసం కొందరు ఎంత వరకైనా వెళ్లడానికి రెడీగా ఉన్నారు. అందుకు తాజాగా జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా చెప్పుకోవాలి.. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలోని రైల్వే ట్రాక్పై ఓ యువతి కారు నడిపిన వ్యవహారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అయితే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఆమె చేసిన పనికి రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Yuvraj Singh: యువరాజ్ 'యువి' పేరు వాడుతున్నారా..? ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..
- Jasprit Bumrah: బుమ్రాకు ఏమైంది..? ఎందుకు సిరీస్ నుంచి దూరమయ్యాడు..? కారణం ఇదే..
- Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
అయితే శంకర్ పల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్పై ఓ యువతి తన కారుతో వెళ్లిన వీడియో షూట్ చేసింది. ఇక, ఆమె స్నేహితుడు వీడియో తీస్తుండగా, సదరు యువతి కారును నెమ్మదిగా రైలు పట్టాలపై నడిపిస్తూ స్టైల్గా రీల్స్ తీసుకుంది. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక, ఈ వాహనం రైల్వే ట్రాక్పై ఉండటంతో ఆ మార్గంలో రావాల్సిన రైళ్లు ఆలస్యం అయ్యాయి. ఒకటి కాదు రెండు కాదు – పలుసార్లు అనేక చోట్ల రైలు నెమ్మదిగా రావడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు అధికారులు తెలిపారు. దీంతో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు రైల్వే ట్రాక్ మీదకి ఏకంగా ఒక కారు రావడానికి సీరియస్గా తీసుకున్నారు వెంటనే బెంగళూరు హైదరాబాద్ బాంబే సర్వీస్ లను లిపివేశారు హైదరాబాద్ నుంచి బెంగళూరు బాంబే వెళ్తున్న ట్రైన్లు అన్నిటిని సస్పెండ్ చేశారు.. అయితే రైల్వే ట్రాక్ మీదికి కారు ఎలా వచ్చింది అనే దాని మీద అధికారులు వెంటనే విచారణ ప్రారంభించారు.. కొడంగల్ గేటు వద్ద ఈ కారు రైల్వే ట్రాక్ మీదికి వచ్చినట్లు అధికారులు తేల్చారు.. అంతేకాకుండా కారు నెంబర్ లేని కియా మోడల్ అత్యంత వేగంగా పట్టాలపై దూసుకు వెళుతున్నట్లు అధికారులు తెలుసుకున్నారు . దీంతో పోలీసులు అధికారులను అప్రమత్తం చేశారు రైలు పట్టాలపై వేగంగా పరుగులు పెడుతున్న కారుని స్థానికులు చూశారు.. పట్టాలకు ట్రైన్ కి పట్టాల మీద ఎదురు వెళ్తున్న కారుని ఆపేందుకు స్థానికులు ప్రయత్నం చేశారు ..శంకర్ పల్లి వరకు వచ్చిన తర్వాత ఈ కారు మరింత వేగం పోతూ డి. శంకర్ పల్లి దాటగానే కొద్దిగా స్లో కావడంతోటి స్థానికులు వెంటనే కారు మీద రాళ్ల దాడి కురిపించారు..
READ MORE: SCO Summit: “పహల్గామ్ వద్దు, బలూచిస్తాన్ ముద్దు”.. ఎస్సీఓ లో చైనా, పాక్ కుట్ర..
దీంతో కారు వెంటనే ఆగిపోయింది.. పట్టాల పైన ఆగిపోయి ఉన్న కార్ దగ్గరికి స్థానికులు చేరుకున్నారు.. అందులో ఒక లేడీ కూర్చొని ఉంది..ఆమెను బయటికి రమ్మని స్థానికులు కోరారు.. అయినప్పటికీ తాను బయటికి రాకుండా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది.. మరోవైపు స్థానికుల పైన లేడీ దాడికి తెగబడింది దీంతో స్థానికులు కారు అద్దాలు ధ్వంసం చేసి కార్ని ధ్వంసం చేసి మహిళని బయటకి తీసుకువచ్చారు ..ఆ తర్వాత మహిళ చేతులు కాళ్లు కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.. పట్టాల పైన నిలిచిపోయిన కారుని వెంటనే స్థానికులు కిందికి తీసుకొని వచ్చారు.. సంఘటన స్థలానికి వచ్చిన పోలీస్ అధికారులు ఆడులోకి తీసుకున్నారు.. తనపైనే స్థానికులు దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించాలని పోలీసులకు సదర్ లేడీ ఫిర్యాదు చేసింది.. గుజరాత్కు చెందిన సోనీ హైదరాబాదులోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి సోనిని ఉద్యోగం తీసేసారు..
READ MORE: Air India crash: ఎయిర్ ఇండియా ప్రమాదంలో కీలక పరిణామం.. బ్లాక్బాక్స్ డేటా డౌన్లోడ్..
అటు తర్వాత సోనీ ఆర్మీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.. కుటుంబ సభ్యులు మాత్రం సోనీ ఆర్మీలో ఆర్మీలో చేరేందుకు నిరాకరించగలరు.. కుటుంబ సభ్యులు ఆర్మీలో వెళ్లేందుకు నిరాకరించడం ఉద్యోగం పోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి సోనీ గురించి ..దీంతో తాను ఉంటున్న ప్లాట్ నుంచి నేరుగా నర్సింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది ..తాను పెంచుకుంటున్న కుక్కను అక్కడ వదిలిపెట్టింది ..ఆ తర్వాత కార్ తీసుకొని నేరుగా కొడంగల్ గేట్ వద్దకు చేరుకుంది ..గేట్ నుంచి నేరుగా పట్టాల మీదకి కారణం ఫోన్ ఇచ్చింది ట్రైన్ కు ఎదురవెల్లి ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేసింది.. దాడి చేసి ఆమెను రక్షించి కిందికి తీసుకొచ్చారు.. ఆ తర్వాత చేవెళ్ల పోలీసులకు అప్పగిస్తే సదరు లేడికి మానసిక స్థితి సరిగా లేదని చెప్పారు.. రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు ఉందా లేకుంటే తెలిసి తెలియని తనంతో చేసిందా లేకుండా మానసిక స్థితి బాగాలేకనే పట్టాల మీదకి వచ్చిందా అనే కోణంలో విజాహిస్తున్నామని అధికారులు వెల్లడించారు..
తాజావార్తలు
-
Elon Musk : నెలలోనే రూ.57 లక్షల కోట్ల ఆవిరి.. ఎలాన్ మస్క్కు భారీ దెబ్బ.!
-
Yuvraj Singh: యువరాజ్ ‘యువి’ పేరు వాడుతున్నారా..? ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు..
-
Yellamma First Look: సంగీత దర్శకుడు కాదు.. ఇప్పుడు హీరో డీఎస్పీ!.. అదిరిపోయిన ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్
-
King100: నాగ్ 100వ సినిమాకు డీఎస్పీ ఎంట్రీ.. అంచనాలు పెంచిన క్రేజీ కాంబో
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
ట్రెండింగ్
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?