ప్రజాస్వామ్య బీజాలు మన సంస్కృతిలో ఎప్పుటినుంచో ఉన్నాయని.. ప్రజాస్వామ్యం బలహీనపడటానికి అంతర్గత శత్రువులే కారణమని మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ పేర్కొన్నారు. విజయవాడలో సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు.
విజయవాడలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో నిఫా వైరస్ పేషెంట్లకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు జీజీహెచ్ అధికారులు. కోవిడ్ కంట్రోల్ కు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అంతకంటే పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. 21 మందికి వెంటనే ట్రీట్మెంట్ అందించేలా ఏర్పాటు చేశారు. ఆక్సిజన్, మానిరింగ్ సిస్టం, 24 గంటలు ప్రత్యేక డాక్టర్లు, ఒక సూపర్వైజర్, ప్రత్యేక పరీక్షా విధానాల సదుపాయాలు కల్పించారు.