విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను భగవంత్ కేసరి చిత్ర బృందం శనివారం దర్శించుకుంది. హీరోయిన్ శ్రీలీలా ఆమె తల్లి, చిత్ర దర్శకుడు అనిల్ రావీపూడితో పాటు పలువురు చిత్ర బృంద సభ్యులు అమ్మవారి దర్శనానికి విచ్చేయగా, ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.. అనంతరం ఆలయ అధికారులు వారిని సత్కరించి అన్న, ప్రసాదాలను అందజేశారు.. శ్రీలీలా తో సెల్ఫీలు…
విజయవాడ ఇంద్రకీలాద్రికి పైకి భవానీలు పోటెత్తారు. జై దుర్గా జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మార్మోగిపోతుంది. ఇవాళ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గదేవీ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఓం టర్నింగ్ నుంచి అమ్మవారి సన్నిధానం వరకు క్యూలైన్ లలో భక్తులు వేచి ఉన్నారు.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిచ్చింది. కృష్ణానదిలో తెప్పోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. మరికాసేపట్లో శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులు కృష్ణానదిలో విహరించనున్నారు.
తెలుగు జాతి ఆస్తి.. దేశం ప్రపంచం నలుమూలల.. తెలిసే విధంగా మన పిల్లల్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు.. చంద్రబాబు నాయుడు మీద దొంగ కేసులను, సంబంధం లేనటువంటి కేసులను బనాయించి 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారు అంటూ అచ్చెన్నాయుడు ఆరోపించారు.
Dussehra Special Trains: దసరా పండగ నేపథ్యంలో జనాలు సొంతూళ్ల బాట పట్టారు. నేడు బతుకమ్మ, రేపు దసరా నేపథ్యంలో బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ అన్ని కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ మీదగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు-సంత్రాగచి రైలు (06285/06286) అక్టోబర్ 21న బెంగళూరులో తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.10 గంటలకు సంత్రాగచి చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో 23న…
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కృష్ణలంక కార్పోరేటర్ రామిరెడ్డికి మంత్రి కొట్టు సత్యనారాయణ క్లాస్ పీకారు. VVIP ఎంట్రీ గేట్ నుంచి దర్శనానికి పోలీసులు, రెవిన్యూ అధికారులు ఇష్టానుసారంగా తీసుకెళుతున్నారని మంత్రి దృష్టికి భక్తులు తీసుకొచ్చారు.