విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సీనియర్ హీరో అయినప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్ నటించిన మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వెంకటేష్ హీరోగా నటించిన మూడు విభిన్న జోనర్ చిత్రాలు నారప్ప, దృశ్యం-2, ఎఫ్-3 చిత్రాల విడుదల గురించి ఆయన అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రశంసలు పొందిన మలయాళ థ్రిల్లర్ “దృశ్యం-2” తెలుగు రీమేక్ అదే టైటిల్ తో తెలుగులో రూపొందుతోంది.…
కొన్ని కాంబినేషన్స్ జనాన్ని భలేగా అలరించి, విజయాలనూ సొంతం చేసుకుంటాయి. కానీ, ఎందుకనో రిపీట్ కావు. అదే విచిత్రంగా ఉంటుంది. చిత్రసీమలో ఇలాంటి చిత్రవిచిత్రాలు సాధారణమే అనుకోవాలి. హీరో వెంకటేశ్ తో దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ అలాంటి చిత్రమైన పరిస్థితినే చూశారు. నిజానికి వెంకటేశ్ కుటుంబ సభ్యులద్వారానే ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకునిగా మారారు. అయితే వెంకటేశ్ సొంత సంస్థ అయిన సురేశ్ ప్రొడక్షన్స్ లో ఆయనను డైరెక్ట్ చేయలేకపోయానని ఇ.వి.వి. సత్యనారాయణ అంటూ ఉండేవారు. వెంకటేశ్, ఇ.వి.వి.…
జూనియర్ ఎన్టీఆర్ 38వ పుట్టినరోజు ఈ రోజు (మే 20). అయితే ఇటీవలే ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఒంటరిగా ఉన్నాడు. కోవిడ్ -19 మహమ్మారి సందర్భంగా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవద్దని జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులను కోరిన విషయం తెలిసిందే. అయితే తారక్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’…
దేశంలో కరోనా మరణాలు ఎక్కువ అవుతుండటంతో జనాల్లో భయం పెరిగిపోతోంది. ఏ టైమ్ లో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందేమోననే నెగిటివ్ ఆలోచనలు కూడా ఎక్కువ అవుతున్నాయి. దీనిపై సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ పలు సూచనలు చేశారు. ‘మనం అందరం మన దేశానికి మనం సేవ చేసే టైం వచ్చింది. మనం ఏమీ చేయలేమని అనుకోవద్దు. రోజురోజుకూ భయం కాదు.. బాధ్యత పెరగాలి. అందరూ ఒకరికి…
కరోనా సెకండ్ వేవ్ తో టాలీవుడ్ కుదేలయింది. ఎక్కడ షూటింగ్ లు అక్కడే ఆగిపోవడంతో పాటు పూర్తయిన సినిమాల రిలీజ్ లు ఎప్పుడనే క్లారిటీ కూడా లేకుండా పోయింది. మళ్ళీ పరిస్థితి చక్కబడిన తర్వాతే సినిమాల విడుదల అంటున్నారు. అలా అందరికీ అనువైన సీజన్ గా దసరా కనిపిస్తోంది. ఈ ఏడాది దసరాకి పలువురు బడా స్టార్స్ సినిమాలు సందడి చేస్తాయంటున్నారు. ప్రత్యేకించి చిరంజీవి ‘ఆచార్య’, బాలకృష్ణ ‘అఖండ’, వెంకటేశ్ ‘నారప్ప’ సినిమాలు దసరాకే వస్తాయని టాక్.…
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. నారప్ప, దృశ్యం-2, ఎఫ్-3 చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. వాటి తరువాత వెంకటేష్ నటించబోయే చిత్రం ఇదేనంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే గత కొంతకాలం క్రితం వెంకటేష్ దగ్గుబాటి, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మూవీ రాబోతోందంటూ ఊహాగానాలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఇటీవలే వెంకీ మామ 75వ సినిమాకు సంబంధించి చర్చలు జరిగాయట. త్రివిక్రమ్ దర్శకత్వంలో…
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం రీమేక్ లపై ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇంతకుముందు ‘దృశ్యం’ మలయాళ చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్ తో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మరో రెండు రీమేక్ లలో నటిస్తున్నాడు. రీమేక్ చిత్రాలైన దృశ్యం-2, నారప్ప సినిమాల షూటింగ్ ను ఇటీవలే కంప్లీట్ చేశాడు వెంకటేష్. ఇప్పుడు వెంకటేష్ హీరోగా మూడవ రీమేక్ కోసం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం మలయాళ…
ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సీనియర్ హీరో నటించబోతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల రూపొందించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు శేఖర్ కమ్ముల తన తదుపరి ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో వెంకటేష్ నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. దీంతో…
వెంకీ, వరుణ్ తో అనిల్ రావిపూడి తీసిన ‘ఎఫ్2’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసి ఘన విజయం సాధించింది. ఇక ఆ సినిమాకు సంక్రాంతి పండగ కూడా కలసి వచ్చింది. నిజానికి అనిల్ రావిపూడి నటించిన సినిమాలు సంక్రాంతికే వచ్చి వరుసగా విజయాలు సాధించాయి. దాంతో సంక్రాంతి అనిల్ కి సెంటిమెంట్ గా కూడా మారింది. గత సంవత్సరం మహేశ్ తో అనిల్ తీసిన ‘సరిలేరు నీకెవ్వరు’ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.…
విక్టరీ వెంకటేష్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం 2. ఈ సినిమాలో వెంకటేష్ సరసన సీనియర్ హీరోయిన్ మీనా నటిస్తోంది. దృశ్యం సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన తన షూటింగ్ పార్ట్ ను వెంకటేష్ పూర్తి చేశాడు. ఇదిలావుంటే, కరోనా మహమ్మారి కారణంగా దృశ్యం 2 మలయాళ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశారు. దీంతో ఇప్పుడు తెలుగు…