‘దృశ్యం-2’ షూటింగ్ పూర్తి చేసిన వెంకీ మామ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్లాక్ బస్టర్ మలయాళ రీమేక్ ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్ గా ‘దృశ్యం-2’ తెరకెక్కుతోంది. మొదటి పార్ట్ లో నటించిన నటీనటులే ఈ సీక్వెల్ లోనూ నటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, హీరోయిన్ మీనా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న ‘దృశ్యం-2’ నుంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేశారు వెంకటేష్. చిత్రంలో వెంకటేష్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి అయ్యింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ ఓ పిక్ ను విడుదల చేశారు. కాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా మలయాళంలో తెరకెక్కిన ‘దృశ్యం’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఈ చిత్రాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో రూపొందించారు. అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ‘దృశ్యం, దృశ్యం-2’ మలయాళంలో మోహన్ లాల్ నటించగా తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేశారు. ఇక తెలుగులో ‘దృశ్యం’ చిత్రానికి ప్రముఖ నటి శ్రీప్రియ దర్శకత్వం వహించారు. అయితే ‘దృశ్యం-2’ తెలుగు రీమేక్ కు మాత్రం దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ‘దృశ్యం-2’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read
తాజావార్తలు
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
-
TVK Vijay: గవర్నర్ ఆటంకం.. రేపటి విజయ్ ప్రమాణస్వీకారం రద్దు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!