Home
Uttar Pradesh
Uttar Pradesh News
-
Jaya Prada: జయప్రదపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన యూపీ కోర్ట్..
Jaya Prada: సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయప్రదకు ఉత్తర్ ప్రదేశ్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2019లో లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు మాజీ ఎంపీ జయప్రదపై యూపీ జిల్లాలోని కోర్టు శుక్రవారం నాన్-బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. -
Lizard in Samosa: సమోసాలో బల్లి.. తండ్రీకూతుళ్లకు అస్వస్థత..
Lizard in Samosa: ఇటీవల కాలంలో బయటి ఆహారంతో జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పుడ్ ఫాయిజనింగ్ వల్ల ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో చికెన్ షవర్మా వల్ల ఒకరిద్దరి ప్రాణాలు పోయాయి. రెస్టారెంట్ల, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై అధికారుల నిఘా లేకపోవడం కూడా సమస్య తీవ్రతను పెంచుతోంది. ఆహారంలో బల్లులు, కీలకాలు, ఎలుకలు రావడం పరిపాటిగా మారింది. సామాన్య జనాల ప్రాణాలతో ఫుడ్ మాఫియా ఆటలాడుకుంటోంది. -
Uttar Pradesh: యూపీలో దొంగల దారుణం.. మహిళపై గ్యాంగ్ రేప్, సిగరెట్లతో కాలుస్తూ అఘాయిత్యం..
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం జరిగింది. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మంగళవారం రోజు ఓ వ్యాపారి ఇంటిని దోచుకోవడానికి వచ్చిన దొంగలు అతని భార్యను కట్టేసి గ్యాంగ్ రేప్కి పాల్పడటమే కాకుండా సిగరెట్లతో దారుణంగా హింసించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. -
Stray Dogs Attack: ఆరేళ్ల చిన్నారిపై వీధికుక్కల గుంపు దాడి.. బాలుడు మృతి
వీధి కుక్కల దాడికి ఓ చిన్నారి బలైంది. ఉత్తరప్రదేశ్లో ఆరేళ్ల చిన్నారిపై ఓ కుక్కల గుంపు మూకుమ్మడిగా దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద నెలకొంది. రాష్ట్రంలో బరేలీలోని షేర్ఘర్ పట్టణంలోని 5వ వార్డులో చేదలాల్ తన భార్య, పిల్లలతో నివసిస్తున్నాడు. వారికి 6 ఏళ్ల కుమారుడు దక్షు ఉన్నాడు. బుధవారం బాలుడు పిల్లలతో కలిసి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సమీపంలోని పొలంలో ఆడుకోవడానికి వెళ్లాడు. అక్కడ… -
Fire Accident: న్యూఢిల్లీ-దర్భంగా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మంటలు..రైలు నుంచి దూకిన ప్రయాణికులు..
Fire Accident: ఇటీవల కాలంలో భారతీయ రైల్వేలో ప్రమాదాలు కలవరపరుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో రైలు బోగీలు మంటల్లో చిక్కుకోవడం చూస్తు్న్నాం. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ఇటావాలో ఈ రోజు న్యూఢిల్లీ-దర్భంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లోని ఒక బోగీలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. రైలు సరాయ్ భూపత్ స్టేషన్ గుండా వెళ్తున్నప్పుడు స్లీపర్ కోచ్ లో పొగలు రావడాన్ని స్టేషన్ మాస్టర్ గమనించి అప్రమత్తం చేశారు. -
Shaheed Express: పొగ లేకుండానే మోగిన ఫైర్ అలారం.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు.. ఏం జరిగిందంటే..
Shaheed Express: షాహిద్ ఎక్స్ప్రెస్లో కాపేపు ఫైర్ అలారం అలజడి సృష్టించింది. నిప్పూ లేదు, పొగా లేదు.. కానీ ఫైర్ అలారం మోగింది. దీంతో ఆ భోగీలో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఫైర్ అలారం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాక కాసేపు బిక్కుబిక్కుమంటూ గడిపారు. దీంతో రైల్వే సిబ్బందిని అలర్ట్ చేయడం అసలు విషయం బయటపడింది. ఇంతకి అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లాలోని గౌరీబజార్ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న షాహిద్ ఎక్స్ప్రెస్లోని… -
Criminal Escape: పోలీసుల కళ్లు గప్పి పరారైన కరడుగట్టిన నేరస్తుడు..
పోలీసుల కళ్లు గప్పి కరడుగట్టిన నేరస్తుడు పరారైన ఘటన యూపీలో చోటుచేసుకుంది. కాన్పూర్లోని లాలా లజ్పత్ రాయ్ హాలెట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేరస్తుడు పోలీసులను నుంచి బయటపడ్డాడు. ఈ క్రూరమైన నేరస్తుడు నకిలీ ఇన్స్పెక్టర్గా నటిస్తూ ప్రజల నుంచి దోపిడీలకు పాల్పడుతున్నడనే నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేశారు. -
UP: రైలు ఇంజిన్లో మృతదేహం.. కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ట్రైన్
ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని సిర్సాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్యాసింజర్ రైలు ఇంజిన్కు వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని చూసి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అంతకుముందే.. రైలు ఇంజన్లో యువకుడి మృతదేహం ఇరుక్కోవడంతో కొన్ని కిలోమీటర్ల మేర అలానే ఈడ్చుకెళ్లింది. ఇంజిన్లో మృతదేహాన్ని చూసిన అక్కడి జనాలు పెద్దగా అరుపులు చేయడంతో అది గమనించిన లోకో పైలట్ రైలును ఆపాడు. దీంతో ఇంజిన్లో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని బయటకు తీశారు. -
Uttar Pradesh: జూదగాళ్ల ఆచూకీ చెప్పాలని రైతును చితకబాదిన పోలీసులు.. చికిత్స పొందుతూ మృతి
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ రైతును పోలీసులు అన్యాయంగా కొట్టి చంపారు. ఈ ఘటనకు పాల్పడ్డ పోలీసులపై మృతుడి కుటుంబీకులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. -
Uttar Pradesh: ఆరుగురు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్.. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీతో సంబంధం..
Uttar Pradesh: గత పదేళ్లుగా దేశంలో ఉగ్రదాడులు తగ్గుముఖం పట్టాయి. కేంద్రంలోని ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢంగా వ్యవహరిస్తోంది. అయితే కొన్ని చోట్ల మాత్రం కొంత మంది మళ్లీ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురిని అరెస్ట్ చేసింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Electric Scooters: విశాలమైన బూట్ స్పేస్.. హెల్మెట్తో పాటు కిరాణా సామాను కూడా పట్టే టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
-
Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
-
Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
ట్రెండింగ్
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!