Mass Killing: యూపీలో దారుణం.. భార్య, పిల్లల్ని చంపేసి వైద్యుడి ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mass Killing: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఓ వైద్యుడు తన భార్యను, ఇద్దరు పిల్లల్ని హత్య చేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఒక్కసారిగా రాయ్బరేలీ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సిటీలోని రైల్వే కాలనీలో ఈ ఘటన జరిగింది. డాక్టర్ అరుణ్ కుమార్ రైల్వేలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. కంటి నిపుణుడు అయిన అరుణ్ కుమార్ రాయ్ బరేలీలోని మెడ్రన్ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు.
అయితే అతను గత కొంతకాలంగా డిప్రెషన్తో బాధపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని స్వస్థలం మీర్జాపూర్, ఉద్యోగరీత్యా రాయ్బరేలీలో ఉంటున్నారు. చివరిసారిగా ఆదివారం రోజున కనిపించాడు. రెండు రోజులుగా విధులకు రాకపోవడంతో అతని సహచర ఉద్యోగులు అతని ఇంటికి వెళ్ళారు. అయితే డోర్ బెల్ ఎంత కొట్టినా బయటకు రాకపోవడంతో తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లడంతో వారంతా షాక్కి గురయ్యారు.
Also Read
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
భార్య అర్చన, కుమార్తె ఆదివా(12), కుమారుడు ఆరవ్ (4) మృతదేహాలు కనిపించాయి. ఘటనాస్థలంలో సుత్తి, రక్తపు మరకలు, ఇంజెక్షన్లు లభించాయి. ఇదంతా గమనించి పోలీసులకు సమాచారం అందించారు. భార్యా పిల్లల్ని సుత్తితో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. డాక్టర్ ముందుగా వీరిని చంపేసి ఆ తర్వాత మణికట్టు కోసుకున్నాడు, అది విఫలం కావడంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం తర్వాత మరిన్ని వివరాలను వెల్లడిస్తామని రాయ్బరేలీ ఎస్పీ అలోక్ ప్రియదర్శి తెలిపారు.
డాక్టర్ తన రోగులతో, ఇతరులతో మంచిగానే ప్రవర్తించే వాడని, కుటుంబ సమస్యల కారణంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు తెలిపారు. పోలీసులు సహోద్యోగుల్ని, ఇతర స్థానికులను విచారించగా.. ఇటీవల డాక్టర్ అరుణ్ కుమార్ దుందుడుకుగా వ్యవహరిస్తున్నారని, అన్నింటికి కోపం తెచ్చుకుంటున్నాడని తెలిసింది.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!