Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 8 Dead In Lakhimpur Kheri Up Dgp Appeals For Peace Vows Strict Action

యూపీలో రైతుల ఆందోళన హింసాత్మకం..ఎనిమిది మంది మృతి

Published Date :October 4, 2021 , 8:04 am
By Lakshmi Narayana
యూపీలో రైతుల ఆందోళన హింసాత్మకం..ఎనిమిది మంది మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఉత్తరప్రదేశ్‌లో హింస చెలరేగింది. లఖీంపూర్‌ ఖేరీలో జరిగిన హింసాకాండలో 8 మంది రైతులు మృతిచెందారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై మంత్రుల కాన్వాయ్‌ దూసుకెళ్లడంతో… ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కాన్వాయ్‌ ఢీకొని నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోగా.. అల్లర్లలో మరో నలుగురు మృతి చెందడం విషాదంగా మారింది. ఉత్తరప్రదేశ్‌ లఖీమ్‌పూర్‌ ఖేరీ జిల్లా టికునియాలో ఓ ప్రభుత్వ కార్యక్రమానికి కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా, డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య హాజరయ్యారు. వీరి పర్యటనను నిరసిస్తూ ఉదయం నుంచి రైతులు నల్ల జెండాలు చూపిస్తూ ఆందోళన చేపట్టారు.

సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అదే సమయంలో కేంద్రమంత్రి, డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న కాన్వాయ్‌.. రోడ్డు పక్కనే ఆందోళన చేస్తున్న రైతులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రైతులు వాహనాలపై దాడి చేశారు. వాటికి నిప్పుపెట్టారు. దీంతో ఆ ప్రాంతంమంతా రణరంగంగా మారింది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

కారుతో రైతులను ఢీకొట్టిన ఘటనకు కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రే కారణంగా తెలుస్తోంది. లఖీమ్‌పూర్‌లో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. రైతులపై కాన్వాయ్‌ దూసుకెళ్లడాన్ని సంయుక్త కిసాన్‌ మోర్చా నేత రాకేశ్‌ టికాయత్‌ ఖండించారు. దీనికి యూపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రైతుల రాళ్ల దాడితో కారు బోల్తా పడిందని.. కారు కింద పడి ఇద్దరు చనిపోయారని చెబుతున్నారు కేంద్రమంత్రి అజయ్ మిశ్రా. ముగ్గురు బీజేపీ కార్యకర్తలతో పాటు తన డ్రైవర్‌ను కొట్టి చంపారని.. ఘటనా స్థలంలో తన కుమారుడు లేడని అన్నారు. మరోవైపు దీనితో తనకు సబంధం లేదని వాదిస్తున్నారు ఆశిష్‌ మిశ్రా. మరోవైపు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌. రైతుల మృతి దురదృష్టకరమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు లఖీంపూర్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని లక్నోలో హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు. దీంతో ఈ ఘటనకు రాజకీయ రంగు పులుముకుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • crime
  • Farmers
  • Uttar Pradesh

తాజావార్తలు

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

  • Delimitation: లోక్‌సభలో 850 సీట్లు.. పార్లమెంట్ స్వరూపాన్ని ఎలా మార్చబోతోంది? దక్షిణాదిలో నిరసనలు ఎందుకు?

  • New Aadhaar Update: ఆధార్‌ అప్‌డేట్.. సెంటర్‌కు వెళ్లకుండానే ఫోన్ నంబర్ మార్చుకోండిలా!

  • CRPF Constable Recruitment 2026: గెట్ రెడీ.. 9175 కానిస్టేబుల్ పోస్టులు.. అర్హులు వీరే

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions