ఉత్తరప్రదేశ్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సెమిఫైనల్ గా భావిస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీలు తిరిగి తమ ప్రభుత్వాలను కాపాడుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా ఒక రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడ అధికారాన్ని కాపాడుకోవడం ఆపార్టీకి కత్తి మీద సాములా మారింది.
ఉత్తరప్రదేశ్ లో గతంలో జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవానే కొనసాగింది. అత్యధిక పార్లమెంట్ స్థానాలతోపాటు అసెంబ్లీ సీట్లను దక్కించుకొని యూపీలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తొలినాళ్లలో ఆయన పాలనపై ప్రజల్లో సానుకూల పవనాలు వీచాయి. అయితే కొంతకాలంగా యూపీ సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. యూపీలో జరుగుతున్న వరుస సంఘటనలు బీజేపీ సర్కారు ప్రతిష్టను మసకబారుస్తున్నాయి.
Also Read
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
- love Or Attraction: లవ్లో పడిపోయారా..? అది ఆకర్షణ..? లేక ప్రేమేనా..?
- Valentine's Day: వాలెంటైన్ ఎవరు..? ప్రేమికుల దినోత్సవం ఎలా ప్రారంభమైంది..?
ఈక్రమంలోనే బీజేపీ అధిష్టానం సీఎం యోగీని ఢిల్లీకి పిలిపించుకొని మరీ మాట్లాడింది. ఆయన మంత్రివర్గంలో మార్పులు చేయించింది. కేంద్ర మంత్రివర్గంలోనూ ఉత్తరప్రదేశ్ కు ఎక్కువ స్థానాలను కేటాయించింది. దీంతో పరిస్థితులన్నీ చక్కబడుతాయని అధిష్టానం భావించింది. అయితే ఇటీవల యూపీలో వరుసగా చోటు చేసుకుంటున్న అనుహ్య సంఘటనలు సర్కారును ఇరుకున పెడుతున్నాయి. దీంతో ప్రతిపక్షాలు క్రమంగా యూపీలో పుంజుకుంటున్నాయి.
గతంలో దళితులు, మహిళలపై జరిగిన అమానుష ఘటనలు యోగీ సర్కారు మెడకు చుట్టుకున్నాయి. వీటి నుంచి బయటపడేందుకే ఆయన తంటాలు పడుతుండగా లిఖింపూర్ ఘటన చోటుచేసుకుంది. ఓ కేంద్ర మాజీ మంత్రి కుమారుడు రైతులపై కారు ఎక్కించడంతో నలుగురు మృతిచెందారు. ఈ సంఘటన సంచలనం మారడంతో ప్రతిపక్షాలు రంగంలోకి దిగి బాధితుల పక్షాన పోరాడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ, సమాజ్ వాది పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నంచేసి విజయవంతం అయ్యారు.
రైతులపై జరిగిన దౌర్జన్యాన్ని ఖండించాల్సిన సీఎం యోగీ ఆదిత్య నాథ్ మిన్నకుండిపోయాడు. సకాలంలో స్పందించపోవడంతో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. విపక్షాలు ఈ సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకొని సర్కారును ఇరుకున పెడుతూ పైచేయి సాధిస్తున్నాయి. దీంతో యూపీలో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కాగా ప్రతిపక్షాలు ఈసారి ఒంటరిగా బరిలో దిగుతున్నాయి. ఓటు బ్యాంకు చీలి మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆపార్టీ నేతలు భావిస్తున్నారు. ఏదిఏమైనా లిఖింపూర్ సంఘటనతో యోగీ సర్కార్ ఇమేజ్ డ్యామేజ్ అయినట్లే కన్పిస్తుంది. ఈ వ్యతిరేకత నుంచి ఆయన ఎలా బయటపడుతారో వేచిచూడాల్సిందే..
తాజావార్తలు
-
Abhishek Banerjee: రాళ్లు విసురుతున్నారు.. కోడిగుడ్లతో కొడుతున్నారు..మమత మేనల్లుడుపై ఎందుకింత కసి?
-
Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
-
Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
-
CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
-
Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!