అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్-ఎరికా కిర్క్ కౌగిలింత వీడియో సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా చక్కర్లు కొట్టింది. అంతేకాకుండా పెను దుమారం కూడా రేపింది.
JD Vance - Usha: అమెరికా ఉపాధ్యక్షడు జేడీ వాన్స్, తన భార్య ఉషా గురించి, ఆమె హిందూ మతం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జేడీ వాన్స్ వ్యాఖ్యలను ఇండియన్ అమెరికన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జేడీ వాన్స్-ఉషా చిలుకూరి ప్రేమ ఆసక్తికరం అంశంగా మారిన సంగతి తెలిసిందే.
JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ తన భార్య ఉషా వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య ఉష ఏదో ఒక రోజు తనలాగే క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్లో హత్యకు గురైన రాజకీయ కార్యకర్త చార్లీ కిర్క్ జ్ఞాపకార్థం బుధవారం రాత్రి మిస్సిస్సిప్పి విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో జె.డి. వాన్స్ మాట్లాడారు. పరస్పర గౌరవం, అవగాహనతో మతాంతర వివాహం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆసక్తికరంగా, గతంలో దేవుడిని నమ్మని…
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉషా వాన్స్ దంపతులు.. పిల్లలతో కలిసి ఏప్రిల్లో భారత్లో పర్యటించారు. దేశంలో అనేక ప్రాంతాలను వీక్షించారు. ఇక పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ప్రత్యేక విందు కూడా ఇచ్చారు. నాలుగు రోజుల పాటు వివిధ ప్రాంతాలను సందర్శించి సంతోషంగా వెళ్లారు.
అగ్ర రాజ్యం అమెరికా రెండవ మహిళ ఉషా వాన్స్ భారత్కు చేరుకున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భార్యగా ఉషా ఢిల్లీలో అడుగుపెట్టారు. ఉషా చిలుకూరి పూర్వీకుల స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది. సమాచారం ప్రకారం.. జేడీ వాన్స్ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 24 వరకు ఇటలీతో పాటు భారతదేశాన్ని సందర్శిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు రెండు దేశాల నాయకులతో ఉమ్మడి ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతలను చర్చిస్తారని ఉపాధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 21-24 మధ్య భారత్ సందర్శించవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఉపాధ్యక్షుడి భార్య ఉషా వాన్స్ కూడా ఆయన వెంట ఉండనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ, ఇతర సీనియర్ అధికారులతో సమావేశాలు ఉంటాయని, అధికారిక కార్యక్రమాలతో పాటు జైపూర్, ఆగ్రాలను సందర్శించవచ్చని తెలుస్తోంది.