జీ7 దేశాలకు చైనా పెద్ద వార్నింగ్ ఇచ్చింది. కరోనా వైరస్ చైనా నుంచి వచ్చిందని, ఊహాన్లోని ల్యాబ్ నుంచి ఈ మహమ్మారి బయటకు వచ్చిందని అమెరికా గతంలో ఆరోపణలు చేసింది. అప్పట్లో ట్రంప్ చేసిన ఆరోపణలను ప్రపంచం పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు ట్రంప్ చేసిన ఆరోపణలకు బలం చేరూరుతున్నది. ప్రస్తుత అధ్యక్షకుడు జో బైడెన్ కూడా చైనాపై ఉక్కుపాదం మోపేందుకు జీ 7 సదస్సును వేదికగా చేసుకున్నారు. భవిష్యత్తులో చైనా నుంచి ఎదురయ్యే ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు…
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం స్మార్ట్ వాచ్ రంగంలోకి దిగబోతున్నది. ఇప్పటి వరకు యాపిల్, గూగుల్ సంస్థలు స్మార్ట్ వాచ్ యుగాన్ని నడిపిస్తున్నాయి. ఇప్పుడు ఫేస్బుక్ కూడా రంగంలోకి దిగుతుండటంతో త్రిముఖపోటీ ఉండే అవకాశం ఉన్నది. ఇతర స్మార్ట్ వాచ్ మాదిరిగా ఉన్నప్పటికీ, ఇందులో అదనంగా మరికోన్ని ఫీచర్లు ఉండబోతున్నాయి. ఈ వాచ్లో కెమెరా ఉంటుంది. ఈ కెమెరా సహాయంతో వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా, వెనుక 1080 పిక్సల్ కెమేరా ఉంటుంది. దీని సహాయంతో వీడియోలను…
కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న భారత్ను ఆదుకోవడానికి అమెరికా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియాకు 100 మిలియన్ డాలర్ల సహాయం ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన కోవాక్స్ లో అమెరికా కుడా భాగస్వామిగా ఉన్నది. కొవాక్స్ కు అమెరికా 8 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందివ్వబోతున్నది. ఇందులో నుంచి భారత్కు అందాల్సిన వ్యాక్సిన్ వాటాను అందిస్తామని అమెరికా ప్రకటించింది. భారత్ వాటా కింద 80 మిలియన్ వాక్సిన్ డోసులు అందనున్నాయి,…
ప్రపంచాన్ని కరోనా ఎంతటా ఇబ్బందులకు గురి చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా మాస్క్ ధరించాలి, రెండోది వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అమెరికాలో ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్సిన్ను అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ జరుగుతుండటంతో ఆ దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. కానీ, కరోనాకు భయపడి ఇంకా ప్రజలు మాస్క్ ధరిస్తూనే ఉన్నారు. దీంతో క్యాలిఫోర్నియాకు చెందిన ఫిడిల్ హెడ్ కేఫ్…
చైనా దేశంపై అమెరికా మరోమారు ఉక్కుపాదం మోపింది. అమెరికా ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం కావడానికి చైనా వైరస్ కారణమని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించడంతోపాటు, 31 చైనా కంపెనీలపై నిషేదం విధించారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత, చైనాతో సత్సంబందాలు కొనసాగుతాయని అనుకున్నారు. అ దిశగానే బైడెన్ అడుగులు వేసినా, తాజా పరిణామాలతో మరోసారి చైనాపై బైడెన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. చైనాకు చెందిన 28 కంపెనీలపై నిషేదం విధించింది.…
ట్రంప్ ఒటమికి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఒకకారణమైతే, ప్రధాన కారణం మాత్రం కరోనా మహమ్మారినే అని చేప్పాలి. కరోనాను కంట్రోల్ చేయడానికి సరైన నిర్ణయాలు తీసుకోలేదని అమెరికా ప్రజలు విమర్శలు చేశారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థ గురించి ఆలోచించిన ట్రంప్, కరోనా కట్టడిలో విఫలం అయ్యారని విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ట్రంప్ చైనాపై అనేకమార్లు విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ చైనా నుంచే అమెరికాకు వచ్చిందని, ప్రపంచం మొత్తం కరోనాతో అతలాకుతలం కావడానికి చైనానే…
కరోనా కేసులు ప్రపంచాన్ని భయపెడుతున్న సంగతి తెలిసిందే. కరోనాకు కారణమైన సార్స్ కోవ్ 2 వైరస్ అనేక మ్యూటెంట్లుగా మార్పులు చెంది ప్రజల ప్రాణాలు హరింస్తోంది. కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే, సార్స్ కోవ్ 2 వైరస్లో ఉత్పరివర్తనాలు వేగంగా మార్పులు జరుగుతుండటంతో అన్నిరకాల వేరియంట్లను తట్టుకొని నిలబడటం కోసం మెడిసిన్ను రెడీ చేస్తున్నట్టు అమెరికాలోని పెన్సిల్వేనియా శాస్త్రవేత్తలు పేర్కోన్నారు. కరోనాను కట్టడి చేయడానికి యాంటివైరల్ను అభివృద్ది చేయడం అత్యవసరంగా…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. 2019 డిసెంబర్లో చైనాలో మొదటగా ఈ వైరస్ను గుర్తించారు. ఆ తరువాత ఈ వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించింది. అయితే, ఈ వైరస్ మూలాలను ఇప్పటి వరకు గుర్తించలేదు. కరోనా వైరస్ మూలాలపై తనకు మూడు నెలల్లో నివేదక అందజేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూఎస్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీని ఆదేశించారు. చైనాలో మొదట కనిపించిన ఈ వైరస్ జంతువుల నుంచి వచ్చిందా లేదంటే ప్రయోగశాలలో ప్రమాదం…
కరోనా దెబ్బకు అమెరికా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యధిక కేసులు, మరణాలు నమోదైన దేశంగా అమెరికా మొదటిస్థానంలో ఉంది. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఆ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. మొత్తం 50 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 25 రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా వ్యాక్సిన్ పూర్తిచేసినట్టు యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొన్నది. తాజా డేటా…
కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు యూఎస్ మూడు రకాల వ్యాక్సిన్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. 35 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికాలో దాదాపుగా 25 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. ఇందులో 12 కోట్ల మందికి రెండు డోసులు అందించగా, 16 కోట్ల మందికి కనీసం మొదటి డోసును అందించారు. అయితే, ఏప్రిల్ 1 తర్వాత యూఎస్ లో వ్యాక్సిన్ తీసుకునేవారి సంఖ్య క్రమంగా…