బైక్పై వెళ్లే సమయంలో హెల్మెట్ను తప్పనిసరిగా ధరించాలి. లేదంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ ప్రాణాలను రక్షిస్తుంది. ఖరీదైన హెల్మెట్ అంటే కనీసం 10వేల వరకు ఉంటుంది. కానీ, ఈ హెల్మెట్ ధర మాత్రం ఏకంగా రూ.35 లక్షలపైమాటే. ఎందుకు అంత ఖరీదు… ఆ హెల్మెట్ స్పెషాలిటి ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ హెల్మెట్లో సెన్సార్లు ఉంటాయి. ఇవి మీ మెదడును చదివేస్తాయి. Read: వరంగల్ ఐటి పార్కు :…
ప్రపంచంలో అమెరికా, రష్యా రెండు బలమైన దేశాలు. ఈ రెండు దేశాల మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మద్య సంబంధాలు పెద్దగా లేవని చెప్పుకొవచ్చు. అయితే, రెండు దేశాల మద్య ఉన్న దూరాన్న తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నడుం బిగించారు. జెనీవాలో జరుగుతున్న నాటో దేశాల శిఖరాగ్రదేశాల సదస్సులో రష్యా అధ్యక్షుడు కూడా పాల్గోన్నారు. అమెరికా, రష్యా దేశాల అధినేతలు భేటీ ఆయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న…
ఏప్పుడో ఆరు దశాబ్ధాల క్రితం పోగొట్టుకున్న ఉంగరం తిరిగి తనను వెతుక్కుంటూ వస్తే ఎలా ఉంటుంది. అద్భతంగా ఉంటుంది కదా. అమెరికాలోని బ్రోక్ఫోర్డ్ కు చెందున మేరీజో కు లాక్కువన్నా నగరంలో పూర్వికులకు చెందిన ఓ ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు సర్ధుతుండగా, ఓ ఉంగరం దొరికింది. పాత కాలానికి చెందిన ఉంగరం కావడంతో ఆ యువతి అది ఏవరిదో తెలుసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఉంగరాన్ని బట్టి అది తన తండ్రిది కాదని తెలుసుకున్న తరువాత, తన…
ఇంటికి తాళాలు వేసి ఉన్న ఇళ్లను సాధారణంగా దొంగలు టార్గెట్ చేస్తుంటారు. దొంగతనాలకు పాల్పడుతుంటారు. అయితే, ఓ దొంగమాత్రం ఇంట్లో అందరూ ఉన్నారని తెలిసికూడా దొంగతనం చేసేందుకు ఇంటికి వచ్చాడు. కింద ఇంట్లో అందరూ ఉండగా పైన ఉన్న ఇంట్లోకి దూరిన దొంగ బట్టలు విప్పేసి టవల్ కట్టుకొని స్నానాల గదిలోకి దూరి స్నానం చేయడం మొదలు పెట్టాడు. అయితే, కింద గదిలో అప్పటికే మేల్కొని ఉన్న మహిళ, అలికిడిని గమనించి భర్తను నిద్రలేపింది. భర్త గన్…
బ్రిటన్లో జీ7 దేశాల సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరయ్యారు. అమెరికా, బ్రిటన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా సదస్సులో పాల్గోన్న అనంతరం ఇరు దేశాల అధిపతులు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోసం ప్రత్యేక బహుమతిని తీసుకొచ్చారు. పూర్తిగా చేత్తో తయారు చేసిన సైకిల్ను ఆయనకు బహుకరించారు. ఈ సైకిల్పై బ్రిటన్ జెండా గుర్తు ఉంటుంది. పూర్తిగా చేత్తో తయారు చేసిన ఈ సైకిల్ ఖరీదు…
జీ7 దేశాలకు చైనా పెద్ద వార్నింగ్ ఇచ్చింది. కరోనా వైరస్ చైనా నుంచి వచ్చిందని, ఊహాన్లోని ల్యాబ్ నుంచి ఈ మహమ్మారి బయటకు వచ్చిందని అమెరికా గతంలో ఆరోపణలు చేసింది. అప్పట్లో ట్రంప్ చేసిన ఆరోపణలను ప్రపంచం పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు ట్రంప్ చేసిన ఆరోపణలకు బలం చేరూరుతున్నది. ప్రస్తుత అధ్యక్షకుడు జో బైడెన్ కూడా చైనాపై ఉక్కుపాదం మోపేందుకు జీ 7 సదస్సును వేదికగా చేసుకున్నారు. భవిష్యత్తులో చైనా నుంచి ఎదురయ్యే ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు…
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం స్మార్ట్ వాచ్ రంగంలోకి దిగబోతున్నది. ఇప్పటి వరకు యాపిల్, గూగుల్ సంస్థలు స్మార్ట్ వాచ్ యుగాన్ని నడిపిస్తున్నాయి. ఇప్పుడు ఫేస్బుక్ కూడా రంగంలోకి దిగుతుండటంతో త్రిముఖపోటీ ఉండే అవకాశం ఉన్నది. ఇతర స్మార్ట్ వాచ్ మాదిరిగా ఉన్నప్పటికీ, ఇందులో అదనంగా మరికోన్ని ఫీచర్లు ఉండబోతున్నాయి. ఈ వాచ్లో కెమెరా ఉంటుంది. ఈ కెమెరా సహాయంతో వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా, వెనుక 1080 పిక్సల్ కెమేరా ఉంటుంది. దీని సహాయంతో వీడియోలను…
కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న భారత్ను ఆదుకోవడానికి అమెరికా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియాకు 100 మిలియన్ డాలర్ల సహాయం ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన కోవాక్స్ లో అమెరికా కుడా భాగస్వామిగా ఉన్నది. కొవాక్స్ కు అమెరికా 8 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందివ్వబోతున్నది. ఇందులో నుంచి భారత్కు అందాల్సిన వ్యాక్సిన్ వాటాను అందిస్తామని అమెరికా ప్రకటించింది. భారత్ వాటా కింద 80 మిలియన్ వాక్సిన్ డోసులు అందనున్నాయి,…
ప్రపంచాన్ని కరోనా ఎంతటా ఇబ్బందులకు గురి చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా మాస్క్ ధరించాలి, రెండోది వ్యాక్సినేషన్ తీసుకోవాలి. అమెరికాలో ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యాక్సిన్ను అందిస్తున్నారు. వ్యాక్సినేషన్ జరుగుతుండటంతో ఆ దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. కానీ, కరోనాకు భయపడి ఇంకా ప్రజలు మాస్క్ ధరిస్తూనే ఉన్నారు. దీంతో క్యాలిఫోర్నియాకు చెందిన ఫిడిల్ హెడ్ కేఫ్…
చైనా దేశంపై అమెరికా మరోమారు ఉక్కుపాదం మోపింది. అమెరికా ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం కావడానికి చైనా వైరస్ కారణమని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించడంతోపాటు, 31 చైనా కంపెనీలపై నిషేదం విధించారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ పదవీబాధ్యతలు చేపట్టిన తరువాత, చైనాతో సత్సంబందాలు కొనసాగుతాయని అనుకున్నారు. అ దిశగానే బైడెన్ అడుగులు వేసినా, తాజా పరిణామాలతో మరోసారి చైనాపై బైడెన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. చైనాకు చెందిన 28 కంపెనీలపై నిషేదం విధించింది.…