డొనాల్డ్ ట్రంప్ భారత్ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అసలు ‘ఇండియాకు 21 మిలియన్ డాలర్ల సాయం ఎందుకివ్వాలి అని ప్రశ్నించారు. వాళ్ల దగ్గరే చాలా డబ్బులు ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికాపై వాళ్లు భారీగా ట్యాక్సులు వేస్తున్నారని ఆరోపించాడు. నాకు భారత దేశం అన్నా, ఆ దేశ ప్రధాని అన్నా గౌరవం ఉంది అని చెప్పుకొచ్చాడు.
Bird Flu Outbreak In US: బర్డ్ ప్లూ అనేది కేవలం భారతదేశంలోనే కాదు అగ్రరాజ్యం అమెరికానూ సైతం భయపెడుతుంది. ఒకవైపు, బర్డ్ ఫ్లూ వల్ల మన దేశంలో చికెన్, గుడ్లు తినాలంటే ప్రజలు భయపడుతున్నారు. దీంతో చికెన్, గుడ్ల అమ్మకాలు అమాంతం పడిపోయాయి. అలాగే, అమెరికాలో ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో కోడిగుడ్ల ధరలు రోజు రోజుకు కొండెక్కుతున్నాయి.
PM Modi: అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ సమయంలో ఆయన మాట్లాడుతూ.. యూఎస్లో అక్రమంగా ఉంటున్న తమ పౌరుల్ని భారత్ తిరిగి స్వీకరింస్తుందని చెప్పారు. అదే సమయంలో మానవ అక్రమ రవాణాని అంతం చేయడానికి ప్రయత్నాలు అవసరమని చెప్పారు.
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగు రోజుల ఫ్రాన్స్ అమెరికా పర్యటనలో ఉన్నారు. దాని మొదటి దశలో ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో కలిసి 'AI యాక్షన్ సమ్మిట్'కు అధ్యక్షత వహిస్తారు.
అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఫ్లైజ్ జర్నీ అంటేనే భయపడాల్సిన పరిస్థితి తలెత్తింది. అలస్కాలో మూడు రోజుల క్రితం ఓ విమానం మిస్సైన విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కాసేపటికే అదృష్యమైపోయింది. యునలక్లీట్ నుంచి అలస్కా మీదుగా నోమ్ వెళ్తున్న ఫ్లైట్ రాడార్ల నుంచి మిస్సైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా అలస్కాలో గల్లంతైన విమానం ఆచూకీ లభ్యమైంది. విమానం మిస్సింగ్ ఘటన విషాదాంతంగా మారింది. 10 మంది ప్రయాణికులతో…
అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే వరుస ఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇటీవల విమానం కుప్పకూలి ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో ప్రమాదంలో విమానాన్ని, హెలికాఫ్టర్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 64 మంది ప్రయాణికులు మరణించారు. ఈఘటనలు మరువకముందే అమెరికాలో మరో విమానం అదృశ్యమయ్యింది. టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఆచూకీ లేకుండా పోయింది. Also Read: Hydra Commissioner: ఓవర్…
డాలర్లు సంపాదించేందుకు అగ్రరాజ్యం అమెరికా వెళ్లిన వారికి గట్టి షాక్ తగులుతోంది. డొలాల్డ్ ట్రంప్ అధ్యక్ష భాద్యతలు చేపట్టిన వెంటనే తన మార్క్ పాలన చూపిస్తూ దూసుకెళ్తున్నాడు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది అమెరికా ప్రభుత్వం. యూఎస్ లో అక్రమంగా ఉంటున్న భారతీయులను సైతం వెనక్కి పంపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంత మంది భారతీయులను వెనక్కి పంపింది. 205 మంది భారతీయులను వెనక్కి పంపించింది. టెక్సాస్ నుంచి బయల్దేరిన ఆ విమానం బుధవారం మధ్యాహ్నం అమృత్…
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్న పనుల్ని చేస్తున్నారు. ముఖ్యంగా అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిని దేశం నుంచి బహిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. దీని వల్ల అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులు ఇంటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారుల సామూహిక బహిష్కరణ ప్రారంభమైంది. అమెరికాలో సుమారుగా 11 మిలియన్ల మంది డాక్యుమెంట్లు లేని వలసదారులు ఉన్నట్లు అంచనా.
అగ్రరాజ్యం అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. గత వారం రెండుసార్లు విమాన ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాషింగ్టన్ డీసీలో హెలికాఫ్టర్ విమానాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా మరణించారు. ఆ తర్వాత మరో చిన్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ఘటనల నుంచి తేరుకోక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. యునైటెడ్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. రన్ వేపై టేకాఫ్ అవుతుండగా మంటల్లో చిక్కుకుంది. కానీ,…
China: చైనా అన్ని రంగాల్లో అమెరికాకు సవాల్ విసురుతోంది. ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవస్థ, టెక్నాలజీలో అమెరికాను మించి ఎదగాలని చైనా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే తన కార్యాచరణ వేగాన్ని పెంచింది. యూఎస్ని కాదని అగ్రరాజ్య హోదా తెచ్చుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల చైనా ఏఐ చాట్బాట్ ‘‘డీప్ సీక్’’ పెద్ద సంచలనమే సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)లో అగ్రగామిగా ఉన్న అమెరికాకు చుక్కలు చూపించింది.