భార్య మతంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హిందూ మతంపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేషాలు వ్యక్తమవ్వడంతో తాజాగా జేడీ వాన్స్ క్లారిటీ ఇచ్చారు. తన భార్య హిందువు అని.. ఆమెకు మతం మారే ఆలోచన లేదని చెప్పారు.
భారత్-అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం జరిగింది. దశాబ్ద కాలం నాటి రక్షణ చట్టానికి భారతదేశం అమెరికా సంతకం చేశాయి. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. 10 ఏళ్ల పాటు ఉండే ఈ ఒప్పందం ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయనుంది.
చార్లీ కిర్క్.. ట్రంప్ సన్నిహితుడు. ఇటీవల దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో చార్లీ కిర్క్ సతీమణి ఎరికా కిర్క్ వెలుగులోకి వచ్చింది. ఇక మరణానంతరం చార్లీ కిర్క్కు దేశ అత్యున్నత పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం ప్రకటించింది.
అగ్ర రాజ్యం అమెరికాలో ప్రస్తుతం షట్డౌన్ నడుస్తోంది. జీతాలు రాక ఉద్యోగులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో బాధ్యతగా మెలగాల్సిన ఎఫ్బీఐ డైరెక్టర్ గాడి తప్పారు.
దక్షిణ కొరియా వేదికగా ట్రంప్-జిన్పింగ్ సమావేశం సత్ఫలితాన్ని ఇచ్చింది. వాణిజ్య యుద్ధం చల్లారింది. రెండు గంటల సుదీర్ఘ సమావేశం తర్వాత ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనాపై విధించిన సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం చైనాపై 57 శాతం సుంకం అమలవుతోంది. ట్రంప్ ప్రకటనతో 47 శాతానికి దిగొచ్చింది.
దక్షిణ కొరియా వేదికగా ట్రంప్-జిన్పింగ్ సమావేశం అయ్యారు. ఆరేళ్ల తర్వాత ఇద్దరు నాయకులు కలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. బుసాన్లో జరుగుతున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
దక్షిణ కొరియా వేదికగా గురువారం కీలక సమావేశం జరగనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్-చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం దక్షిణ కొరియాలోని బుసాన్లో
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం ఆసియా పర్యటనలో ఉన్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా మలేసియా, జపాన్లో పర్యటించారు. ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొగుడుతున్నారో.. తిడుతున్నారో తెలియకుండా చాలా నర్మగర్భంగా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.
గాజా శాంతి ఒప్పందం మళ్లీ గాడి తప్పింది. ఈజిప్టు వేదికగా ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన గాజా శాంతి ఒప్పందం కొద్దిరోజులకే నీరుగారిపోయింది. శాంతి ఒప్పందం జరిగిన కొద్ది గంటలకే గాజాపై దాడులు జరిగాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇష్టపడుతున్నట్లు వెల్లడించారు. గతంలో కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మలేషియా పర్యటనలో ఉన్న ఆయన మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు.