Iran: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభాన్ని సృష్టించింది. అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒకప్పుడు రష్యా నుంచి చమురు కొనొద్దని భారత్పై ఒత్తిడి తెచ్చిన అమెరికా, ఇప్పుడు భారత్తో పాటు వివిధ దేశాలు రష్యన్ ఆయిల్ కొనాలని బ్రతిమిలాడుతోందని ఆయన విమర్శించారు.
China: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ చైనా, భారత స్నేహాన్ని కోరుకుంటోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడుతూ.. భారత్, చైనాలు ఒకరినొకరు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా చూసుకోవాలని అన్నారు. చైనా, భారత్లు రెండు ‘‘గ్లోబల్ సౌత్’’లో భాగమని, లోతైన సాంస్కృతిక సంబంధాలు, విస్తృత ఉమ్మడి ప్రయోజనాలను పంచుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. బీజింగ్లో జరిగిన 14వ జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ సెషన్ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
US-Russia: రష్యన్ ప్లాగ్ కలిగిన ఆయిల్ ట్యాంకర్ను యూఎస్ దళాలు సీజ్ చేశాయి. అట్లాంటిక్ మీదుగా ప్రయాణిస్తున్న ఈ చమురు ట్యాంకర్ను గత రెండు వారాలుగా యూఎస్ ట్రాక్ చేస్తోంది.
Putin: భారతదేశం పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ ఒత్తిడికి భారత్ తలొగ్గదని ఆయన అన్నారు. ‘‘భారతదేశ అవమానాన్ని ఎప్పటికీ అనుమతించదు’’ అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ లాంటి చర్యల్ని అనుమతించరని చెప్పారు. పుతిన్ గురువారం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనను విమర్శించారు. రష్యాతో ఇంధన కొనుగోలును నిలిపేయాలని అమెరికా భారత్పై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో పుతిన్ నుంచి ఈ హెచ్చరికలు వచ్చాయి. దక్షిణ రష్యాలోని సోచిలో…
US-India: ఇరాన్ వ్యూహాత్మక ఓడరేపు విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఓడరేవులో కార్యకలాపాల కోసం 2018లో మంజూరు చేసిన ఆంక్షల మినహాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఓడరేవును భారత్ అభివృద్ధి చేస్తోంది. కీలకమైన టెర్మినల్స్ని డెవలప్ చేయడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు అమెరికా నిర్ణయం ఇండియాను ఇబ్బంది పెట్టేదిగా ఉంది.
Iran Army: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఓ వైపు భీకరంగా జరుగుతుండగా మరో వైపు ఇరాన్ సైన్యం 200 హెలికాప్టర్లతో విన్యాసాలు ప్రారంభించింది. ఇరాన్ మీడియా శుక్రవారం ఈ సమాచారాన్ని ఇచ్చింది.