US-India: భారత్కు షాక్ ఇచ్చిన అమెరికా.. ఇరాన్ ‘‘చాబహార్’’ పోర్టుపై కీలక నిర్ణయం..
- భారత్కు మరోసారి షాక్ ఇచ్చిన అమెరికా..
- ఇరాన్ చాబహార్ పోర్టు విషయంలో కీలక నిర్ణయం..
- భారత్కు ఇచ్చిన మినహాయింపులు రద్దు..
- పోర్టు కార్యకలాపాల్లో పాల్గొనడంపై అమెరికా ఆంక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-India: ఇరాన్ వ్యూహాత్మక ఓడరేపు విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఓడరేవులో కార్యకలాపాల కోసం 2018లో మంజూరు చేసిన ఆంక్షల మినహాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఓడరేవును భారత్ అభివృద్ధి చేస్తోంది. కీలకమైన టెర్మినల్స్ని డెవలప్ చేయడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు అమెరికా నిర్ణయం ఇండియాను ఇబ్బంది పెట్టేదిగా ఉంది. సెప్టెంబర్ 29, 2025 నుంచి అమలులోకి వచ్చే ఈ నిర్ణయం ఇరాన్పై అమెరికా మరింత ఒత్తిడిని పెంచేదిగా ఉంది.
గతంలో ఇరాన్ స్వేచ్ఛ మరియు ప్రతి-వ్యాప్తి నిరోధక చట్టం (IFCA) కింద జారీ చేయబడిన ఈ మినహాయింపుల ద్వారా, భారత్తో పాటు ఇతర దేశాలు అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకునేలా, ఓడరేవులో పనిచేయడానికి అనుమతించింది. పాకిస్తాన్లో చైనా అభివృద్ధి చేస్తున్న గ్వాదర్ పోర్టుకు, ఇరాన్ చాబహార్ పోర్టును భారత్ కౌంటర్గా భావిస్తోంది. పాకిస్తాన్తో ప్రమేయం లేకుండా భారత్ నేరుగా మధ్య ఆసియాతో వాణిజ్య సంబంధాలను విస్తరించుకోవడానికి చాబహార్ కీలకంగా ఉంది.
Also Read
- NEET Re Exam: నీట్ రీ-ఎగ్జామ్కు ముందు విషాదం.. 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య..
- MRP Violation Case: MRP కంటే రూ.20 ఎక్కువ వసూలు.. దుకాణదారుడు, కంపెనీకి కోర్టు రూ.10 లక్షల జరిమానా
- Pakistan: బంగాళాఖాతంపై పాకిస్థాన్ కన్ను.. భారత్కు సముద్ర సరిహద్దుల్లో కొత్త సవాల్?
- Fuel Prices: ముగిసిన యుద్ధం.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? క్లారిటీ ఇదిగో..!
సెప్టెంబర్ 16న ఒక ప్రకటనలో, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఈ నిర్ణయం “ఇరాన్ పాలనను ఒంటరిగా చేయడానికి అధ్యక్షుడు ట్రంప్ యొక్క గరిష్ట ఒత్తిడి విధానానికి అనుగుణంగా ఉంది” అని పేర్కొంది. “రద్దు అమలులోకి వచ్చిన తర్వాత, చాబహార్ ఓడరేవును నిర్వహించే లేదా IFCAలో వివరించిన ఇతర కార్యకలాపాలలో పాల్గొనే వ్యక్తులు IFCA కింద ఆంక్షలకు గురవుతారు” అని జోడించింది.
Read Also: Rahul Gandhi: ‘‘Gen Z’’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్.. భారత్ నేపాల్లా కావాలని అనుకుంటున్నారా..?
భారత్కి ఎదురుదెబ్బ..
మినహాయింపులు ఎత్తేయడం భారత్కి దెబ్బగా మారొచ్చు. మే 13, 2024న భారత్ తన మొదటి దీర్ఘకాలిక విదేశీ ఓడరేవు ఒప్పందంపై సంతకం చేసింది. ఇది ఇరాన్ పోర్టు, మారిటైమ్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో చాబహార్ నిర్వహించడానికి 10 ఏళ్ల ఒప్పందం. ఒప్పందం ప్రకారం, ఇండియన్ పోర్ట్స్ గ్లోబర్ లిమిటెడ్ (IPGL) ఓడరేవు చుట్టూ మౌలిక సదుపాయాల కోసం మరో $250 మిలియన్ల క్రెడిట్ సేకరణ ప్రణాళికలతో పాటు, సుమారు $120 మిలియన్లకు హామీ ఇచ్చింది. ఈ ఓడరేవు ద్వారా భారత్ ఆఫ్ఘనిస్తాన్కు గోధుమలను పంపిస్తుంది.
2018లో అప్పటి ట్రంప్ సర్కార్ చాబహార్ పోర్టు ప్రాజెక్టుపై విధించిన ఆంక్షల పరిధి నుంచి భారత్ను తప్పించింది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాధాన్యతను గుర్తించి, చాబహార్ పోర్టు, దాని అనుబంధ రైల్వే లైన్ అభివృద్ధికి సంబంధించి మినహాయింపులు వర్తింప చేసింది. ఇప్పుడు, అమెరికా ఆంక్షల మినహాయింపు రద్దు చేయడంతో, భారత్ ఇప్పుడు తన పెట్టుబడిని, ప్రాజెక్టులో పాల్గొన్న కంపెనీలను రక్షించుకోవడం సవాలుగా మారింది.
తాజావార్తలు
-
NEET Re Exam: నీట్ రీ-ఎగ్జామ్కు ముందు విషాదం.. 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య..
-
Fahadh Faasil : ‘దృశ్యం 3’ నిర్మాతలతో ఫహద్ ఫాసిల్ క్రేజీ డీల్… వరుస ప్రాజెక్టులు
-
Hyderabad: ఫ్రీజర్లో పురుగులు, స్టోరేజ్లో బల్లులు.. ‘లా పినోజ్ పిజ్జా’ కిచెన్ చూసి షాకైన అధికారులు!
-
FIFA Worldcup 2026లో కొత్త చరిత్ర.. ఒక్క రోజులోనే రికార్డు స్థాయి ప్రేక్షకులు.!
-
Noam Shazeer: గూగుల్కు బిగ్ షాక్.. జెమిని ఏఐ కీలక రూపశిల్పి రాజీనామా.. ఓపెన్ AI గూటికి టెక్ జీనియస్!
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!