USA: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్జీసీ) సమావేశాలకు ముందు అమెరికాలో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. టెలికాం సేవల్ని నిలిసేందుకు పన్నిన కుట్రను యూఎస్ సీక్రెట్ సర్వీస్ మంగళవారం భగ్నం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సహా, అనేక దేశాధినేతలు ప్రసంగించే సమయంలో ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత ఐక్యరాజ్యసమితిలో తొలి ప్రసంగం చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇది జరిగింది.
యూరప్, పశ్చిమ దేశాలు భారత్ తో గౌరవప్రదమైన, సహకార విధానాన్ని అవలంబించాలని, లేకుంటే మనమందరం ప్రపంచ ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ స్పష్టం చేశారు. భారతదేశంపై విధించిన సుంకాలపై కూడా ఆయన పరోక్షంగా ట్రంప్ను విమర్శించారు. లిథువేనియా అధ్యక్షుడు గీతానాస్ నౌసేడాతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో స్టబ్ మాట్లాడుతూ, షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం గ్లోబల్ సౌత్ శక్తి గురించి పశ్చిమ దేశాలను హెచ్చరించిందని అన్నారు.…
అమెరికాకు వెళ్లి డాలర్లు సంపాదించాలని చాలా మంది కలలుకంటుంటారు. అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వారి ఆశలను ఆవిరి చేస్తున్నాయి. ఇప్పుడు మరో బాంబ్ పేల్చారు. విదేశీ ట్రక్ డ్రైవర్లకు కమర్షియల్ లైసెన్సులు ఇవ్వడాన్ని అమెరికా తక్షణమే నిషేధించింది. ఉపాధి కోసం అమెరికాకు వెళ్లే భారత్ లోని నిరుద్యోగ యువతకు ఇది విచారకరమైన వార్త. భారతదేశంతో పోల్చి చూస్తే, అమెరికాలో ట్రక్ డ్రైవర్ వృత్తి గౌరవనీయమైనదిగా, ఎక్కువ సంపాదనతో కూడుకున్నదిగా పరిగణిస్తారు.…
శనివారం అలాస్కాలో ట్రంప్తో సమావేశమైన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. 2022లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్లో యుద్ధం జరిగేది కాదని అన్నారు.ట్రంప్ ఇంతకుముందు కూడా ఇదే చెబుతున్నారని, తాను కూడా అలాగే నమ్ముతున్నానని ఆయన అన్నారు. 2022లో ఈ విషయం మరింత తీవ్రం కాకుండా ఉండేందుకు బైడెన్ను ఒప్పించడానికి తాను ప్రయత్నించానని పుతిన్ తెలిపారు. ఇప్పుడు ట్రంప్తో కలిసి ఈ…
భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు అమెరికాలోని యాంకరేజ్ నగరంలోని ఎల్మెండోర్ఫ్-రిచర్డ్సన్ సైనిక స్థావరంలో జరిగిన సమావేశంపై దృష్టి సారించాయి. ఈ సమావేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా పనిచేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం. సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇద్దరు నాయకులు ఫలవంతమైన చర్చలుగా అభివర్ణించారు. అయితే, కాల్పుల విరమణపై ఎటువంటి ఒప్పందం కుదరలేదు. అనేక…
అదనపు సుంకాలు లేదా సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నప్పటికీ, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును భారత్ ఆపదని దేశంలోని అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) చైర్మన్ ఎఎస్ సాహ్నీ గురువారం తెలిపారు. ఐఓసీ వంటి శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేయడం పూర్తిగా ఆర్థిక అంశాలను దృష్టిలో ఉంచుకుంటాయని సాహ్ని అన్నారు. రష్యన్ కొనుగోళ్లపై ఎటువంటి నిషేధం లేదని, మేము కొనుగోళ్లను కొనసాగిస్తున్నామన్నారు.…
Shocking: అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో ఓ మహిళా ఉద్యోగి తన మేనేజర్పై కత్తితో 15సార్లు దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఉద్యోగస్థలంలో ఒత్తిడి, మానసిక వేధింపులు ఎంత ప్రమాదకరంగా మారుతాయన్నదానికి ఇది ఉదాహరణగా మారింది. 26 ఏళ్ల మహిళా ఉద్యోగి అఫెని ముహమ్మద్ మెక్డొనాల్డ్స్ ఔట్లెట్లో పని చేస్తోంది. అదే సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్న జెన్నిఫర్ హ్యారిస్ (39) తరచూ ఆమెను పని సరిగ్గా చేయడం లేదంటూ విమర్శిస్తూ, ఇంటికి పంపించేవారు. దీనిని…
Khalistani Terrorists: భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న పంజాబ్కు చెందిన గ్యాంగ్స్టర్ పవిత్తర్ సింగ్ బటాలాను, మరో ఏడుగురు ఖలిస్తాన్ ఉగ్రవాదులను అమెరికాలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) కిడ్నాప్ కేసులో అరెస్టు చేసింది. బటాలా నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్తో సంబంధాలను కలిగి ఉన్నాడు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు భారతదేశం ఇతడిని కోరుతోంది.
అమెరికాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. టెక్సాస్ వరదలతో వణుకుతోంది. ఆకస్మిక వరదల కారణంగా, గ్వాడాలుపే నది దాదాపు 45 నిమిషాల్లో 26 అడుగులు పెరిగి ఉదృతంగా ప్రవహిస్తోంది. వరద కారణంగా, తొమ్మిది మంది పిల్లలు సహా 43 మంది మరణించారు. అదే సమయంలో, వేసవి శిబిరం నుంచి 23 మంది బాలికలు సహా 27 మంది గల్లంతయ్యారు. తుఫాను సెంట్రల్ టెక్సాస్ మీదుగా కదులుతున్నందున మరిన్ని భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉందని నేషనల్ వెదర్…
Donald Trump: అమెరికా సుప్రీంకోర్టులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి భారీ విజయం లభించింది. వ్యక్తిగతంగా న్యాయమూర్తులు ట్రంప్ అధికారాలను కట్టడి చేయడాన్ని సుప్రీంకోర్టు పరిమితం చేసింది. జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేయాలనే ట్రంప్ ప్రయత్నంపై 6-3తో తీర్పు ఇచ్చింది. డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తులు దేశవ్యాప్తంగా జారీ చేసిన నిషేధాలు చట్ట సభలు కోర్టులకు ఇచ్చిన అధికారాలను మించిపోయేలా ఉందని కోర్టు పేర్కొంది.