పశ్చిమాసియాలో మళ్లీ టెన్షన్ తప్పదా? మళ్లీ యుద్ధానికి దేశాలు సై అంటున్నాయా? ఇజ్రాయెల్ దూకుడు. ఇరాన్ మెలిక. శాంతి ఒప్పందానికి ప్రతిష్టంభన ఏర్పడిందా? మళ్లీ మూడు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయా? అంటే సంకేతాలు అలానే అనిపిస్తున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే.. మరోసారి మధ్యప్రాచ్యం రక్తసిక్తమయ్యేలా కనిపిస్తోంది.
US-Iran Ceasefire: ఇటీవల ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం రాత్రి వరకు ఒప్పందం కుదుర్చుకోకపోతే మీ నాగరికత అంతమవుతుందని హెచ్చరించారు. కట్చేస్తే డెడ్లైన్కు కొన్ని గంటల ముందే ట్రంప్ తన రూట్ మార్చుకున్నారు. ఇరాన్తో ఒప్పందం కుదిరిందని, రెండు వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించారు. మరోవైపు.. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్'ను తిరిగి తెరిచేందుకు ఇరాన్ అంగీకరించింది. అయితే.. ఈ ఒప్పందానికి సంబంధించి ఘనతను…
Donald Trump: గత కొద్ది రోజులు మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా అదుపులోకి వచ్చాయి. తాను ఇరాన్పై విధించిన డెడ్లైన్ అంశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను విధించిన గడువు ముగియడానికి కేవలం రెండు గంటల ముందు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించారు. అంతకు ముందు రోజు 48 గంటల డెడ్లైన్ విధించిన ట్రంప్ తాజాగా వెనక్కి తగ్గడం ప్రపంచాన్ని ఊపిరి పీల్చుకునేలా చేసింది.…
మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని గంటల తర్వాత, టెహ్రాన్ గట్టిగా స్పందించింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్, సోషల్ మీడియాలో స్పందిస్తూ, అమెరికా దుందుడుకు చర్యలు మొత్తం ప్రాంతాన్ని ఒక పెద్ద సంఘర్షణ వైపు నెడుతున్నాయని అన్నారు. వాషింగ్టన్ విధానాలు ప్రతి కుటుంబానికి “నరకం”గా మారవచ్చని హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్ను డిమాండ్ చేస్తూ ట్రంప్…
ఇరాన్తో ఒప్పందం చేసుకునే ప్రసక్తేలేదని.. భవిష్యత్లో కూడా ఎలాంటి ఒప్పందం చేసుకోబోమని ట్రంప్ ప్రకటించారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు.
పశ్చిమాసియా యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇరు పక్షాలు ఒకరిపై మరొకరు భీకర దాడులు చేసుకుంటున్నాయి. దీంతో మధ్యప్రాచ్యం యుద్ధం మరింత భయాందోళనలు కలిగిస్తోంది.
Donald Trump Dual Policy: ఇరాన్తో యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన విదేశాంగ విధానంలో ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ఇరాన్తో శాంతి చర్చలు కొనసాగిస్తున్నామని ప్రకటిస్తూనే, మరోవైపు మధ్యప్రాచ్యంలో సైనిక శక్తిని పెంచే చర్యలు చేపడుతున్నారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో అమెరికా తన సైనిక ఉనికిని మరింత బలోపేతం చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా అదనంగా 10,000 మంది సైనికులను పంపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు…
పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చబోతోందా? మూడు వారాలుగా జరుగుతున్న యుద్ధం ముందు.. ముందు మరింత ఉద్రిక్తతలకు దారి తీయబోతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
ఇరాన్పై యుద్ధానికి మొదటి నుంచి అమెరికాకు సహకరించేందుకు బ్రిటన్ వెనుకంజ వేసింది. ట్రంపే స్వయంగా ఫోన్ చేసి వైమానిక స్థావరాలు అప్పగించాలని అడిగినా కూడా యూకే ప్రభుత్వం నిరాకరించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.