Donald Trump: మేము ‘‘సముద్రపు దొంగలం’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- మేమ సముద్రపు దొంగలం..
- హార్ముజ్ దిగ్భందంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- ఇరాన్ ఓడలపై ఆపరేషన్ల గురించి పొగడ్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ నేవీ ‘‘హార్ముజ్ జలసంధి’’ దిగ్బంధంపై పొగడ్తలు కురిపించారు. తమను తాము ‘‘పైరేట్స్(సముద్రపు దొంగలం)’’ అని ప్రకటించుకున్నారు. హార్ముజ్ ప్రాంతంలో యూఎస్ నేవీ ఆపరేషన్ల గురించి ట్రంప్ ఫ్లోరిడాలో ఒక సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మేము నౌకలపై దిగిపోతాం, దాన్ని స్వాధీనం చేసుకుంటాం. కార్గో, చమురును తీసుకుంటాం. ఇది లాభదాయకమైన వ్యాపారం. మేము సముద్రపు దొంగలుగా ఉన్నాం, కానీ ఆటలు ఆడటం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: US-Iran War: “ట్రంప్పై నమ్మకం లేదు”.. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
Also Read
- Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
- Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
- Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
అయితే, దీనిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా చర్యలు అంతర్జాతీయ సముద్ర చట్టాలను ఉల్లంఘించడమే అని మండిపడింది. సముద్రంపై ఆయుధాలతో దోపిడిగా అభివర్ణించింది. పైరసీకి ఇది చట్టబద్ధత కల్పించడమని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బగాయి విమర్శించారు. అమెరికా బలగాలు ఇటీవల రెండు చమురు ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నాయి. దీనిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచం మళ్లీ సముద్రపు దొంగల యుగాన్ని చూస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఇరాన్ యుద్ధంలో హార్ముజ్ జలసంధి కీలకంగా మారింది. ఈ మార్గంలోని అమెరికా, ఇరాన్లు పోటాపోటీగా నౌకల్ని అడ్డుకుంటున్నాయి. అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ మాట్లాడుతూ.. ఈ దిగ్బంధం అవసరమైనంత కాలం కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు, అమెరికా తమ పోర్టులపై విధించిన ఆంక్షలు కొనసాగుతున్నంత కాలం హార్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతుందని ఇరాన్ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!