US Embassy: అమెరికాలోని న్యూవార్క్ విమానాశ్రయంలో భారతీయ విద్యార్థికి అక్కడి అధికారులు చేతికి సంకెళ్లు వేసి, బహిష్కరించిన ఘటన దేశవ్యాప్తంగా వైరల్గా మారింది. ఈ ఘటనపై అమెరికా తీరును ప్రవాస భారతీయులతో పాటు, దేశంలోని ప్రజలు ఖండించారు. అయితే, ఈ ఘటనపై భారతదేశంలోని యూఎస్ రాయబార కార్యాలయం కీలక వ్యాఖ్యలు చేసింది.
Indian Students: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా, వలసలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిణామాలు భారతీయ విద్యార్థులకు, ఉద్యోగులకు ప్రతిబంధకంగా మారాయి. తాజాగా, ఇండియన్ స్టూడెంట్స్కి షాకిచ్చే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘‘ క్లాసులకు హాజరు కాకుంటే వీసా రద్దు చేయవచ్చు’’ అని భారత విద్యార్థులకు అమెురికా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. Read Also: CPI Ramakrishna: పాక్తోనే చర్చలు జరిపి…
అమెరికాలో చావుబతుకల మధ్య కొట్టిమిట్టాడుతున్న భారతీయ విద్యార్థిని నీలం షిండేను కలిసేందుకు తల్లిదండ్రులకు అత్యవసరంగా అమెరికా రాయబార కార్యాలయం వీసా మంజూరు చేసింది. దీంతో నీలం షిండే పేరెంట్స్.. అమెరికా వెళ్లనున్నారు.
అమెరికా వీసాల్లో రికార్డ్ సృష్టించింది. వరుసగా రెండో ఏడాది 10 లక్షలకు పైగా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను జారీ చేసినట్లు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.
లండన్లో అమెరికా రాయబారి కార్యాలయం దగ్గర అనుమానాస్పద ప్యాకేజీ తీవ్ర కలకలం రేపింది. దీంతో యూకే పోలీసులు అప్రమత్తమై శుక్రవారం ప్యాకేజ్ను నిర్వీర్యం చేశారు. ప్యాకేజీ ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై లండన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అమెరికా ఎంబసీ వెల్లడించింది. మరోవైపు గాట్విక్ ఎయిర్పోర్టులో భద్రతాపరమైన ఘటన మరొకటి జరిగింది. దీంతో ఎయిర్పోర్టు దక్షిణ టెర్మినల్ను ఖాళీ చేయించామని అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే రష్యా- ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం నేపథ్యంలో మాస్కో, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి.…
ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యాపై అమెరికా తయారీ క్షిపణులను ఉక్రెయిన్ ప్రయోగించింది. దీంతో రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది.
US Embassy: అమెరికా వెళ్లాలని అనుకునే భారతీయులకు అగ్రరాజ్యం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్మెంట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది.
లెబనాన్ రాజధాని బీరూట్లోని యూఎస్ రాయబార కార్యాలయం సమీపంలో బుధవారం కాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సిరియన్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సిబ్బంది సురక్షితంగా ఉన్నారని లెబనాన్ సైన్యం తెలిపింది.
Iraq: శుక్రవారం తెల్లవారుజామున బాగ్దాద్పై రాకెట్లతో దాడి జరిగింది. ముఖ్యంగా ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఉన్న అమెరికన్ రాయబార కార్యాలయాన్ని టార్గెట్ చేసుకుని మూడు రాకెట్లను ప్రయోగించారు. ఇవి డిస్ట్రిక్ట్ హౌసింగ్ గవర్నమెంట్, దౌత్య భవనాలకు దూరంగా పడినట్లు ఇరాక్ భద్రతా అధికారి తెలిపారు. అయితే ఈ రాకెట్లతో దాడి ఎవరు చేశారనే దానికి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించలేదు.
ఉత్తర మధ్య నైజీరియాలో అమాయక ప్రజలపై ముష్కరులు కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 29 మంది మరణించారు. సమీపంలోని గ్రామాలపై తుపాకులతో జరిపిన భీకర కాల్పుల్లో 29 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు నైజీరియా అధికారులు వెల్లడించారు.