Iraq: శుక్రవారం తెల్లవారుజామున బాగ్దాద్పై రాకెట్లతో దాడి జరిగింది. ముఖ్యంగా ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఉన్న అమెరికన్ రాయబార కార్యాలయాన్ని టార్గెట్ చేసుకుని మూడు రాకెట్లను ప్రయోగించారు. ఇవి డిస్ట్రిక్ట్ హౌసింగ్ గవర్నమెంట్, దౌత్య భవనాలకు దూరంగా పడినట్లు ఇరాక్ భద్రతా అధికారి తెలిపారు. అయితే ఈ రాకెట్లతో దాడి ఎవరు చేశారనే దానికి ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించలేదు.
ఉత్తర మధ్య నైజీరియాలో అమాయక ప్రజలపై ముష్కరులు కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 29 మంది మరణించారు. సమీపంలోని గ్రామాలపై తుపాకులతో జరిపిన భీకర కాల్పుల్లో 29 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు నైజీరియా అధికారులు వెల్లడించారు.
US issues 82,000 student visas to Indians in 2022: భారతదేశం నుంచి ఉన్నత విద్య కోసం వెళ్తున్న విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. మెరుగైన విద్య, అవకాశాల కోసం భారతీయులు అమెరికా వైపు చూస్తున్నారు. ప్రపంచంలో భారతీయ విద్యార్థులు వెళ్లే విదేశాల్లో అమెరికా తర్వాతనే ఇతర దేశాలు ఉన్నాయి. కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటివి అమెరికా తర్వాతనే ఉన్నాయి. తాజాగా ఈ విషయాన్ని రుజువుచేస్తూ రికార్డు స్థాయిలో ఈ ఏడాది వీసాలను జారీ చేసింది…