ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది. ట్రంప్ సహా ప్రపంచ అధినేతలంతా ఒకే వేదికపై ఉండగా శాంతి ఒప్పందం జరిగింది. దీంతో ఇకపై గాజాలో బాంబుల మోత, ఆకలి కేకలు ఆగిపోతాయని అంతా భావించారు. కానీ వారం తిరగక ముందే ఇరు పక్షాలు శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించాయి.
భారత్ను మళ్లీ ట్రంప్ హెచ్చరించారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపివేయకపోతే భారీగా సుంకాలు కొనసాగుతాయని వార్నింగ్ ఇచ్చారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు క్రమక్రమంగా తగ్గి్స్తామని ప్రధాని మోడీ తనతో ఫోన్ చెప్పారని గత వారం ట్రంప్ వ్యాఖ్యానించారు.
గాజాలో అధికారాన్ని విడిచిపెట్టకపోతే పూర్తిగా నిర్మూలం అవుతారని హమాస్ను మరోసారి ట్రంప్ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే నరకం చూస్తారని హమాస్ను ఇటీవల ట్రంప్ హెచ్చరించారు. దీంతో శుక్రవారం రాత్రి ట్రంప్ ప్రణాళికలోని కొన్ని అంశాలకు అంగీకారం తెల్పుతున్నట్లు హమాస్ ప్రకటించింది.
సుంకాలు చట్ట విరుద్ధం అంటూ ఇటీవల అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. ఈ తీర్పుపై అప్పట్లోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులంతా ‘రాడికల్ లెఫ్ట్ గ్రూప్’ అంటూ ముద్ర వేశారు.
చైనాను నాశనం చేయగల అద్భుతమైన కార్డులు తన దగ్గర ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్తో ట్రంప్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.
సుంకాలపై ట్రంప్ విధించిన డెడ్లైన్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఆగస్టు 1తో డెడ్లైన్ ముగుస్తుంది. కానీ ఇప్పటి వరకు భారత్-అమెరికా మధ్య మాత్రం ఒప్పందం ఖరారు కాలేదు.
బ్రిక్స్ దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల అమెరికా పాలసీలు వ్యతిరేకిస్తున్న బ్రిక్స్ దేశాలకు అదనంగా మరో 10 శాతం సుంకాలు విధించబోతున్నట్లు ట్రంప్ హెచ్చరించారు. బ్రిక్స్తో సంబంధాలు పెట్టుకున్న ఏ దేశానికైనా ఇదే వర్తిస్తుందని.. మినహాయింపులు ఉండవని వార్నింగ్ ఇచ్చారు.
ఆగస్టు 1 నుంచి దేశాలు సుంకాలు చెల్లిండం ప్రారంభించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. టారిఫ్లపై ట్రంప్ విధించిన డెడ్లైన్ మరో ఐదు రోజుల్లో ముగుస్తోంది. ఏప్రిల్ 2న సుంకాలు ప్రకటించగా.. ఆయా దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో 90 రోజులు తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ గడువు జూలై 9తో ముగుస్తోంది.
ఇరాన్ను మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అణ్వాయుధాల ప్రస్తావన ఇరాన్ మరిచిపోవాలని.. లేదంటే అణు స్థావరాలపై మిలిటరీ చర్య ఉంటుందని హెచ్చరించారు. న్యూక్లియర్ ఒప్పందం చాలా దగ్గరకు వచ్చినప్పటికీ ఇరాన్ కావాలనే తాత్సారం చేస్తోందని ఆరోపించారు.
ఇరాన్కి మరోసారి అణు ఒప్పందం విషయంలో తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకుంటే మంచిది అని.. లేదంటే పెద్ద ప్రమాదంలో పడతారని ట్రంప్ హెచ్చరించారు. సోమవారం ట్రంప్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భేటీ అయ్యారు.