నిజామాబాద్లో శాంతి భద్రతలు క్షీణించాయని, ఉగ్రవాదుల కార్యకలాపాలు ఎక్కువయ్యాయని ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు, తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై నిర్వమించిన బీజేపీ అధ్యక్షన కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్లో గంజాయి కూడా విచ్చలవిడిగా సరఫరా అవుతోందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిజామాబాద్ పోలీసు కమిషనర్ వైఫల్యం చెందారని ఆరోపించారు. జిల్లాలో ప్రజాప్రతినిదులను హత్య చేసేందుకు సుపారీలు తీసుకుంటున్నారని.. ఎంపీగా ఉన్న తనపై కూడా హత్యాయత్నం జరిగిందన్నారు. స్వయంగా తానే ఫిర్యాదు…
తెలంగాణలో రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా, ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు తమ ప్రచారాల్ని మొదలుపెట్టేశాయి. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించేసుకుంటున్నారు. వినూత్నమైన ప్రచారాలకూ శ్రీకారం చుడుతున్నారు. బీజేపీ పార్టీ అయితే మరీ దూసుకుపోతోంది. టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబాన్నే లక్ష్యం చేసుకొని.. విమర్శనాస్త్రాల్ని సంధిస్తోంది. ఇప్పుడు సాలుదొర – సెలవు దొర ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించింది. కేసీఆర్కి వ్యతిరేకంగా పాటలు కూడా…
నా పదేళ్ల వయసులోనే నేను కత్తులతో ఆడుకున్నానని.. స్వతహాగా నేను ఫైటర్ని, నాకు కత్తి తిప్పడం వచ్చు, తుపాకీ పేల్చడం కూడా వచ్చు అంటున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే
ఇందిరా పార్కు ధర్నా చౌక్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధరణి రచ్చబండ కార్యక్రమంలో టీఆర్ఎప్ ప్రభుత్వంపై కిసాన్ కాంగ్రెస్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయని, సీఎస్ సోమేశ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ను కలుద్దామంటే, ఆయన సమయం ఇవ్వడం లేదని, ఎన్ని లేఖలు రాసినా స్పందన రావట్లేదని పేర్కొన్నారు. భూ సమస్యతో రైతులు చనిపోతున్నారని, హత్యలు చోటు చేసుకుంటున్నాయని…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా రెండు పొలిటికల్ పార్టీలు మాత్రమే ఉండేవి. ఒకటి.. కాంగ్రెస్. రెండు.. తెలుగుదేశం. కాబట్టి ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేవి. ఒక పార్టీ మహాఅయితే వరుసగా రెండు సార్లు మాత్రమే గెలిచేది. అందువల్ల పదేళ్ల తర్వాత మరో పార్టీకి ఛాన్స్ వచ్చేది. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ‘అంతర్గత ప్రజాస్వామ్యం’ పేరుతో స్వేచ్ఛగా ఒకరినొకరు విమర్శించుకునేవారు. హస్తం పార్టీలో ఎప్పుడూ రెండు,…
రంగారెడ్డి జిల్లా టిఆర్ఎస్లో మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్టు రాజకీయాలు మారుతున్నాయి. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్య అంతర్గత పోరు మరోసారి బయట పడింది. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన తీగల.. చెరువులు, పాఠశాల స్థలాలు కబ్జా చేస్తున్నారని.. వాటిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రొత్సహిస్తున్నారని ఆరోపించారు. అక్కడితో ఆగకుండా మీర్పేటలో అభివృద్ధి పనులు జరగడం లేదంటూనే.. అసలు సబితా తమ పార్టీలో గెలిచిన వ్యక్తి కాదని విమర్శల…
తెలంగాణ కాంగ్రెస్లో ఒకప్పుడు పీజేఆర్ బలమైన నాయకుడు. ఆయనకంటూ సొంత ఇమేజ్ ఉండేది. పార్టీలో హైదరాబాద్ ప్రస్తావన వస్తే.. పీజేఆర్ పేరు చర్చకు వచ్చేది. పీజేఆర్ మరణం తర్వాత ఆ ఇమేజ్ను సొంతం చేసుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చారు ఆయన తనయుడు విష్ణువర్దన్రెడ్డి. ఎమ్మెల్యేగానూ చేశారు. గత రెండు ఎన్నికల్లో నెగ్గుకు రాలేక ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి వైసీపీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి.. అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీఆర్ఎస్లో చేరి…
విద్యాశాఖా మంత్రి సబితపై వచ్చిన ఆరోపణలపై ఆమె స్పందించారు. ఈనేపథ్యంలో.. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలపై స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ నేత, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డిని ఎవరో మిస్ గైడ్ చేసి ఉంటారని అన్నారు. స్వయంగా నేను ఆయన్ను కలిసి మాట్లాడుతా అంటూ పేర్కొన్నారు. ఇదేం పెద్ద ఇష్యూ కాదు అంటూ…