ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. తబ్లిగీ జమాత్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ వారిపై నిషేధం విధిస్తున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. ఇస్లామిక్ మతాన్ని కాపాడటమే ధ్యేయమంటూ వ్యాఖ్యలు చేసే ఈ సంస్థపై సౌదీ అరేబియా నిషేధం విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే 1926లో తబ్లిగీ జమాత్ సంస్థ ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో సుమారు 35 కోట్ల ముస్లింలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ముస్లింలకు చెందిన సంస్థను…
గత బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్తో పాటు ఏపీ చెందిన సాయితేజ లాన్స్ నాయక్గా విధులు నిర్వహిస్తున్న కూడా మరణించిన విషయం తెలిసిందే. అయితే డీఎన్ఏ పరీక్ష ఆధారంగా నిన్న సాయితేజ మృతదేహాన్ని గుర్తించి ఆర్మీ అధికారులు ఢిల్లీ నుంచి బెంగళూరు తరలించారు. సాయితేజ పార్థీవదేహం తరలింపు ఆలస్యంతో బెంగళూరు బేస్ క్యాంపులోనే ఉంచారు. ఈ రోజు ఉదయం బెంగళూరు బేస్ క్యాంపులో నివాళులు అర్పించిన అనంతరం సాయితేజ…
గత నెల దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంప ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ వేరియంట్ బయటపడ్డ 15 రోజుల్లోనే 66 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇటీవలే ఈ ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోకి కూడా ప్రవేశించింది. రోజురోజుకు చాపకింద నీరులా ఒక్కొక్క రాష్ట్రంపై ఈ ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం చూపుతోంది. అయితే…
తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL), తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TSREDCO) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసే అవకాశాలను అన్వేషిస్తున్నాయి. సబ్ స్టేషన్లలో తగినంత స్థలం ఉన్నందున, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఆర్ఈడీసీవోలు ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో పడ్డాయి. ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు ఇంకా సిద్ధం కానప్పటికీ, ఈ-వాహన యజమానుల నుండి పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి అధికారులు దీనిని…
ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్తో పాటు లాన్స్ నాయక్గా విధులు నిర్వహిస్తున్న సాయితేజ కూడా మరణించిన విషయం తెలిసిందే. అయితే నిన్న బెంగళూరుకు చేరుకున్న సాయితేజ పార్థీవదేహం ఈ రోజు ఎగువరేగడుకు చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు, ప్రజల సందర్శనార్థం సాయితేజ మృతదేహం ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం సాయితేజ అంత్యక్రియలు జరుగనున్నాయి. సాయితేజ అంత్యక్రియలు వీక్షించేందుకు ఈ క్రింద ఉన్న వీడియో చూడండి.
3 రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహాపాదయాత్రను ప్రారంభించారు. గత నెల 1వ తేదీన ప్రారంభమైన ఈ పాదయాత్ర 45 రోజుల పాటు సాగనుంది. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర నేడు 42వ రోజు పాదయాత్ర అంజిమేడులో ప్రారంభం కానుంది. అయితే అంజిమేడు నుంచి 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగి రేణిగుంటకు చేరుకోనుంది. రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ఊరురా ప్రజలు, రైతులు,…
ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా మహమ్మారి మరోసారి రూపం మార్చుకొని ప్రజలపై విరుచుకు పడుతోంది. గత నెల దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ 66 దేశాలకు వ్యాప్తి చెందింది. డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ ఇటీవల భారత్లోకి కూడా ప్రవేశించింది. దీంతో ప్రస్తుతం భారత్లో 33 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కూడా ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉండడంతో నిన్న, నేడు ఆ రాష్ట్రంలో…
మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. ఏపీని సొంత ప్రయోజనాల కోసం కేంద్రంకు తాకట్టుపెట్టారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు మాట్లాడుతూ.. రైల్వే జోన్పై ఆనాడు అనేక మాటలు మాట్లడిన జగన్.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్ పరిశీలనలో లేదంటే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అంతేకాకుండా విశాఖపై ప్రేమ చూపించే వైసీపీ రైల్వే జోన్పై ఏం సమాధానం చెబుతారన్నారు. సమాధానం చెప్పలేని సీఎం ఏవిధంగా…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం తీరుపై పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.
మెదక్ జిల్లాలో వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హావేలి ఘనపూర్ మండలం బొగుడ భూపతిపూర్లో ఇటీవల సీఎం కేసీఆర్కు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న రైతు రవి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రవి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. రైతు భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తారు.. రైతు గుండె ఆగిపోయేలా చేస్తున్నారు కేసీఆర్ అంటూ విమర్శించారు. అంతేకాకుండా వడ్లు వేయాల్సిన…