చంద్రబాబు పద్మవ్యూహం పన్నుతున్నారా.. అందుకేనా ఇది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పనెక్కర్లేదు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా పోటీ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీలకే ఉంటుంది. వార్డు మెంబర్ ఎన్నిక నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు టీడీపీ, వైసీపీ నేతల మధ్య అసలైన పోరు ఉంటుంది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ పౌరులకు తెలియంది కాదు. అయితే రాష్ట్ర విభజన తరువాత మొదటి సారి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను నవ్యాంధ్ర ప్రదేశ్గా ఎన్నో హంగులతో తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అమరావతిని రాజధానిగా చేస్తూ ప్రకటించారు. రాజధాని అభివృద్ధి కోసం రైతుల నుంచి ఎన్నో ఎకరాల భూములను సేకరించారు.
అయితే ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏపీలో 3 రాజధానులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. వైసీపీ ప్రకటనతో ఒక్కసారిగా ఏపీలో ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడ్డారు. వైసీపీ ప్రకటన కొందరు తీపి కబురుగా తోచినా.. కొందరి చెవికి మాత్రం వినసొంపుగా వినిపించలేదు. ఏపీలో ఒకేఒక్క రాజధాని ఉండాలని.. అదికూడా అమరావతి మాత్రమే ఉండాలంటూ అమరావతి రైతులు నిరసనలు తెలుపుతున్నారు. అంతేకాకుండా 45 రోజుల పాటు మహాపాదయాత్ర నిర్వహించి నేడు తిరుపతిలో భార బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం వైసీపీ అభ్యర్థులు సత్తాచాటి విజయభేరి మోగించారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
ఎన్నికల ఫలితాల సందర్భంగా విజయోత్సవాల్లో పాల్గొన్న వైసీపీ నేతలు సీఎం జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు నీరాజనం పడుతున్నారని.. అందుకే వైసీపీని గెలిపించారంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కంచుకోట కుప్పంలోనూ వైసీపీ విజయపతాకం ఎగురవేసింది. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన వివాదస్పద ఘటనతో ఇక నేను ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలోకి అడుగుపెడుతానని చంద్రబాబు శపథం చేసి అసెంబ్లీ నుంచి నిష్క్రమించారు. అంతేకాకుండా 2024 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం చేసుకొని ఆయన భవిష్యత్ కార్యచరణను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అయితే అమరావతి రైతులు 3 రాజధానుల, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా చేపట్టిన మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ రోజు తిరుపతిలో భారీ బహిరంగం సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు తో పాటు బీజేపీ చీఫ్ లక్ష్మీనారాయణ, జనసేన, కాంగ్రెస్ తో పాటు వామపక్షనేతలు హజరుకానున్నారు. వైసీపీపై పోరుకు చంద్రబాబు ఈ పార్టీలతో కూడిన మహాకూటమి తయారు చేసుకొని వచ్చి ఎన్నికల్లో దండయాత్ర చేస్తారా..? అమరావతి రైతుల మహాసభను చంద్రబాబు మహాకూటమిని కలిపి వేదికగా మలుచుకుంటారా..? అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది.
తాజావార్తలు
-
FIFA World Cup 2026: ఆకాశాన్నంటిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ టిక్కెట్ల ధరలు.. 32 ఏళ్లలో 10 రెట్లు పెరిగినయ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Censor Issues : జననాయగన్కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్.. ఇక టాక్సిక్ పరిస్థితి ఏంటి?
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వివాదాలు, చికాకులు తప్పవు!
-
Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. ‘లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్’ అంటూ ఫైర్!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!