కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది : వైఎస్సార్సీపీ ఎంపీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు పార్లమెంట్ సమావేశాల అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్లో వైసీపీ ఎంపీలు మాట్లాడుతూ.. విభజన హామీల పట్ల కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని అన్నారు. అంతేకాకుండా ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలు వెంటనే నెరవేర్చాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టానికి కేంద్రం తక్షణ సాయం విడుదల చేయాలని, చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ గతి పట్టిందని ఆరోపించారు. చంద్రబాబు బుద్ధి మారాలి.. రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలు మానుకోవాలి. చేతికందిన కూడును నోటికి అందకుండా.. పేదల నోటికి, చేతికి చంద్రబాబు అడ్డుపెడుతున్నాడు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలకు అంత ఉలుకెందుకు..? అంటూ వారు ప్రశ్నించారు.
మరో రెండేళ్ళలో విభజన హామీలు నెరవేర్చడానికి ఇచ్చిన కాలపరిమితి పూర్తికానుండటంతో వెంటనే వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అన్ని పార్టీలు ఒకే తాటి మీద నిలబడాల్సిన అవసరం ఉందని, అలాకాకుండా, స్వార్థ రాజకీయాలే పరమావధిగా టీడీపీ, రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడటం సమంజసం కాదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి విమర్శలు చేయడం అంటే.. పేదవాడి పొట్టగొట్టడమేనని అన్నారు. ఎవరి వద్దా చేయి చాచకుండా, పేదవాడు తలెత్తుకుని గౌరవంగా బతకడానికి మనసున్న ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. వాటిని వృథా అనటానికి నోరు ఎలా వచ్చిందని వైసీపీ ఎంపీలు దుయ్యబట్టారు. అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు ఓ వర్గం ప్రయోజనాల కోసం ప్రాకులాడుతున్నారే తప్పితే.. అందులో రాష్ట్ర ప్రయోజనాలు లేవని చెప్పారు.
Also Read
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!