Home
Trending News
Trending News News
-
టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్న మాట అబద్ధం : బీజేపీ నేత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వెల్లడించింది. అయితే ఈ విషయంపై స్పందించిన మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్, బీజేపీ నేత విఠల్ మాట్లాడుతూ.. మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్ గా చెప్తున్న, 1 లక్ష 32 వేలు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్న మాట అబద్ధం అని ఆయన అన్నారు. ఏడేళ్లలో టీఎస్పీఎస్సీ భర్తీ చేసింది 32 వేల ఉద్యోగాలేనని, కేసిఆర్ నోటిఫికేషన్ లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నడని ఆయన ఆరోపించారు. ఉద్యోగులు… -
ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ బృందంలో మరొకరి కరోనా పాజిటివ్..
ఇటీవల తెలంగాణ మంత్రులు, ఎంపీలు ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసింది. అయితే ధాన్యం కొనుగోళ్లపై చర్చించేందుకు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అయితే ఢిల్లీలో దాదాపు 4 రోజుల పాటు ఉన్నారు. తరువాత తెలంగాణకు తిరిగివచ్చిన మంత్రులు, ఎంపీల బృందంలో కలకలం రేగింది. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా పాజిటివ్గా నిర్థారణవడంతో హోం ఐసోలేషన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అలాగే ఎంపీ రంజిత్ రెడ్డికి కూడా… -
థర్డ్వేవ్కు ప్రారంభానికి ఇది సూచిక : తెలంగాణ డీహెచ్
ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోకి ప్రవేశించిన విషయం తెలిసింది. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే తెలంగాణలోకి కూడా ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఒమిక్రాన్ వ్యాప్తిపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒమిక్రాన్ వేరియంట్ అనుకున్నదానికంటే శరవేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయన స్పష్టం… -
శాశ్వత పరిష్కారం కోసమే ఎస్ఎన్డీపీని తీసుకొచ్చాం : కేటీఆర్
ఫీవర్ హాస్పిటల్ వద్ద హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా రిటైనింగ్ వాల్కి ఈ రోజు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు కాలేరు వెంకేటేశ్, ముఠా గోపాల్ సహా పలువరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 68 కోట్ల రూపాయలతో కవాడిగూడ బ్రిడ్జ్ నుంచి మూసీలో కలిసే వరకు నాలాకు రక్షణగోడ నిర్మాణం చేపడుతున్నామన్నారు. గతంలో కురిసిన వర్షాల వలన ప్రజలను బాగా ఇబ్బంది పడ్డారని, అప్పుడు… -
నిజామాబాద్లో దొంగల బీభత్సం..
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో మరోసారి దొంగలు రెచ్చిపోతున్నారు. నిజమాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. దర్పల్లి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో 10 మంది దొంగలు చొరబడ్డారు. పెట్రోల్ బంక్లోని కార్యాలయంపై రాళ్లతో దాడి చేస్తూ సిబ్బందిని భయాందోళనకు గురి చేశారు. సిబ్బందిని బెదిరించి పెట్రోల్ బంక్లోని క్యాష్కౌంటర్ను దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే క్యాష్ కౌంటర్లో సుమారు 40 వేలు ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. దీంతో వెంటనే పెట్రోల్ బంక్ సిబ్బంది పోలీసులకు… -
ఫ్రాన్స్లో కరోనా వీరంగం.. ఒక్కరోజే 2లక్షల కేసులు..
గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి అగ్రరాజ్యమైన అమెరికాతో తో పాటు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్తో సతమతవుతున్న వేళ ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఫ్రాన్స్లో కలవరం పుట్టిస్తుంది. యూకే, యూఎస్ దేశాల్లో ఒమిక్రాన్ విజృంభన విపరీతంగా ఉంది. అంతేకాకుండా ఒమిక్రాన్ మరణాలు కూడా ఆ దేశాల్లో చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. ఫ్రాన్స్లో కూడా ఒమిక్రాన్ వేరియంట్ వీరంగం సృష్టిస్తోంది. రోజురోజుకు ఫ్రాన్స్… -
పీఆర్సీపై ఉత్కంఠ.. ఉద్యోగ సంఘాలతో మరోసారి భేటీ కానున్న ఏపీ ప్రభుత్వం..
11వ పీఆర్సీపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ కానుంది. ఇప్పటికే పలు మార్లు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. సీఎస్ సమీర్ శర్మకూడా ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలో పీఆర్సీపై ముచ్చటించారు. అయినప్పటికీ పీఆర్సీపై స్పష్టత నెలకొనలేదు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్తో భేటీ అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి కూడా… -
ఆ పరిస్థితిని మార్చడానికే ఈ నిర్ణయం : సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో కృష్ణా జిల్లాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో ఏపీ పాలవెల్లువ ద్వారా పాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. కొనేవారు ఒక్కడే, అమ్మేవాళ్లు అనేక మంది ఉంటే.. కొనేవాళ్లు ఎంత చెప్తే.. అంతకు అమ్మాల్సిన పరిస్థితి ఉంటుందని, ఇలాంటి మార్కెట్ను ఇవాళ మన రాష్ట్రంలో కూడా చూస్తున్నామన్నారు. అందుకే… -
బద్వేల్ ఎన్నికల్లో వైసీపీకి ప్యాంటులు తడిచిపోయాయి : సోము వీర్రాజు
ఏపీ బీజేపీ కార్యాలయంలో బీజేపీ శ్రేనులు ప్రజాగ్రహ సభ సక్సెస్ సంబరాలు జరుపుకుంటున్నారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్న పంచుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. ఈ సంబరాల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ వైసీపీ, టీడీపీ, సీపీఐ పార్టీల మీద నిప్పులు చెరిగారు. రాబోయే రోజుల్లో పార్టీ దూకుడు పెంచుతుందని, ఏపీలో శూన్యత ఉందని ఆయన అన్నారు. ఏపీలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని,… -
లైవ్ : సీఎం జగన్ అమూల్ పాలవెల్లువ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు కృష్ణా జిల్లాలో వర్చువల్ విధానంలో పాలవెల్లువ పథకాన్ని ప్రారంభించనున్నారు. కృష్ణాజిల్లాలో 264 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ పథకం అమలు కానుంది. అమూల్ సంస్థ ద్వారా పాడి రైతులకు మెరుగైన లాభాలు వస్తాయని ఇప్పటికే జగన్ వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమం ప్రత్యక్షప్రసారాన్ని వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్ను క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!