ఏపీలో ప్రస్తుతం సినిమా టికెట్ల ధర, సినిమా థియేటర్ల తనిఖీలు హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. సినిమా టికెట్ ధరలు అధికంగా అమ్మినా, సినిమా థియేటర్లకు సంబంధించి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోయినా సీజ్ చేస్తున్నారు. అయితే గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50కిపైగా థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. కొన్ని సినిమా థియేటర్ల యాజమాన్యాలు స్వచ్ఛందంగా సినిమా థియేటర్లను మూసివేశాయి.
అయితే టికెట్ ధరలు తగ్గింపు, థియేటర్లతో పాటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నేడు రాజమండ్రిలో సినిమా ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా థియేటర్ యజమానులు జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ తో పాటు మరికొన్ని సినిమాలు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సినిమా టికెట్ల ధరలపై ఇప్పటికే హైకోర్టు విచారణ జరుగుతోంది. నేడు హైకోర్టు ఏపీలో సినిమా టికెట్ల ధరలపై మరోసారి విచారణ చేపట్టనుంది.