మహారాష్ట్రలోని గోండియాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ప్యాసింజర్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి పైగా గాయపడ్డారు. గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో తెల్లవారుజామున 2.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఎలాంటి మరణాలు సంభవించలేదు.