ఎమ్మెల్యే కారును కడిగిన పోలీసు.. వీడియో వైరల్. మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ పోలీసు తన కారును కడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు ప్రశ్నలు సంధించారు. విశేషమేమిటంటే.. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ సప్కల్ కూడా వీడియోను…
మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ నియామకం ఏపీలో మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి కుమార్లు ఉండనున్నారు. ప్రస్తుతమున్న మద్యం పాలసీని కేబినెట్ సబ్ కమిటీ సమీక్షించనుంది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను…
బీజేపీలోకి కొల్లం గంగిరెడ్డి..! క్లారిటీ ఇచ్చిన పురంధేశ్వరి.. అంతర్జాతీయ రెడ్ శాండల్ స్మగర్గా పేరున్న కొల్లం గంగిరెడ్డి.. చూపు ఇప్పుడు బీజేపీ వైపు ఉందనే చర్చ సాగుతోంది.. ఆయన త్వరలోనే బీజేపీ కండువా కప్పుకుంటారనే వ్యవహారం.. బీజేపీలో వివాదాస్పదంగా మారందని.. కొందరు ఈ పరిణామాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.. అయితే, ఈ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు.. కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరుతున్నారు అనేది ప్రచారం మాత్రమేనన్న ఆమె.. ఆ…
కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలపై కీలక చర్చ.. కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తన కారణంగా ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచిపేరు దెబ్బతింటోందని సీఎం తెలిపారు. మీడియా నిండా వాళ్లు చేసిన పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయన్నారు. దీని వల్ల అందరికి చెడ్డ పేరు వస్తోందని చెప్పారు. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని.. జిల్లాలోని ఎమ్మెల్యేలు, నాయకులను మంత్రులే గైడ్ చేయాలని సూచించారు. ఇకపై ఇలాంటివి…
మోడీ దగ్గర రేవంత్ రెడ్డి కి ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి , బండి లకు లేదు.. మోడీ దగ్గర రేవంత్ రెడ్డి కి ఉన్న ప్రాధాన్యత కిషన్ రెడ్డి , బండి లకు లేదని మాజీమంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ కాంగ్రెస్సే మోడీకి బీ టీమ్ గా పని చేస్తోందని అన్నారు. రేవంత్ సీఎం కావడం మోడీ చాయిసే అన్నారు. వాల్మీకి కుంభకోణంలో టీ కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉన్నా బీజేపీ…
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్కరికి లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నాం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మన రాష్ట్రం నుండి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఎక్కువ మంది ఎంపిక అవ్వాలన్నారు. వాళ్లకు ఆర్థిక ఇబ్బంది నీ కొంతైనా తగ్గించాలని లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, లక్ష…
ఇండిగో ఎయిర్లైన్స్ టికెట్ బుకింగ్ పై టీమిండియా క్రికెటర్ అసంతృప్తి.. ఇండిగో ఎయిర్లైన్స్పై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే చేసిన పోస్ట్ ను రీపోస్ట్ చేస్తూ.. ‘ నేను ప్రయాణిస్తున్న విమానంలోనూ ఇలాంటి ఘటన ఎదురైంది. ఇండిగో ఎయిర్ లైన్స్లో ఇది సర్వ సాధారణమైపోయింది. మీతో ముందు పేమెంట్ చేయిస్తాయి. ఆ తర్వాత వారికి ఇష్టమైన సీటింగ్ ఇస్తారు. మనం ఏం కోరుకున్నా…
రిజిస్ట్రేషన్లలో ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, అద్దె వాహనాల ఛార్జీలు మొదలైన వాటికి అవసరమైన బడ్జెట్ అవసరాలను త్వరలో క్లియర్ చేస్తామన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత ప్రభుత్వ భవనాల ఆవశ్యకతను మంత్రి ప్రస్తావిస్తూ, త్రిముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నామని, దీని కింద అన్ని రిజిస్ట్రేషన్…
ముస్లింలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే బీజేపీ చూస్తోంది! ముస్లింలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే బీజేపీ చూస్తోందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వక్ఫ్ బోర్డును విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని, దేశ వ్యాప్తంగా ముస్లింలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందూ మెంబర్లను పెట్టాలని ఎందుకు చెబుతున్నారు? అని ప్రశ్నించారు. వక్ఫ్కు వ్యతిరేకంగా బీజేపీ బిల్ ప్రవేశపెడుతుందని, వక్ఫ్ను ఖతం చేయాలని అనుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ముస్లింలు లేకుండా…
త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభమెప్పుడంటే..? వందే భారత్ స్లీపర్ రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులకు శుభవార్త. వందే భారత్ రైళ్ల విజయవంతమైన తర్వాత.. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే యోచిస్తోంది. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించాలని భావిస్తున్నారు. కాగా.. వందే భారత్ స్లీపర్ రైలు వందే భారత్ సిరీస్ యొక్క మూడవ వెర్షన్. ఈ సిరీస్ రైళ్లలో చైర్-కార్…